భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభ సర్వం సిద్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు సుమారు 60000 మంది వస్తారని అంచనా.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తోంది. నేటి నుంచి రెండవ విడత ప్రచార కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మొత్తం 54 ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
నేడు సీఎం కేసీఆర్ భద్రాచలం, పినపాక రెండు నియోజకవర్గాలకు కలిపి బూర్గంపాడు లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు.
ఏజెన్సీ ఏరియాలు కావడం వల్ల కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Tag:
cm kcr meeting
కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం..అన్నీ ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలసుకోవాలని.. అభ్యర్థి కంటే పార్టీ చరిత్ర చూసి ఓటెయ్యాలన్నారు. సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందన్నారు.
సింగరేణి తెలంగాణ ఆస్తి అని చేత కాని దద్దమ్మల పార్టీ కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. అందుకే కేంద్రానికి 49 శాతం వాటా ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చాక..బీఆర్ఎస్ పాలనలో సింగరేణి లాభాలను రూ.419 కోట్ల నుంచి…రూ.2,184 కోట్లకు తీసుకెళ్లామని కేసీఆర్ తెలిపారు.





Total views : 79278