ఆసియా ఖండంలో అంత్యంత ఎత్తైన అద్భుతమైన శివాలయం. నిర్మాణానికే 39 ఏళ్లు పట్టిందట. ఈ మందిరం శిల్పకళా నైపుణ్యం ముందు తాజ్ మహల్ కూడా పనికిరాదంటారంతా ఆ విశేషాలు చూద్దాం. హిమాచల్ ప్రదేశ్ సోలాన్ జిల్లా జటోలి టౌన్ లో ఉన్న శివాలయం ఇది. దాదాపు నలభైఏళ్ల కష్టం ఈ అద్భుతమైన దేవాలయం. హిమాచల్ ప్రదేశ్ పర్యాటక ప్రదేశాల్లో ఇది అత్యంత ఆకర్షించే శివాలయం. శివుడికి జటల నుంచి వచ్చి పేరే జటోలి. ఈ ఆలయం గురించి వినిపిస్తున్న కథనాలు పురాణాల ప్రకారం శివుడు ఇక్కడకు వచ్చి కొంతకాలం ఉన్నాడట. ఆ తర్వాత స్వామి కృష్ణానంద్ ఇక్కడకు వచ్చి తపస్సు చేశారనీ ప్రతీతి. బాబా పరమహంస మార్గదర్శకత్వంతో జటోలి శివాలయ నిర్మాణం ప్రారంభమైనట్లు చెబుతారు. ఆలయ నిర్మాణంలో ఎన్నో అద్భుతాలు ఆలయ గోపురం దాదాపు 111 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే సుమారు 100 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ద్రవిడ శైలిలో మూడు వరుస పిరమిడ్లతో నిర్మించారు. మొదటి పిరమిడ్లో , రెండవ పిరమిడ్ లో శేష్ గాన్ శిల్పం, వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఆలయం లోపల, ప్రాంగణంలో వివిధ దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశారు. లోపల స్పటిక మణి శివలింగను స్థాపించడంతో పాటు శివ, పార్వతి విగ్రహాలు కూడా ప్రతిష్టించారు. ఆలయం ఎగువ బాగంలో 11 అడుగుల ఎత్తైన బంగారు మండపాలు నిర్మించారు. ఈ దేవాలయం ఈశాన్య భాగంలో ‘జల్ కుండ్’ అని పిలిచే వాటర్ ట్యాంక్ ఉంది, ఇది పవిత్రమైన గంగా నదిగా భక్తులు భావిస్తారు. ఈ ట్యాంక్ లో నీరు చర్మ రుగ్మతలను పోగొట్టడానికి చికిత్స చేసే కొన్ని ఔషద లక్షణాలను కలిగి ఉండటం విశేషం. అప్పట్లో ఇక్కడ ప్రజలు నీటి సమస్యతో జీవిస్తుండేవారు. అదే సమయంలో స్వామి కృష్ణానంద శివుడిని ప్రార్థించి వర్షం కురిసేలా చేశారని అప్పటి నుంచీ ఈ ప్రదేశంలో నీటి కొరతనేది లేదని చెబుతారు. ఇక్కడ ఉండే గుహలో శివుడు తపస్పు చేశాడని పురాణలు చెబుతున్నాయి. మహాశివరాత్రి ఉత్సవాలు ఈ పురాతన ఆలయంలో ఏటా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు స్థానికులు మాత్రమే కాదు, చుట్టు ప్రక్కల ప్రదేశాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తుంటారు.
Continent of Asia
ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన గుంటూరు మిర్చి యార్డును కేంద్ర కార్మిక శాఖ చైర్మన్ వల్లూరి జయప్రకాష్ నారయణ సందర్శించారు. మిర్చి యార్డులోని కార్మికులను పరామర్శించి వారి సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. కార్మికులుగా వారికి రావలసిన మౌలిక వసతులు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఈ నేపథ్యంలో మిర్చి యార్డు బోర్డు నభ్యులు, అధికారులు… కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తే ఉపేక్షించేది లేదన్నారు. కార్మికులకు కనీసం మంచినీటి సౌకర్యం కానీ, మహిళా కార్మికులకు బాత్రూం సౌకర్యాలు కానీ లేకపోవడం పట్ల మండిపడ్డారు. కార్మికులను మిర్చి యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణకు మధ్య వివాదాలు ఉన్న నేపథ్యంలో వివాదాలు పరిష్కరించాలని కోరారు. కార్మికుల సమస్యల పట్ల తక్షణమే స్పందించి వారికి తగు సదుపాయాలు కల్పించాలి అని అన్నారు. లేనిపక్షంలో భారతీయ జనతా పార్టీ తరపున ఆందోళన చేపడుతామని జయ ప్రకాష్ నారాయణ హెచ్చరించారు.






Total views : 75454