Devotional
హైదరాబాద్, ఉప్పల్ పీస్ పరిధి పరిసర ప్రాంతాల్లో 100కు పైగా సైకిళ్లు ఇతర సామాగ్రి చోరి చేసిన వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన స్థానికులు. ఇళ్లలోకి దర్జాగా గేటు తీసుకొని ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు. దొంగతనానికి పాల్పడుతున్న దృశ్యాలు సీసీ కెమెరలొ రికార్డ్ అయ్యాయి. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్న ఉప్పల్ పోలీసులు.
నేడు తిరుమలలో ధార్మిక సదస్సు, దాదాపు 57 మంది పాల్గోననున్న మఠాది పతులు, పీఠాధిపతులు. హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ నిర్వహిస్తున్న సదస్సు. గతంలో టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు ఒకసారి సదస్సు నిర్వహణ. మరలా భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా రెండవసారి ఈ సదస్సు నిర్వహణ. తిరుమల లోని ఆస్థాన మండపం లో సదస్సు నిర్వహణ. సదస్సులో పాల్గొని మాట్లాడనున్న టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి.
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి ఈరోజు అనగా న విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి వారు శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి వారు శ్రీ అమ్మవారి ఆలయంనకు విచ్చేయగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామీజీ వారితో పాటుగా గౌరవనీయులైన రాష్ట్ర దేవాదాయశాఖ సలహాదారు శ్రీ జ్వాలాపురం శ్రీకాంత్ గారు విచ్చేశారు. అనంతరం స్వామిజి వారు శ్రీ అమ్మవారిని దర్శనము చేసుకొని, పూజలు నిర్వహించారు. శ్రీ అమ్మవారి దర్శనానంతరము ఆలయ వేద పండితులు, అర్చకుల వారు స్వామీజీ వారికి వేదస్వస్తి పలికారు. అనంతరం ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు గారు, అధికారులు స్వామీజీ వారికి శ్రీ అమ్మవారి ప్రసాదములు, పండ్లు సమర్పించగా, స్వామీజీ వారు అందరికీ అనుగ్రహభాషణము చేశారు.
కృష్ణాజిల్లా, పామర్రు నియోజకవర్గం, కోడి పందాల నిర్వహించే వారిపై కూచిపూడి పోలీసులు దాడి. చిన్నముతేవి గ్రామం నుండి అయ్యంకి గ్రామం వైపు వెళ్ళు కాలువ గట్టుపై కొంతమంది వ్యక్తులు కోడిపందాలు నిర్వహిస్తున్నారని రాబడిన సమాచారం మేరకు దాడి చేసిన పోలీసులు. 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2 కోళ్ళు, 23,200/-రూపాయల నగదు, 6 మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కూచిపూడి ఎస్సై సందీప్. కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా జూద క్రీడలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కృష్ణా జిల్లా, పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం చోడవరంలో అర్ధరాత్రి అక్రమ ఇసుక క్వారీల తవ్వకాలు అడ్డుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్. ఇది మంత్రి జోగి రమేష్ అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు అంటూ క్వారీలో బైఠాయించిన బోడె. నియోజకవర్గ ఇన్చార్జిగా బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లోనే మంత్రి జోగి రమేష్ ఇసుక దందా చేస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదని అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ చోడవరం క్వారీలో ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గం చోడవరం క్వారీ లో జరుగుతున్న అక్రమ ఇసుక దందాను బయటపెట్టేందుకు పెనమలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శుక్రవారం అర్ధరాత్రి క్వారీలో పరిశీలనకు వెళ్లారు. అయితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన జెసి కేసి కంపెనీ కాకుండా అక్రమంగా మరో రెండు చోట్ల ఇసుకను లోడ్ చేస్తున్నారు. ఒకటి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ది కాగా, మరొకటి వైసీపీ పార్టీకి చెందిన రెడ్డిదని స్థానికులు చెప్పారు. బోడె ప్రసాద్ రాకను గమనించిన జోగి రమేష్ అనుచరులు పరారయ్యారు వారితో పాటు పొక్లైన్ ఆపరేటర్లు ఇతర సిబ్బంది కూడా పరారయ్యారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు తెలియజేసిన ఎవరు స్పందించలేదని, పొంతన లేని సమాధానం చెబుతున్నారని బోడె ప్రసాద్ మీడియాకు తెలిపారు. మంత్రి జోగి రమేష్ పెనమలూరు సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించి వారం గడవకముందే ఇసుక దందాకు తెర లేపారని ఇలాంటి వారికి ప్రజలే బుద్ధి చెప్పాలని బోడె ప్రసాద్ కోరారు. అక్రమ మైనింగ్ అడ్డుకోవలసిన అధికారులే అండగా నిలబడటం దారుణమని ఇక్కడ అక్రమ మైనింగ్ ను నివారించే వరకు వారిని విడిచిపెట్టేది లేదని బోడె ప్రసాద్ స్పష్టం చేశారు.
విశాఖ, మధురవాడలో కొమ్మాదిలో mro దారుణం హత్య. కొమ్మది చరణ్ క్యాస్టల్ లో సంచలన రేపిన ఘటన. రూరల్ తహశీల్దార్ సనపల రమణయ్య పై హత్య చేసిన దుండగులు. గుర్తు తెలియని నలుగురు ఇంట్లో చొరబడి రాడ్ లతో దాడి. అక్కడక్కడే కుప్పకూలిన తహసీల్దార్ రమణయ్య. ప్రాణప్రాయం స్థితిలో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తహశీల్దార్ మృతి. ఘటన స్థలానికి క్షుణ్ణంగా పరిశీలించిన సిపి రవిశంకర్ ఆయన్నర్. నిందితులు కోసం పోలీసులు గాలింపు. ఘటన పై జిల్లా కలెక్టర్ సీరియస్…
అయోధ్యలోని బాల రాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం తీర ప్రాంతం శ్రీరామ నామ జపంతో మార్మురోగింది పట్టణం మండలాల్లోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న సమారాధనలు నిర్వహించారు. ప్రసిద్ధిగాంచిన స్టీమర్ రోడ్డు రామాలయంలో వేద పండితులు శేషాచార్యుల ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాన్ని భారీ అన్న సమారాధన నిర్వహించారు. పాత బజార్ రామాలయంలో శోభాయాత్ర, ఆర్యవైశ్య రామాలయంలో రామ జపం , హనుమాన్ చాలిస్ పఠించారు. అనంతరం పలు రామాలయాల్లో దీపాలు వెలిగించి రామ జప నామాన్ని పఠించారు.
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం ఈ రోజు అయోధ్యలోని రామ మందిరం లో బాల రాముని విగ్రహ ప్రతిష్టించుకోవడం కోసం 500 సంవత్సరాలు వేచి చూశామని ఈరోజు నెరవేరిందని విగ్రహన్ని ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రామభక్తులు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఊరు వాడ భక్తిశ్రద్ధలతో శ్రీరామ నామంతో మారుమోగింది వీధి వీధి వాడవాడ భక్తిశ్రద్ధలతో చిన్నలు పెద్దలు అన్న తేడా లేకుండా శ్రీరామ నామస్మరణతో మారుమోగించారు. హిందువుల యొక్క చిరకాల కోరిక అయోధ్య రామ మందిరం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు భారతదేశనికే కాకుండా ప్రపంచ దేశంలో కూడా రాముని యొక్క ప్రతిష్టను పొగుడుతూ రాముని యొక్క గుణగణాలను కీర్తిస్తు దేశంలో మళ్ళీ రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని వ్యక్తం చేసారు.





Total views : 147117