విశాఖ ఉక్కు ప్రైవేటేకరణకు వ్యతిరేకంగా నెల్లూరులో విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం వెయ్యి రోజులకు చేరుకున్నసందర్భంగా నెల్లూరు ఆర్టీసీ కూడలి వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహించాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రధాని మోదీతో చేతులు కలిపి.. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అధాని కి దారా దత్తం చేస్తున్నారని విద్యార్థి సంఘాల నేతలు విమర్శించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, కడప ఉక్కును స్థాపించాలని ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి చిన్న బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.
cm jagan
రేపటి నుంచి వై ఏపీ నీడ్స్ జగన్ క్యాంపెయిన్ను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంతో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలకు ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమైందని చెప్పారు. సంక్షేమం ద్వారానే అభివృద్ధి అని నిరూపించామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించామన్నారు. టీడీపీ పాలనలో తలసరి ఆదాయంలో రాష్ట్రం 17వ స్థానంలో ఉందని చెప్పారు. ప్రస్తుతం 9 స్థానానికి తీసుకొచ్చామని పేర్నొన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లక్షల 93 వేల ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు. కోవిడ్ సమయంలో దేశంలోనే ఏపీని రోడ్ మోడల్గా నిలిపామన్నారు. కోవిడ్ సమయంలో సురక్షితంగా ఉన్నామనే భావన ప్రజల్లో కలిగిందన్నారు. మేనిఫెస్టోను సీఎం జగన్ వవిత్ర గ్రంథంగా భావించారని చెప్పారు. మేనిఫెస్టో అమలును గీటురాయిగా నిర్ణయించారని పేర్కొన్నారు. 2019లో ఏపీ జీఎస్డీపీ 22వ స్థానం, 2021-2022లో తొలిస్థానంలో ఉందన్నారు. అభివృద్ధి పరంగా అద్భుతమైన ప్రగతి సాధించామని సజ్జల వెల్లడించారు.
కృష్ణాజిల్లా గుడివాడ పెద్ద కాలవ సెంటర్లో వినూత్న నిరసన చేపట్టారు. సీఎం జగన్ ఫ్లెక్సీ కు చెప్పుల దండ వేసి, దళిత మహిళ నేత అసిలేటి నిర్మల పిండ ప్రదానం చేశారు. దళితబిడ్డ అని చెప్పుకునే సీఎం జగన్, రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను ఖండించనందుకు ఈ నిరసన చేపట్టారు. దళితులపై మూత్ర విసర్జన చేసినా.. స్పందించలేదని సీఎం జగన్ కి పశువుల అశుద్ధంతో పిండ ప్రదానం చేస్తున్నానని నిర్మల వీడియోలో తెలిపారు. దళిత బిడ్డగా, సోదరుడిగా, మేన మామగా సీఎం జగన్ చచ్చిపోయాడని అందుకే నేడు పిండ ప్రధానం చేస్తున్నట్లు నిర్మల సోషల్ మీడియా ద్వారా చెప్పారు.
విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్లో ఆర్టీసీ బస్సు బీభత్సంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్టాండ్లో చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీబస్సు ప్రమాదవశాత్తూ ఫ్లాట్ఫాంమీదకు దూసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు సీఎం వైఎస్ జగన్కు వివరించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు తక్షణమే పరిహారం అందించాలని…గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీచేశారు. ఇకపోతే విజయవాడలో సోమవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లాల్సిన లగ్జరీ బస్సు నెహ్రూ బస్టాండ్లో బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో కండక్టర్, ఓ మహిళా, మరో చిన్నారి కూడా మృతి చెందారు. ప్లాట్ ఫామ్ 12 దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిలై ఫ్టాట్ ఫాం పైకి దూసుకెళ్లిన దూసుకెళ్లినట్లు తెలుస్తోంది. డ్రైవర్ రివర్స్ గేర్ బదులు ఫస్ట్ గేర్ వేయడమే ప్రమాదానికి కారణం అని తెలుస్తోంది.
కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణలో తగ్గని పేదరికం.. APలో CMజగన్ నాలుగేళ్ల పాలనలో తగ్గిందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. ‘వర్షమొస్తే HYDలో అన్నీ కొట్టుకుపోతున్నాయి. తెలంగాణ సెంటిమెంట్ ఇక వర్కౌట్ కాదు. రైతుల నుంచి బియ్యాన్ని కొనలేకపోతున్నామన్న కేసీఆర్ వ్యాఖ్యలు తప్పు. APలో పండుతున్న సన్నబియ్యాన్నే ఎక్కువ ధరకు కొని TS వాళ్లు తింటున్నారు. 3 రాజధానుల విజన్లో APని అభివృద్ధి చేస్తాం’ అని అన్నారు.
నీటి పారుదల రంగంపై సదస్సు జరగడం శుభపరిణామం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్ సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐసీఐడీ కాంగ్రెస్ ప్లీనరీని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న దేశ, విదేశీ ప్రతినిధులకు సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎం జగన్ అన్నారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉంది. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యం. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో తరచూ కరవు వస్తోంది. వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలి. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నాం’’ అని సీఎం జగన్ పేర్కొన్నారు.
అమరావతి సీఎం క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం జగన్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించారు. “స్వాతంత్రోద్యమంలో ఆంధ్రులు” పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఉత్సవాలకు మంత్రులు రోజా, ఉషాశ్రీచరణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సామాజికంగా వెనుకబడిన వర్గాలను ముందుండి నడిపిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష అన్నారు. గతంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలను ఓట్ బ్యాంకుగా వాడుకొని వదిలేసేవారని అన్నారు. ఉదయగిరి పట్టణంలో వైసీపీ నేత మేకపాటి రాజగోపాల్ అధ్యక్షతన జరిగిన సామాజిక సాధికార బస్సుయాత్ర బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష మాట్లాడారు. తొలుత పంచాయతీ బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా బహిరంగ సభ చేరుకున్నారు. సభలో మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రాబోవు ఎన్నికలలో ప్రతిపక్షాలు అడ్డొచ్చినా ముందుకు సాగుతామన్నారు. ర్యాలీలో భారీగా పాల్గొన్న కార్యకర్తలు, ప్రజలు సభ మధ్యలేనే వెళ్లిపోవటంతో సభ వెలవెలబోయింది.