గుంటూరు జిల్లాలో 26వ తేదీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తారని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. సిఎం పాల్గొనే లయోలా స్కూల్ గ్రౌండ్ లో ఏర్పాట్లను పరిశీలించారు. ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్రా కార్యక్రమాన్ని సిఎం జగన్ ప్రారంభిస్తారని తెలిపారు. జిల్లాలో లక్షా 25 వేల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో విజయం సాధించిన క్రీడాకారులు రాష్ట్రస్తాయిలో పాల్గొంటారని తెలిపారు. సీఎం పర్యటన నిమిత్తం భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశామని ఎస్పీ అరీఫ్ హఫీజ్ అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.
Chief Minister YS Jaganmohan Reddy.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు కడప జిల్లా పర్యటనలో భాగంగా సింహాద్రిపురంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం ఇడుపులపాయ నివాసం నుంచి బయలుదేరి వైఎస్సార్ ఘాట్కు చేరుకుంటారు. ఘాట్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొని నివాళులర్పిస్తారు. అనంతరం ప్రార్థనా మందిరానికి చేరుకుని 11.30 వరకు ప్రార్థనల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.20 గంటలకు సింహాద్రిపురం జూనియర్ కళాశాల సమీపాన ఉన్న హెలిప్యాడ్కు చేరుకుంటారు. 12.40 గంటల వరకు సింహాద్రిపురం మండల ప్రజాప్రతినిధులతో మాట్లాడుతారు. అనంతరం సింహాద్రిపురంలోని రోడ్డు వెడల్పు, సుందరీకరణ, వైఎస్సార్ పార్క్, తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్, ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3 గంటలకు ఇడుపులపాయ హెలిప్యాడ్లో దిగుతారు. ఎకో పార్క్ మీటింగ్ ప్రదేశానికి చేరుకుంటారు. పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. 4.45 గంటలకు గెస్ట్హౌస్కు చేరుకుని, ఆ రాత్రి అక్కడే బస చేస్తారు.
Read Also..
Read Also..
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ యాప్ను డౌన్లోడ్ చేయించడం.. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పిండమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి రూ.25 లక్షల దాకా పెంపును సైతం ఆయన ప్రారంభిస్తారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్ వైద్యం అందించేందుకు తీసుకొచ్చిందే డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం. దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ.. మరింత బలోపేతం చేసే కార్యక్రమాన్ని సీఎం జగన్ సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఇక నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది.





Total views : 75406