పంట పొలాలలో రైతులు పడవలు ఉపయోగించవలసిన పరిస్థితి పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పడింది మిచౌంగ్ తుఫాన్ వచ్చి వారం రోజులు దాటిన పంట పొలాలలో నీరు బయటకు వెళ్లకపోవడంతో రైతులకు పడవలే శరణ్యమయ్యాయి. చేపలు రొయ్యల చెరువులలో మందులు కొట్టేందుకు ఉపయోగించే ఐరన్ పడవలు ఇప్పుడు పంట పొలాల్లో రైతులకు ఉపయోగపడుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కొమరాడ లో పూర్తిగా నీట మునిగిన వరి చేలను రైతులతో కలసి పరిశీలించారు రాష్ట్ర టిడిపి కార్య నిర్వాహణ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు రైతులు వరి కోసి వరి పనలను పడవల ద్వారా వడ్డీకి చేరుస్తున్నారని పంట పొలాల నుండి నీరు బయటకు వెళ్లకపోవడానికి వైసీపీ ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యమని కారణమని రైతులు మండిపడుతున్నారు. రైతులకు ప్రభుత్వం అన్ని విధానాలు ఆదుకోవాలని కోళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
cyclone michaung landfall
మిచాంగ్ తుఫాన్ భీభత్సం నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, జిల్లాలోని అన్నిచోట్లా రోడ్లు జలమయం, చాలా చోట్ల రాకపోకలు బంద్. మిచౌoగ్ తుఫాన్ పోతూ పోతూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతంలో బీభత్సం సృష్టించింది . తీరం దాటే సమయంలో వీచిన బలమైన ఈదురు గాలులకు మండలంలోని రుస్తుంబాధ, లిఖితపూడి, భీమవరం రోడ్డులో భారీ వృక్షాలు, కొబ్బరి చెట్లు 30కి పైగా విద్యుత్ స్తంభాలు నేలకోరిగాయి కొన్నిచోట్ల కరెంటు స్తంభాలు ఇళ్లపై కప్పులపై పడ్డాయి. దీంతో చాలా గ్రామాలు లో అంధకారం అలుముకుంది. సాయంత్రం నుంచి వర్షం తీవ్రతం మరింత పెరిగింది. సముద్రంలో అలలుఎగిసి పడుతుండడంతో ప్రజలలో ఇంకా తుఫాన్ భయం విడలేదు.
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, తుఫాను బాధితులకు నష్ట పరిహారం ఇవ్వలేదు గుండు సున్నా ఇవ్వలేదు ఈ జగన్ రెడ్డి అని శ్రీకాళహస్తి లో రీహాబిలిటేషన్ సెంటర్ లో ఉన్న ప్రజల ఆర్తనాదాలు విలపించారు. ముఖ్యమంత్రి జగన్ 2500 నష్ట పరిహారం ఇస్తానని కథలు చెప్పాడు. ప్రజలు తమ భాదను శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా గారికి తెలియజేశారు. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ ఇంత వరకు ఒక్క పైసా కూడా తుఫాను బాధితులకు ఇవ్వలేదు.
ఇదేనా ప్రభుత్వం నిబద్దత అని ఎద్దేవా చేసారు.




Total views : 79310