రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ జన్మదిన్నాని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో చేవెళ్లలోని బస్టాండ్లో చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పామేన భీమ్ భారత్, సోనియా గాంధీ మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన అనంతరం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాగాంధీ జన్మదిన్నాని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న 6 గ్యారంటీలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఈరోజు ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని మిగతా 6 గ్యారంటీలను అతి త్వరలోనే పూర్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే చేవెళ్ల సర్పంచ్ శైలజా రెడ్డి మాట్లాడుతూ.. ముందుగా సోనియా గాంధీ కీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చే లోకల్ భాడి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కీ మద్దతు తెలపాలని అమె కోరారు. తెలంగాణా మహిళల తరుపున మరొకసారి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల ప్రయాణికులు మాట్లాడుతూ.. మేము ఎప్పుడు అనుకోలేదని ఇలాంటిది ఉచిత ప్రయాణం చేస్తామని అని చాలా సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపారు.
bheem bharath
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా ఈరోజు షాబాద్ మండలంలోని పోలారం, గోపి గడ్డ మరియు సీతారాంపురం గ్రామాలలో ప్రచారాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భీమ్ భరత్. ఈ నేపథ్యంలో ఆయన సీతారాంపురం లో ఉన్న శ్రీ సీతారాముల స్వామి దేవస్థానాన్ని దర్శించుకుని అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు…
సీతారాంపూర్ లో ఉన్న శ్రీ సీతారాముల స్వామి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని ఎలాంటి పక్షపాతం చూపించకుండా, కుటుంబ పాలన చేయకుండా ప్రజలకే నా సేవ అంకితం చేస్తానని ఆయన సీతారాముల సాక్షిగా ప్రమాణం చేశాడు. ఈ నేపథ్యంలో కెసిఆర్ రైతుబంధు గురించి చెప్పిన మాటలకు ఆయన కౌంటర్ ఇస్తూ..
రైతుబంధు అనేది కాంగ్రెస్ పార్టీ ఆప్తే ఆగేది కాదని ఎలక్షన్ ఉన్నందున ఎలక్షన్ కమిషన్ ఆపేసిందని ఈ విషయం తెలియని కెసిఆర్ సోయండి మాట్లాడుతున్నాడా లేక తాగి మాట్లాడుతున్నాడో తెలియడం లేదని లేక మందేసి మాట్లాడుతున్నాడో నాకు అర్ధం కావడం లేదనీ కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులకు రైతుబంధును అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఈ సంద్భంగా ఆయన మీడియాతో తెలిపారు.
Read Also…
Read Also…






Total views : 79670