రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉమ్మడి పశ్చిమగోదావరి లో అస్తవ్యస్తంగా మారింది. ఏలూరు ఇండోర్ స్టేడియంలో గత మూడు రోజులుగా తూతూ మంత్రంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. కనీసం క్రీడాకారులకు క్రికెట్ కి సంబంధించిన క్రీడ పరికరాలు అందజేయకుండా క్రీడలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రదేశాలలో ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రీడ పరికరాలు నాసిరకంగా ఉండటం వల్ల క్రీడాకారులే తమ క్రీడ పరికరాలను ఏర్పాటు చేసుకోవడం తో పలు విమర్శలు కు తావిస్తున్నాయి. క్రీడలను నిర్వహిస్తున్న అధికారులను వివరణ అడగగా పొంతనలేని సమాధానం చెబుతూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడల పేరుతో ప్రభుత్వం కోట్లాది రూపాయలు ప్రజా ధనం దుర్వినియోగం చేస్తుందని పలువురు ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంబాబు ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి అందిస్తారు.
breaking news political news
తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రగతి ప్రస్థానాన్ని స్వేదపత్రం పేరిట బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పవర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి గెలుపు, ఓటమిలోనూ పాఠాలు ఉంటాయని కెటిఆర్ అన్నారు. ఎక్కువ వేతనాలు ఇచ్చి, ఉద్యోగాలిచ్చి చెప్పుకోలేక పోయామన్నారు. ఓటమి మాకు కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని కెటిఆర్ స్పష్టం చేశారు. వంద రోజుల్లో. హామీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తాము షాడో టీమ్ ను ఏర్పాటు చేసుకుంటామని చెప్పారు. నిరుద్యోగ భృతిపై కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే నాలుక మడత వేసిందన్నారు. ఆరు గ్యారెంటీలే కాదు, కాంగ్రెస్ 412 హామీలు ఇచ్చిందని కెటిఆర్ గుర్తుచేశారు. సుపరిపాలన అందిస్తారా, కక్ష సాధిస్తారా అన్నది వారి ఇష్టానికే వదిలేస్తున్నామని తెలిపారు. తాము దేనికైనా సిద్ధంగా ఉన్నామన్న కెటిఆర్, ప్రభుత్వం వేసే ప్రతి అడుగును నిశితంగా గమనిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించేది లేదని కెటిఆర్ హెచ్చరించారు.






Total views : 78603