Saturday, June 20, 2026
News Navigation
Saturday, June 20, 2026
News Navigation

Breaking

Saturday, June 20, 2026
Home Latest News మణిపూర్ పై కాషాయపార్టీ కుట్ర

మణిపూర్ పై కాషాయపార్టీ కుట్ర

by Rama
మణిపూర్ పై కాషాయపార్టీ కుట్ర

మణిపూర్ పై కాషాయపార్టీ కుట్ర ఉద్దేశ పూర్వకంగానే విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. రాష్ట్రాన్ని తగులబెట్టాలని కాషాయపార్టీ కోరుకుంటోందని అందుకే అల్లర్ల కట్టడికి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో మణిపూర్ సురక్షితంగా లేదని ఫైర్ అయ్యారు. ప్రజలు బాధలు అర్థం చేసుకోవడానికి ఒక్క రోజు కూడా ప్రధాని మోడీ మణిపూర్‌ను సందర్శించలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ ఆయనను క్షమించబోరని తెలిపారు. మణిపూర్‌ను కాల్చివేయాలని బీజేపీ ఉద్దేశపూర్వకంగా భావిస్తున్నట్లు కనిపిస్తోందని, ఈ పరిణామాన్ని రాజకీయాలకు ఉపయోగించుకుంటోందని వెల్లడించారు.

ఈ నెల 7 నుంచి జరిగిన ఘర్షణల్లో సుమారు 17 మంది ప్రాణాలు కోల్పోయారని అయినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో మహారాష్ట్రలో జరగాల్సిన ఎన్నికల ర్యాలీలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా రద్దు చేసుకున్నారు.

FOLLOW US ON : FACE BOOKINSTAGARAMYOU TUBE, GOOGLE NEWS

  • లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.
    రైడ్స్ జరగడం… అధికారులు పట్టుబడడం… ఆ తర్వాత కేసులన్నీ నీరుగారిపోవడం… ప్రస్తుతం అవినీతి నిరోధక శాఖ పరిధిలో జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లో వ్యక్తమవుతున్న అసంతృప్తి ఇది. వ్యవస్థను పట్టిపీడిస్తున్న అవినీతి వైరస్‌కు వ్యాక్సిన్ వేయాల్సిన ఏసీబీ వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.…
  • ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.
    తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి విదేశాల్లో అదృశ్యమై 45 రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిన్‌లాండ్‌లో బీటెక్ చదువుతున్న మణిదీప్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడిని క్షేమంగా తిరిగి…
  • విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.
    ప్రజా ఆరోగ్యానికి రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. విజయవాడ హనుమాన్‌పేటలో ఉన్న ‘డ్రగ్స్ కంట్రోల్ భవన్’ను, ప్రారంభించిన మంత్రి..చంద్రబాబు దార్శనికతతో ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ విజన్‌కు అనుగుణంగా ఆరోగ్యశాఖ పని చేస్తుందన్నారు. విజయవాడ హనుమాన్‌పేటలో డ్రగ్స్ కంట్రోల్…
  • ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట.
    రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా. మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పర్యటించారు. నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అత్యంత కీలకమైన ఈదరపల్లి…
  • అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో కూటమి రెండేళ్ల విజయోత్సవ వేడుకలు.
    అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. నక్కపల్లి మండలం దొడ్డిగల్లు జంక్షన్ నుంచి వేంపాడు టోల్‌ప్లాజా వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో…

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisements

You may also like

Our Visitor

026552
Total views : 150639

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.