మణిపూర్ పై కాషాయపార్టీ కుట్ర ఉద్దేశ పూర్వకంగానే విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రాష్ట్రాన్ని తగులబెట్టాలని కాషాయపార్టీ కోరుకుంటోందని అందుకే అల్లర్ల కట్టడికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో మణిపూర్ సురక్షితంగా లేదని ఫైర్ అయ్యారు. ప్రజలు బాధలు అర్థం చేసుకోవడానికి ఒక్క రోజు కూడా ప్రధాని మోడీ మణిపూర్ను సందర్శించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ ఆయనను క్షమించబోరని తెలిపారు. మణిపూర్ను కాల్చివేయాలని బీజేపీ ఉద్దేశపూర్వకంగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని, ఈ పరిణామాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని వెల్లడించారు.
ఈ నెల 7 నుంచి జరిగిన ఘర్షణల్లో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారని అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మహారాష్ట్రలో జరగాల్సిన ఎన్నికల ర్యాలీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రద్దు చేసుకున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్పై ఇంగ్లండ్ ఘన విజయం.వావ్! హ్యారీ బ్రూక్ మరియు అతని జట్టు నుంచి ఇది నిజంగా అద్భుతమైన ప్రదర్శన. ఇన్నింగ్స్ మధ్యలో, బంతి పిచ్పై నెమ్మదిగా ఆగుతున్న పరిస్థితుల్లో భారత్కు పోరాడే అవకాశం ఉందా అన్న సందేహం కలిగింది. 159 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో…
- రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.రైతులు అన్నం పెట్టే దేవుళ్ళతో సమానం, వారిని ఇబ్బంది కలిగించకూడదని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల మంత్రి ,జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, రెవెన్యూ అటవీ అధికారులతో సమావేశం నిర్వహించారు. సోమశిల…
- బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాశ్ నడ్డా సందర్శించారు. కేంద్రమంత్రితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, లక్ష్మణ్లు ఈ పర్యటనలో పాల్గొన్నారు.…
- యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ప్రారంభోత్సవం.హైదరాబాద్లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించాలనేది తన డ్రీమ్ అని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ, గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్ను భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి ఆయన ప్రారంభించారు.…
- ఇరాన్పై అదనపు దాడుల నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.ఇరాన్పై అదనపు దాడులు ముమ్మరమైన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఇప్పటికే సైనికంగా విజయం సాధించామని, ప్రస్తుతం ఇరాన్ వద్ద చాలా తక్కువ వనరులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన ప్రకటించారు. అమెరికా చర్యలతో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Total views : 198208