రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన చైర్మన్, పాలకవర్గ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకలాంటివని పేర్కొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు, ధాన్యం కొనుగోలు వంటి సేవలను పారదర్శకంగా అందించడంలో పీఏసీఎస్ కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. రైతులకు అవసరమైన సౌకర్యాలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సహకార సంఘాలు రైతులకు మరింత చేరువై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
Tag:




Total views : 223635