తిరుపతి జిల్లా, సత్యవేడు నియోజకవర్గం, బాలుడి కిడ్నాప్ ఆపై దారుణ హత్య, ఈ వార్త విని ఉలిక్కిపడ్డ వరదయ్యపాలెం,బుచ్చినాయుడు కండ్రిగ మండలాల ప్రజలు, తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా పాదిరివేడు గ్రామానికి చెందిన హాహిష్(8) బాలుడిని కిడ్నాప్ చేసిన అదే గ్రామానికి చెందిన రేఖా అనే మహిళ. బాలుడి తల్లిదండ్రులను డబ్బులు డిమాండ్ చేసి ఇవ్వకపోవడంతో బుచ్చినాయుడు కండ్రిగ మండలం వరత్తూరు గ్రామ సమీపంలో బాలుడిని హత్య చేసి చెట్ల పొదల్లో మూటగట్టి పడవేసిన పరారైన మహిళ రేఖ. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తమిళనాడుకు తరలించిన తమిళనాడు పోలీసులు. వరదయ్యపాలెం మండలంలోని కాంభాకం లోని ఓ వ్యక్తి సహాయంతో ఈ దారుణానికి పాల్పడిన రేఖ. వరదయ్యపాలెం మరియు బుచ్చినాయుడు కండ్రిగ మండలాల పోలీసుల సాయం తీసుకొని కేసును చేదించిన తమిళనాడు పోలీసులు.
Crime
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం లో దొంగల హల్చల్, మాచర్ల నెహ్రూ నగర్ 2వ. లైన్ లో నివాసం ఉంటున్న మేకల సురేష్ ఇంట్లో దొంగతనం. శనివారము రెంటచింతలో అత్త రింటికి వెళ్లి ఆదివారం తిరిగి మధ్య హనం ఇంటికి వచ్చి చూసుకునే లోపు దొంగతనం, సుమారు మూడు లక్షల బంగారు ఆభరణాలు, 50000 నగదు దొంగతనం జరిగిందని మాచర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేస్ నమోదు చేసి విచారిస్తున్న పోలిసులు.
హైదరాబాద్ పాతబస్తీలో కెమికల్ బ్లాస్ట్ అయింది అందులో వృద్దుడు తీవ్రంగా గాయపడ్డాడు స్థానికులు బండ్లగూడ పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వృద్ధుడి పరిస్తితి ఆందోళన కరంగ వుంది అని తెలిసింది ఒస్మానియా లో చికిత్స పొందుతూ ఉన్నట్లు సమాచారం, వివరాల్లోకి వెళితే బండ్ల గూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని క్రిస్టల్ టౌన్ షిప్ లోని ఒక ప్లాట్ లో చుట్టూ ప్రహరీ గోడ ఉండటం ఆ ప్లాట్ అహ్మద్ నజీర్ అడ్వకేట్ ది అందులో కి హమీద్ హుస్సేన్ అనే వ్యక్తి లోపలికి ఎలా వెళ్ళాడు తెలియదు కానీ అక్కడ ఏదో వెదుకుతూ ఉండగా ఒక్క బ్లాస్ట్ అవ్వటం ప్రక్కనే ఉన్న మసీదు కిటికీ అద్దాలు కూడా పగిలి పోవటం తో పెద్ద ఎత్తున చప్పుడు కావటం తో స్థానికులు వచ్చి చూడగా హమీద్ తీవ్రంగా గాయపడి ఉండటం తో పోలీసులకు సమాచారం అందించారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
2012 నాటి ఢిల్లీ గ్యాంగ్ రేప్ తరహాలో రాజస్థాన్లో మరో దారుణం వెలుగుచూసింది. కదులుతున్న బస్సులో బాలికపై అత్యాచారం జరిగింది. కాన్పూర్ నుంచి జైపూర్ వెళుతున్న బస్సులో ఓ బాలికపై ఇద్దరు డ్రైవర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి సమయంలో ఈ ఘటన జరిగిందని బస్సీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఫూల్చంద్ మీనా మీడియాకు వెల్లడించారు. జైపూర్లోని తన మామయ్య ఇంటికి వెళ్లేందుకు రాత్రి సమయంలో బాలిక బస్సు ఎక్కింది. సీటు దొరక్కపోవడంతో బస్సు క్యాబిన్లో కూర్చుంది. క్యాబిన్లో కూర్చున్న కొందరు ప్రయాణికులు తమ గమ్యస్థానాల్లో దిగిపోయాక డ్రైవర్లు ఇద్దరు బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. వంతులవారీగా ఆమెపై అత్యాచారం చేశారని ఫూల్చంద్ మీనా వివరించారు.
కృష్ణా జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. పంట బోదిలోకి దూసుకుపోయింది. చల్లపల్లి మండలం మేకవారిపాలెం వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఆర్టీసీ బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇదే ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. తరచూ ఇలాంటి దుర్ఘటనలు చోటుచేసుకున్నా ఎందుకు ఇదే ప్రాంతంలో జరగుతున్నాయన్న దానిపై అధికారులు ఆరా తీయలేకపోతున్నారని విమర్శిస్తున్నారు.
ఏలూరు శివారు జాతీయ రహదారిపై దారిపై దోపిడీలకు పాల్పడుతున్న అంతర రాష్ట్ర దొంగలేనా 5 గురు యువకులు, ఇద్దరు మైనర్లను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. ఏలూరులోని రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద నిందితులను మీడియా ముందు డిఎస్పి అశోక్ కుమార్ ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి నిందితులు అనేక దారి దోపిడీలకు పాల్పడినట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుండి 2 ఆటోలు, 2 బైక్ లు, 2200 నగదు రికవరీ చేసినట్లు వెల్లడించారు. రెండు రోజుల క్రితం కలపర్రు టోల్ ప్లాజా వద్ద రాత్రి సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీ డ్రైవర్ను కత్తితో బెదిరించి దారి దోపిడీకి పాల్పడ్డారని బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు..
ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఒకవైపు భూతల దాడులు మొదలైనప్పటి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. మరో వైపు అంతర్జాతీయ సమాజం క్రమంగా విచక్షణా రహిత దాడులను నిరసిస్తూ దూరమవుతోంది. ఈ ఘటనలు ఆ దేశానికి మింగుడు పడనివే. గాజాపై వైమానిక దాడుల విషయంలో ఇజ్రాయెల్ ను అమెరికా అధ్యక్షుడు బైడెన్ గట్టిగానే హెచ్చరించారు. పౌర మరణాలను తగ్గించకపోతే ప్రపంచ దేశాల మద్ధతు కోల్పోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఉత్తర గాజాలో జరిగిన ఆకస్మిక దాడిలో 9 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించారు. మరోచోట ఒకరు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు 115 మంది ఇజ్రాయెల్ సైనికులు యుద్ధంలో మరణించారు.
నిర్మల్ జిల్లా అమానుష ఘటన చోటుచేసుకుంది. బైంసా మండలంలోని చింతల్ బోరి గ్రామంలో అమానుష ఘటన. నాలుగు వానరాలను చంపి కాల్చి వండుకొని తింటున్న నలుగురిని పట్టుకున్న గ్రామస్తులు, వారి వద్ద లభించిన కాల్చిన వానరం తల,కళ్ళు,చేతులు. వారిని పట్టుకొని నిలదీయడంతో నిజం ఒప్పుకున్న వ్యక్తులు. తాము పూజించే వనారాన్ని ఎందుకు చంపారు అని పట్టుకున్న గ్రామస్తులు.
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం దారితిప్ప గ్రామంలోని నేషనల్ హైవే 216 పై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. మొగల్తురు నుండి రేపల్లె కు వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారిపై ఆటో బోల్తా పడిపోవడంతో తలకు బలమైన గాయాలు తగలడంతో రోడ్డుపై తీవ్ర రక్తస్రావం జరిగింది. సంఘటన ప్రాంతానికి చేరుకున్న మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా, ఎర్రా కృష్ణమూర్తి కాలనీ, సినీ ఫక్కీలో దోపిడి చేసిన దొంగలు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమీపంలో దొంగలు భీభత్సం. మెడ పైన కత్తి పెట్టి ఇంట్లో ఉన్న మహిళను బెదిరించి దోపిడీ. వై.కె.యం కాలనీలో గల శoబాన రాణి అనే మహిళ ఇంట్లో దోపిడీకి పాల్పడిన గుర్తు తెలియని దుండగులు. దాదాపు 13 తులాల బంగారం, 70 వేల నగదు వెండి వస్తువులను అపహరించిన దుండగులు. 100 కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు. భయబ్రాంతులకు గురవుతున్న స్థానికులు. తరచూ ఇలాంటి సంఘటన జరుగుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికుల ఆగ్రహం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు..






Total views : 90621