Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Andhra Pradesh వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం…

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ అవగాహన కార్యక్రమం…

by Prakash
YSR Arogyasree Awareness Program...

వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీపై అవగాహన కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు. ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించడం.. అలాగే ఈ పథకం ద్వారా వైద్యం ఎలా పొందాలనే దానిపైనా అర్హులకు అవగాహన కల్పిండమే ఈ కార్యక్రమ ఉద్దేశం. దీంతో పాటు కొత్త ఫీచర్లతో మెరుగైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ.. ఆరోగ్యశ్రీ ద్వారా అందించే వైద్యం పరిధి రూ.25 లక్షల దాకా పెంపును సైతం ఆయన ప్రారంభిస్తారు. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన ఉచిత కార్పొరేట్‌ వైద్యం అందించేందుకు తీసుకొచ్చిందే డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం. దీనికి మరిన్ని మెరుగులు దిద్దుతూ.. మరింత బలోపేతం చేసే కార్యక్ర­మా­న్ని సీఎం జగన్‌ సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తారు. ఈ పథకం కింద ఇక నుంచి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్యం అందనుంది.

Advertisements

You may also like

Our Visitor

026185
Total views : 150011

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.