సీఎం కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని, కామారెడ్డి లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాలలో విలేకరులతో మాట్లాడుతూ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గెలుపు గోడమీద రాత అని, కామారెడ్డి లో రేవంత్ రెడ్డి గెలుపు ఖాయం అయిందని తెలిసి, సీఎం కేసీఆర్ మళ్లీ గజ్వేల్ కు పోతున్నారన్నారు. గజ్వేల్ లో సైతం కేసీఆర్ ఓటమి ఖాయమైనని, రానున్న రోజుల్లో ప్రతిపక్ష పాత్ర ఎలా పోషిస్తారో వేచి చూడాలన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లు ఇప్పటికైనా తెలుసుకున్నారని, తెలంగాణ ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారన్నారు.
CM KCR
నల్లగొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలం నెల్లికల్ లిఫ్ట్ శిలాఫలకం వద్ద నల్గొండ జిల్లా బిజెపి అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇక్కడ 40 సంవత్సరాలుగా లిఫ్ట్ పేరు చెప్తూ ఇక్కడ ఉన్న గిరిజనులు మభ్యపెట్టి మోసం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 ఎలక్షన్స్ లో నెల్లికలు లిస్టు నీళ్లు పారియకపోతే మేము ఓట్లు అడగం అన్నారు. నోముల నరసింహయ్య మరణానంతరం వచ్చిన ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి నిల్లికలు ప్రాంతంలో శిలాఫలకం వేసి కుర్చీ వేసుకొని ఇక్కడ నీళ్లు పారిస్తానని హామీ ఇచ్చారు నీళ్లు పారించకుంటే ఓట్లు అడగం నా మంత్రులు మా ఎమ్మెల్యేలు ఎవరు కూడా మీ వద్దకు రారు అని మోసపూరితమైన మాటలు చెప్పి ఇప్పటివరకు ఎలాంటి పనులు మొదలు పెట్టలేదు ఉప ఎన్నికల సమయంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి 18 నెల లో నెల్లికల్ లిఫ్టు పూర్తికాకపోతే నా మంత్రి పదవికి రాజీనామా చేసి ఓట్లు అడగం అని చెప్పారు ఎక్కడ పోయాడు మంత్రి జగదీశ్వర్ రెడ్డి . అలాగే ముఖ్యమంత్రి గారికి కుర్చీ దొరకక ఇక్కడ రావడం లేదు అని మేమే కుర్చీ వేసి పెట్టినాము ఈరోజు హాలియాకి ప్రజా ఆశీర్వాద సభకు వస్తున్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కుర్చీలో కూర్చొని నీళ్లు పారించవలసిందిగా మా విజ్ఞప్తి.
Read Also..
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం లో కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు దండి సురేష్ పాల్గొన్నారు. వీరికి కాంగ్రెస్ శ్రేణులు, సీపీఐ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట ఇస్తే నిలబడే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలన్నారు. కేసీఆర్ ను నమ్మి రెండు సార్లు ఓట్లేసి గెలిపిస్తే నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని పొంగులేటి విమర్శించారు. మూడోసారి కూడా ముఖ్యమంత్రి కావాలని చంద్రశేఖర్ రావు తహతలాడుతున్నాడని, ఈ సారి BRS పార్టీని కట్టడి చేయకపోతే కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రబుద్ధుడన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే స్థానికుడని అంటున్నారు, ఆయన హైదరాబాద్ ఉంటూ గత ఎన్నికలకి 15 రోజులు ముందు వచ్చాడని, కానీ నేను ఖమ్మం జిల్లాలోనే పుట్టి పెరిగానని అన్నారు. ఈ ఎమ్మెల్యే అనుచరులు మండలానికి ఒక షాడో ఎమ్మెల్యేలు ఉన్నారని, వారి అరాచకాలకు అడ్డు వేయాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అన్నారు.
శేర్లింగంపల్లిలోని చందానగర్ డివిజన్ లో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందన్నారు ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం వలన ప్రజల మన్ననలు పొందామన్నారు.. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో తొమ్మిది వేల కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు జరిగాయని, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు చేరాయని వాటిని ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడుగుతున్నామన్నారు… బూటకపు మాటలతో బురద చల్లే పార్టీ లను ప్రజలు తిరస్కరించిండానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.. శేరిలింగంపల్లి లో గులాబీ జెండా ఎగుర బోతుందని, హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా కేసీఆర్ రికార్డు కొట్టబోతున్నారని ఉద్ఘాటించారు.
మంచిర్యాల జిల్లా మందమర్రి ప్రైవేటీకరణను ప్రోత్సహించింది బిఆర్ఎస్ ప్రభుత్వమని పార్లమెంటులో 13 మంది ఎంపీలు సంతకం చేయగా ప్రైవేటీకరణ చేయడం జరిగిందని దానిలో బాల్క సుమన్ కూడా ఒక ఎంపీ అని ఈరోజు ప్రైవేటీకరణ ఆపామని వాక్యానించడం పలు ఆశ్చర్యానికి గురి చేస్తుందని బుధవారం ఐ ఎన్ టి యు సి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి intuc యూనియన్ నాయకులు జనక ప్రసాద్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….బాల్క సుమన్ కెసిఆర్ కు ఒక పాలేరుగా ఉంటూ ప్రజలను మభ్యపెడుతూ చెన్నూర్ నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నాడని అన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ సీఎంగా ఉంటూ నియంత పాలన సాగిస్తున్నాడని, కుటుంబ పాలన సాగుతుందని తెలిపారు. వీరి ఆధ్వర్యంలో భారీ చేరికలు జరగగా కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. అనంతరం intuc జనక్ ప్రసాద్ మాట్లాడుతూ…..సింగరేణిలో ఒక్క బొగ్గుభాయి కూడా తవ్వని అసమర్థ సీఎం కేసీఆర్ అని బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక 80000 మందికి ఉద్యోగాలు లేకుండా చేశారని పది అండర్ గ్రౌండ్ మైంన్ డ్లను ప్రారంభిస్తానని చెప్పి ఒక్క మైన్ కూడా తవ్వలేదని 20000 ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్క ఉద్యోగం కూడా ఇప్పియ్యలేదని ఇన్కమ్ టాక్స్ రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయలేదని పేర్లు మార్పిడి చేస్తానని చేయలేదని ఒక భారతదేశంలో కాదు ఇండోనేషియా ఆస్ట్రేలియాల కూడామైన్స్ ఓపెన్ చేస్తానని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చే లేదని చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభలో మేము అధికారంలోకి వస్తే టాక్సీని రద్దు చేసి ప్రభుత్వమే భరిస్తుందని చెప్పగా నువ్వు చేయాలనుకుంటే అధికార పార్టీ ముఖ్యమంత్రి గానే ఉన్నావు కదా రద్దు చేయాలని అనుకుంటే ఒక్క నిమిషం పని అని అన్నారు.తెలంగాణ వస్తే కొత్త ఉద్యోగాలు వస్తాయని ఆశించిన యువకులకు నిరాశ ఎదురయిందని రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారం చేపడితే పాత రోజులు వస్తాయని గడిల పాలన మొదలవుతుందని ప్రజలు బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు.ఇకనైనా సింగరేణి సమస్యలు నెరవేరాలంటే ఈ సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ ని గెలిపించుకోవాలని ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో వివేక్ వెంకటస్వామిని గెలిపించి వారి తండ్రి అయిన వెంకటస్వామి ప్రజల కార్మికుల పక్షాన నిలబడి సమస్యలను పరిష్కరించారో అలాగే వివేక్ వెంకటస్వామి కూడా ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పరిష్కరించేలా చూడవలసిన బాధ్యత ప్రజల పైనే ఉందని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నచో సమస్యలన్నీ నెరవేరుస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే విప్ నల్లాల ఓదెలు,కాంపెల్లి సమ్మయ్య,దేవి భూమయ్య, పాల్గొన్నరు
కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. సిర్పూర్ కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ప్రజాస్వామ్యం పరిణితి చెందలేదన్నారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయన్నారు. వ్యక్తి గుణగణాలు, సేవా తత్పరతను ప్రజలు చూడాలన్నారు. పార్టీకి ఉండే చరిత్ర, వాటి విధానాల గురించి ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ప్రజల దగ్గర ఉండే ఏకైక ఆయుధం ఓటు అన్నారు. ఇవాళ వేసే ఓటు ఐదేళ్ల తలరాతను నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమాన్ని అణచివేసిందన్నారు. కాంగ్రెస్ కారణంగా 58 ఏళ్లు కష్టపడ్డామన్నారు. కాంగ్రెస్ ఢోకా భాజీ పార్టీ అన్నారు. తాను అమరణ దీక్ష చేస్తేనే కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. భూములపై పెత్తానాన్ని రైతులకు ఇచ్చామన్నారు. పెట్టుబడి సాయంగా రైతుబంధు అందిస్తున్నామన్నారు. ఏ ఊరిలో పండే ధాన్యాన్ని ఆ ఊరిలోనే కొంటున్నామన్నారు. రైతుల హక్కుల కోసం ధరణి పోర్టల్ తెచ్చామన్నారు. తెలంగాణ వ్యవసాయం, భూమి విలువ పెరిగిందన్నారు. ఈ సభ అనంతరం కేసీఆర్ హెలిక్యాప్టర్ లో ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరారు. అయితే… సాంకేతిక లోపం వలన హెలిక్యాప్టర్ లో ప్రయాణం కుదరలేదు. దీంతో కాగజ్ నగర్ నుంచి ఆసిఫాబాద్ కు బస్సులో ప్రయాణించారు.
Read Also..
Read Also..
కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జనసందోహంతో హోరెత్తిపోయింది. గులాబీ బాస్ అభిమానులు భారీగా ఈ సభకు తరలివచ్చారు. ఈ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఓటు చాలా విలువైనదని…ప్రతి ఒక్కరూ ఓటు హక్కును చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలని తెలిపారు. బీఆర్ ఎస్ పార్టీ వచ్చాక అభవృద్ది ఏ తరహాలో ఉంది చూసి తమను గెలిపించాలన్నారు సీఎం కేసీఆర్. ఈ సభ అనంతరం కేసీఆర్ హెలిక్యాప్టర్ లో ఆసిఫాబాద్ ప్రజా ఆశీర్వాద సభకు బయలుదేరారు. అయితే… సాంకేతిక లోపం వలన హెలిక్యాప్టర్ లో ప్రయాణం కుదరలేదు. దీంతో కాగజ్ నగర్ నుంచి ఆసిఫాబాద్ కు బస్సులో ప్రయాణించారు.
తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి సీఎంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ విజయాన్ని సాధిస్తారని ఆకాంక్షించారు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ. నేడు వివేకానంద నగర్ లోని తన నివాసం నుండి నామినేషన్ వేయడానికి ర్యాలీగా బయలుదేరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శేరిలింగంపల్లిలోని రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి బిఆర్ఎస్ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు.
ఎంత మంది తీస్మార్ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు
కేసీఆర్ ప్రజాభిమానం ముందు ఎంత మంది తీస్మార్ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కల్వకుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో, షాద్నగర్ చౌరస్తాలో అభ్యర్థి అంజయ్యయాదవ్తో కలిసి నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటున్న కాంగ్రె్సకు గతంలో ప్రజలు 11సార్లు ఇస్తే ఏం సాధించారని ప్రశ్నించారు. వారి పాలనలో కరెంట్ లేక రైతులు, తాగు నీరు దొరకక మహిళలు అష్టకష్టాలు పడ్డారన్నారు. రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. కాంగ్రెస్ నేతలు ఐదు గంటల కరెంటు చాలు అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ లేకుండాపోయిందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేశారన్నారు. యుద్ధం చేసే ధైర్యం లేక బరిలో నిలువకుండా పారిపోయాడని విమర్శించారు. తెలంగాణలో గులాబీ జెండా ఉండగా గుజరాత్, ఢిల్లీ రాజుల పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఒంటరి పోరాటమే చేసి, మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు





Total views : 147693