మణిపూర్ పై కాషాయపార్టీ కుట్ర ఉద్దేశ పూర్వకంగానే విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రాష్ట్రాన్ని తగులబెట్టాలని కాషాయపార్టీ కోరుకుంటోందని అందుకే అల్లర్ల కట్టడికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో మణిపూర్ సురక్షితంగా లేదని ఫైర్ అయ్యారు. ప్రజలు బాధలు అర్థం చేసుకోవడానికి ఒక్క రోజు కూడా ప్రధాని మోడీ మణిపూర్ను సందర్శించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ ఆయనను క్షమించబోరని తెలిపారు. మణిపూర్ను కాల్చివేయాలని బీజేపీ ఉద్దేశపూర్వకంగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని, ఈ పరిణామాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని వెల్లడించారు.
ఈ నెల 7 నుంచి జరిగిన ఘర్షణల్లో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారని అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మణిపూర్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మహారాష్ట్రలో జరగాల్సిన ఎన్నికల ర్యాలీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రద్దు చేసుకున్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- దేశీయ స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం..అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలు, ఇంధన ధరల మంటల కారణంగా గత వారం దేశీయ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. గత వారం రోజుల్లో సెన్సెక్స్ 2.70 శాతం, నిఫ్టీ 2.20 శాతం మేర పతనమయ్యాయి. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్…
- తమిళ ఫిల్మిండస్ట్రీలో విషాదం..ప్రముఖ తమిళ సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు కె. రాజన్ ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని అడయార్ నదిపై ఉన్న తిరు-వి-కా వంతెన పైనుంచి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించే వ్యక్తిగా పేరున్న రాజన్ ఆకస్మిక మరణం…
- ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది.ప్రధాని మోడీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం దక్కింది. స్వీడన్ దేశపు అత్యున్నత పురస్కారంతో ఆయనను సత్కరించారు. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్, కమాండర్ గ్రాండ్ క్రాస్సతో మోడీని సత్కరించింది స్వీడన్ ప్రభుత్వం. ఒక ప్రభుత్వ అధినేతకు స్వీడన్ అందించే…
- ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ??ప్రముఖ పుణ్యక్షేత్రం కాళేశ్వరంలో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు జరగనున్న సరస్వతి నది అంత్య పుష్కరాలకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పుష్కరాలకు హాజరు కావాల్సిందిగా దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నేతృత్వంలో…
- తెలంగాణ ఎజెన్సీ ప్రాంతాల్లో మొదలైన తునికాకు సేకరణ .గిరిజనులకు వ్యవసాయం తర్వాత రెండో జీవనాధారమైన తునికాకు సేకరణ ప్రక్రియ మొదలైంది. అడవుల్లో లభించే ఈ ఆకులను సేకరించి గిరిజనులు ఆదాయం పొందుతారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని అడవుల్లో తునికాకు విస్తృతంగా లభిస్తుంది. బీడీలు తయారు చేయడానికి…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి






Total views : 80005