భారతదేశంలో నమ్మశక్యం కానీ వింతలు, విశేషాలు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో దేవతలను తిడుతూ భజిస్తారు, కొన్ని చోట్ల దెయ్యాల్ని వదిలిస్తారు, మరికొన్ని చోట్ల భక్తులు తలలు పగలకొట్టుకుని రక్తాన్ని చిందిస్తారు. ఆధ్యాత్మికతకు ఆలవాలం భారతదేశం అంటారు. 64 కోట్ల దేవతలు కలిగిన ఈ పవిత్ర భూమిలో ఎన్నో విశిష్టతలు, ఎన్నో ప్రత్యేకతలు. ఇక్కడ అడుగడుగునా దేవాలయాలు మనం చూడవచ్చు. కానీ విచిత్రమైన, అసాధారణ దేవాలయాలు కొన్ని మాత్రమే చూడగలం. ఈ దేవాలయాల్లో ఉండే నమ్మశక్యం కాని నిజాలు వీటిని ప్రత్యేకంగా నిలిపాయి. అందులో కొన్ని 2000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవి కావడం విశేషం. అసలు ఈ అసాధారణ దేవాలయాల విశేషాలు ఏమిటి? అవి ఎక్కడ ఉన్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. మహేందిపుర్ బాలాజీ దేవాలయం, రాజస్థాన్ :
రాజస్థాన్ లోని డౌస జిల్లాలోని మహేందిపుర్ బాలాజీ దేవాలయానికి ప్రతి రోజూ వేలాది మంది భక్తులు దెయ్యాల్ని, ఆత్మల్ని వదిలించుకోవడానికి వస్తుంటారు. వీపరీతమైన చర్యల ద్వారా, ఉదాహరణకు శరీరంపై వేడి నీరు పోయడం, పై కప్పు నుంచి వేలాడదీయడం, గోడలకు తలను కొట్టడం, గోడలకు మనిషిని తాళ్లతో కట్టడం వంటివి దుష్టశక్తుల నుంచి బాధితున్ని బయటపడేస్తాయని ఇక్కడ నమ్ముతారు. భారతదేశంలో ఇప్పటికీ భూతవైద్యం జరుగుతున్న ప్రదేశంగా ఈ ఆలయానికి గుర్తింపు ఉంది. ఈ ఆలయంలో ప్రసాదాన్ని ఇవ్వరు. అలాగే ఆలయం నుంచి బయటకు వెళ్లేటప్పుడు భక్తులు వెనక్కి తిరిగి చూడకూడదు అని చెబుతారు. ఎందుకంటే దుష్టశక్తులు దీనిని ఆహ్వానంగా తీసుకుని శరీరంలోకి ప్రవేశిస్తాయని బలంగా నమ్ముతారు.
2. కామఖ్య దేవి ఆలయం, అస్సాం :
అస్సాంలోని గువహతిలో ఉన్న నీలాచల్ కొండపై భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కామాఖ్య దేవి ఆలయం ఉంది. భారతదేశంలోని 51 పురాతన శక్తి పీఠాల్లో ఇది ఒకటి. ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. మహాశివుని భార్య అయిన సతీదేవి యోని ఇక్కడ పూజలందుకుంటుంది. దీనిపై ఎర్రటి వస్త్రాన్ని కప్పుతుంటారు. ప్రతి ఏటా వర్షాకాలం సమయంలో ఈ దేవత రుతుక్రమం జరుగుతుంది. అందుకే ఆ సమయంలో మూడు రోజుల పాటు దేవాలయాన్ని మూసి వేస్తారు. ఆలయం తెరిచే నాల్గవ రోజు వరకూ ఇక్కడ తాంత్రిక సంతానోత్పత్తి పండుగ లేదా అంబుబచి మేళాను జరుపుతుంటారు. ఈ మూడు రోజుల్లో ఆలయంలో అమ్మవారి పీఠం దగ్గర వచ్చే జలం ఎర్రగా వస్తుందని చెబుతారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారికి ఎర్రని వస్త్రాలను కానుకగా సమర్పిస్తుంటారు.
3. దేవ్ జీ మహరాజ్ మందిర్, మధ్య ప్రదేశ్ :
ప్రతి నెలా పౌర్ణమి రోజున భక్తులు తమకు పట్టిన దెయ్యాలను, దుష్ట శక్తులను వదిలించుకోవడానికి మధ్య ప్రదేశ్ లోని దేవ్ జీ మహరాజ్ ఆలయానికి వస్తుంటారు. దుష్ట శక్తులు ఎవరినైతే వేధిస్తాయో వారి అరచేతులపై కర్పూరం వెలిగించి వాటిని వదిలించడం ఇక్కడి సాధారణ పద్ధతి. వారి చుట్టూ పరిగెత్తడం లేదా చీపురుతో కొట్టడం వంటివి కూడా చేస్తుంటారు. దుష్టశక్తులను ప్రసన్నం చేసుకోవడానికి ప్రతి ఏటా ఇక్కడ ‘భూత్ మేళా’ లేదా ‘దెయ్యాల ఉత్సవం’ నిర్వహిస్తుంటారు. భారతదేశం యొక్క పరిష్కరించలేని రహస్య దేవాలయాల్లో ఇది ఒకటి.
4. కాలభైరవనాథ్ దేవాలయం, వారణాసి :
పవిత్ర వారణాసి నగరంలో గల కాల భైరవ్ నాథ్ ఆలయంలోని దేవుణ్ణి మహాశివుని ప్రతిరూపంగా భావిస్తారు. అయితే ఇక్కడ నమ్మశక్యం కానీ నిజం ఏమిటంటే కాల భైరవ్ నాథ్ కు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. అది కూడా విస్కీ లేదా వైన్ మాత్రమే. విగ్రహం యొక్క నోట్లో ఆ మద్యాన్ని పోసి దాన్నే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. సాధారణంగా ఆలయాల బయట దుకాణాల్లో పువ్వులు, స్వీట్స్ ను అమ్ముతుంటారు. కానీ ఇక్కడ ఆలయం బయట మద్యాన్ని అమ్మడం విశేషం.
5. కొడంగల్లూర్ భగవతి ఆలయం, కేరళ :
కాళీ దేవి యొక్క పునర్జన్మగా భావించే భద్రకాళి దేవికి కొడంగల్లూర్ భగవతి ఆలయంలో ప్రతి ఏటా ఏడు రోజుల వింత భరణి పండుగ నిర్వహిస్తుంటారు. ఈ పండుగలో మహిళలు, పురుషులు ఎర్రని వస్త్రాలు ధరించి, కత్తులు పట్టుకుని ఒక తెలియని స్థితిలో తిరుగుతుంటారు. రక్తం కారే విధంగా కత్తులతో తలపై కొట్టుకుని దేవిని నీచమైన పదాలతో తిడుతూ పాటలు పాడుతుంటారు. అమ్మవారికి ఇచ్చే కానుకలను సాధారణ పద్ధతిలో సమర్పించకుండా దేవత విగ్రహం వద్దకు వాటిని విసురుతారు. ఆ తరువాత ఆలయం స్తంభాలను కర్రలతో పదేపదే కొడతారు. పండుగ తరువాత 7 రోజులు ఆలయాన్ని మూసి వేసి రక్తపు మరకలను శుభ్రం చేస్తారు.
6. స్తంభేశ్వర్ మహదేవ్, గుజరాత్ :
మీరు రోజంతా కనిపించి అదృశ్యమయ్యే దేవాలయాన్ని ఎప్పుడైనా సందర్శించారా? గుజరాత్ లోని వడోదరకు దగ్గర్లో అరేబియా సముద్రంలో ఉన్న స్తంభేశ్వర్ మహదేవ్ ఆలయం అటువంటిదే. ఎంతో ధైర్య సాహసాలతో ఈ ఆలయానికి వెళ్లే భక్తులను మహాశివుడు అనుగ్రహిస్తాడని చెబుతారు. భారతదేశంలోని ప్రసిద్ధ దేవాలయాల్లో ఇది ఒకటి. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ దేవాలయ సందర్శన సాధ్యపడుతుంది. ఆటుపోట్లు తక్కువగా ఉన్నప్పుడు సముద్రం వెనక్కి వెళ్తుంది. ఆ సమయంలో భక్తులు వెళ్లి మహాశివుని దర్శనం చేసుకోవచ్చు. మరలా కొన్ని గంటల తరువాత సముద్రం మెల్లగా ముందుకు రావడం ప్రారంభిస్తుంది. అప్పుడు భక్తులు తిరిగి వెనక్కి వస్తారు.
7. బ్రహ్మ ఆలయం, పుష్కర్, రాజస్థాన్ :
ఔరంగజేబు భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో చాలా హిందూ దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. దీనిలో భాగంగా రాజస్థాన్ లోని పుష్కర్ ప్రాంతంలో దేవాలయాలను కూడా ధ్వంసం చేశారు. అయితే ఔరంగజేబు కంట పడినా కూడా నేటికీ చెక్కుచెదరక మనుగడ సాగిస్తున్న దేవాలయాల్లో బ్రహ్మ దేవుని ఆలయం ఒకటి. ప్రపంచంలోని ఏకైక బ్రహ్మ దేవుని ఆలయం ఇదే. హిందూ పురాణాల్లో బ్రహ్మ కూడా ఓ భాగమైనప్పటికీ ఆయనకు ఇక్కడ తప్ప మరెక్కడా గుడి లేకపోవడం విశేషం. పాలరాయితో తయారు చేయబడిన ఈ ఆలయంలో గోడలు వెండి నాణేలతో నిక్షిప్తం చేయబడ్డాయి. ఇవి దాతలు, భక్తుల పేర్లతో కనిపిస్తాయి.
8. దేవరగట్టు ఆలయం, ఆంధ్రప్రదేశ్ :
భారతదేశంలోని పురాతన దేవాలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఉన్న దేవరగట్టు ఆలయం ఒకటి. కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ ఆలయంలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కర్రలను చేతపట్టుకుని అర్ధరాత్రి వరకూఒకరి తలలపై ఒకరు కొట్టుకుంటారు. ఇక్కడి మాల మల్లేశ్వరుడు (శివుడు) చేతిలో రాక్షసుడు హతమైన సందర్భంగా పురుషులు రాత్రంతా తమ రక్తాన్ని చిందిస్తుంటారు. దాదాపు 100 ఏళ్లుగా జరుగుతున్న ఈ ఉత్సవంలో ఇదివరకు లాఠీలకు బదులు గొడ్డలి, బాకులను వాడే వారు.
devotional news
హిందువులు అత్యంత పవిత్రంగా భావించే నగరాల్లో శ్రీరాముని జన్మస్థలమైన ‘అయోధ్య’ ప్రముఖమైనది. త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఈ నగరం ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలం. విష్ణుమూర్తి ఏడవ అవతారమైన శ్రీరాముడి చరిత్రలో ముఖ్యమైన ఎన్నో కీలక ఘట్టాలు అయోధ్య నేలపైనే జరిగాయి. ఉత్తర ప్రదేశ్ లోని ఫైజాబాద్ కు 6 కిలోమీటర్ల దూరంలో సరయూ నదీ తీరంలో ఉన్న ఈ పవిత్ర నగరాన్ని సందర్శించేందుకు హిందువులు అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఒక మనిషికి గుణగుణాలు ఎంత ముఖ్యమైనవో తెలియజెప్పే విష్ణుమూర్తి అవతారాల్లో ఒకటైన శ్రీరాముని అవతారం గురించి తెలియని వారుండరు. రామాయణాన్ని ఒక మహా కావ్యంగా, సీతారాములను ఆదర్శప్రాయంగా ప్రజలు భావిస్తారు. అందుకే రాముడు జన్మించిన అయోధ్య నగరానికి, హిందూ ప్రజలకు మధ్య విడదీయరాని అనుబంధం ఏర్పడింది. కేవలం హిందువులకే కాదు.. ముస్లిం, బౌద్ధ, జైన మతాల ప్రజలు కూడా ఈ ప్రదేశాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తున్న ఈ రామ జన్మభూమి విశేషాలు ఏమిటి? ప్రజలతో ఈ ప్రదేశానికి ఉన్న అనుబంధం ఏమిటి? పర్యాటకంగా దీనికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అయోధ్య చరిత్ర:
అయోధ్య అంటే జయించశక్యం కానిది అని అర్ధం. శ్రీరాముని పూర్వీకుడైన ఆయుథ్ మహారాజు పేరిట ఈ నగరానికి అయోధ్య అనే పేరు స్థిరపడినట్లు చెబుతారు. మరికొన్ని ఆధారాల ప్రకారం హిందువులకు ధర్మశాస్త్రం అందించిన సూర్యవంశ ఆద్యుడు మనువుచే తొమ్మిది వేల సంవత్సరాలకు పూర్వం ఈ నగరం స్థాపించబడినట్లు కధనం. అతడి కుమారుడు ఇక్ష్వాకు అయోధ్య రాజధానిగా కోసల రాజ్యాన్ని పాలించినట్లు పురాణ కధనాలు వివరిస్తున్నాయి. అలాగే ఈ వంశానికి చెందిన పృధువు అనే రాజు వలన ఈ భూమికి పృధ్వి అనే పేరు వచ్చిందని చెబుతారు. సత్యవాక్పరిపాలనకు ప్రసిద్ధి చెందిన హరిశ్చంద్రుడు సూర్యవంశపు 31వ రాజు. ఆయన తన సత్య వాక్కుతో సూర్య వంశ చక్రవర్తుల ప్రతిష్టను ఇనుమడింపజేశాడు. గంగను భువికి దించిన భగీరధుడు, అయోధ్య రాజ్య విస్తరణ చేసిన రఘుమహారాజుల కీర్తి కూడా ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గవి. రఘుమహారాజు పాలనలో సూర్యవంశాన్ని రఘువంశం అని కూడా పిలిచేవారు. సూర్యవంశపు 63వ రాజు దశరధుని రాజ్యసభగా అయోధ్య పట్టణం ఉండేది. ఆ దశరధుడి పూజల ఫలితంగా కలిగిన సంతానమే శ్రీరాముడు. శ్రీ రాముడు కూడా అయోధ్య రాజధానిగా కొంత కాలం రాజ్య పరిపాలన చేశాడు. అధర్వణ వేదం ప్రకారం దేవతలచే నిర్మించబడిన ఈ నగరాన్ని భువిపై ఉన్న స్వర్గపురి అని కూడా పిలుస్తారు. వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరితమానస్ వంటి అనేక పురాణ గ్రంధాల్లో అయోధ్య గొప్పదనం విపులీకరించబడింది. కేవలం శ్రీరాముడు మాత్రమే కాదు బాహుబలి, సుందరి, పాడలిప్తసూరీశ్వరి, హరిచంద్ర, అచలభరత వంటి ఎందరో కారణజన్ములు ఈ నేలపై జన్మించిన వారే. హిందువులకే కాకుండా జైన మతస్థులకు కూడా అయోధ్య ఓ ముఖ్య నగరం. 2000 సంవత్సరాలకు ముందే ప్రముఖ జైన మతతీర్ధంకులైన వృషభ, గాంధారాలకు అయోధ్య జన్మస్థలంగా ఉంది.
హిందూ, జైన మతాలతో పాటు బౌద్ధ మతానికి కూడా అయోధ్యలో ప్రాముఖ్యత ఉంది. మౌర్య చక్రవర్తుల కాలంలో ఇక్కడ అనేక బౌద్ధాలయాలు, స్మారక చిహ్నాలు నిర్మించినట్లు చెబుతారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్ధం నుంచి క్రీస్తు శకం 5వ శతాబ్ధం వరకూ అయోధ్య బౌద్ధ మత కేంద్రంగా విలసిల్లినట్లు చరిత్రకారుల అంచనా. అయోధ్య నగరాన్ని బుద్ధుడు పలు మార్లు సందర్శించినట్లు కూడా కధనం. అదే విధంగా మొఘల్ వంశానికి ఆద్యుడైన బాబర్ అయోధ్యలో బాబ్రీ మసీదును నిర్మించాడు. దీంతో హిందూ, బౌద్ధ, జైన, ముస్లిం మతాల పవిత్ర ప్రదేశంగా అయోధ్యకు ప్రత్యేక పర్యాటక గుర్తింపు లభించింది.
అయోధ్యలో ముఖ్యమైన ప్రదేశాలు:
అయోధ్యలో పర్యాటకులు సందర్శించేందుకు ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయి. ఆటో రిక్షాల ద్వారా ఇక్కడి ప్రధాన ఆలయాలను, మందిరాలను, రామజన్మభూమిని, ఇతర పర్యాటక ప్రాంతాలను హాయిగా సందర్శించి రావచ్చు. సరయూ నది, రామజన్మభూమి ఆలయం ప్రదేశం, అన్నదాన సమాజం, కౌసల్యాదేవి మందిరం, హనుమద్ మందిరం, వాల్మీకి మందిరం వంటివి ఇక్కడ చూడాల్సిన పర్యాటక ప్రదేశాలలో ముఖ్యమైనవి.
మల్దకల్, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందినది. ఇది డివిజన్ కేంద్రమైన గద్వాల నుంచి రాయిచూరు వెళ్ళు మార్గములో గద్వాల నుంచి 14 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి స్వయం భూస్వామి దేవాలయం స్థానిక పర్యాటకులను ఆకర్షిస్తుంది. ప్రతియేటా ఈ దేవాలయానికి రథోత్సవం మరియు జాతర అతి వైభవంగా జరుగుతుంది. ద్వాపరయుగాంతం కలియుగ ఆరంభంలో తిరుమల తిరుపతి దేవునికి ముందు విష్ణుమూర్తి ఇక్కడ ఆదిశిలపై పాదం పెట్టి ప్రవేశించడంతో దీనికి ఆదిశిల అనే పేరు ఉన్నట్లు బ్రహ్మాండ పురాణంలోని నాలుగవ అధ్యాయంలో ఆధారాలున్నాయి. ఈ గ్రామంలో ఎవరు కూడా ఇండ్లను రెండో అంతస్తు కట్టకపోవడం ఇక్కడి ప్రత్యేకత. స్వామివారి గోపురం కంటే ఎత్తు ఇళ్ళు ఉండరాదని, ఇదివరకు ఈ విధంగా చేసినవారికి అరిష్టాలు జరిగాయని ప్రచారంలో ఉంది. ఇతర మతస్థులు కూడా ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. రెండవ తిరుపతిగా వెలుగొందుతున్న మొదలకల్ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో ఆది శిలా క్షేత్రాన్ని గురించి వివరించారు. మొదలు అనగా ‘ఆది’ అని, కల్లు అనగా ‘రాయి’ అని అర్థము. బ్రహ్మ దేవుడు ఒక శిలను సృష్టించి ‘ఆదిశిల’ అని పేరు పెట్టాడని, అక్కడే పరమ శివుడు తపస్సు నాచరించాడని, అట్టి శిలపై శ్రీనివాసుడు, లక్ష్మీదేవి, అనంతశయన మూర్తి, వరాహస్వామి, ఆంజనేయుడు, ఒకే శిలపై ఉద్భవించారు. క్షేత్ర పాలకుడు అయిన పరమేశ్వరుడు ఇచ్చట సతీసమేతంగా వెలిసి యున్నాడు. ఈ ప్రాంతమంతా ఒకప్పుడు అరణ్యంగా ఉండేది. ఒక రోజు గద్వాల సంస్థానాధీశుడు అయిన నలసోమనాద్రి రాజు గుర్రము పైన వేటకై మల్దకల్ ప్రాంతానికి రాగా ఒక చోట అతని గుర్రము అకస్మాత్తుగా ఆగిపోగా, రాజు ఈ ప్రాంతములో ఏదో మహాత్యము ఉందని భావించి, దగ్గరలో ఉన్న పశువుల కాపరిని పిలిచి విచారించగా అక్కడే పొదలలో కల విగ్రహాన్ని చూపాడు. నా గుర్రం పరిగెత్తితే నీకు గుడి కట్టిస్తానని మొక్కి తన గుర్రం ఎక్కగానే అది రెట్టించిన వేగంతో పరిగెత్తి తన ప్రయాణాన్ని పూర్తి చేసిందని చరిత్ర చెబుతుంది. అప్పుడు రాజు గారు దేవాలయాన్ని కట్టించి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించి, అడవిలో విగ్రహాన్ని చూపిన పశువుల కాపరి అయిన బోయవాడిని పూజారిగా నియమించాడు. నేటికీ ఈ దేవాలయంలో అతని సంతతి వారే పూజాధికాలు నిర్వహిస్తుంటారు. స్థానికులు దేవాలయంలోని భగవంతుణ్ణి మల్డకల్ తిమ్మప్ప దేవునిగా పిలుస్తుంటారు. ఈయన చుట్టుప్రక్కల గ్రామాలలో ఫెమస్. ప్రతి ఏటా డిసెంబర్ నెల పౌర్ణమి నాడు భక్తులు ఆనందోత్సాహాల మధ్య జాతర ( తిరునాళ్ల) జరుపుకుంటారు. కర్నాటక, మహారాష్ట్ర మరియు ఆంధ్రా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటారు. ఏటా 20 లక్షల మంది పైగా దేవాలయాన్ని దర్శిస్తుంటారని అంచనా.
Read Also..
Real Also..
కడప జిల్లా.. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ప్రొద్దుటూరు లోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారుమ్రోగాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ప్రొద్దుటూరు లోని ప్రసిద్ధ ఆగస్తేశ్వర ఆలయం, పెన్నా నది తీరాన రెండవ కాశీగా పేరుగాంచిన శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి దేవాలయాలలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్బంగా తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో శివ సన్నిధిలో బారులు తీరారు. మహిళలు ఎంతో నిష్టతో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి పూజలు చేశారు. గర్భాలయంలోని శివ లింగానికి ఏకవార రుద్రాభిషేకం, ఉత్సవమూర్తులకు అభిషేకం, రుద్ర హోమం నిర్వహించారు. భక్తులకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
కార్తీక మాసంలో శివ నామ స్మరణకు ఎంతో విశిష్టత ఉంది. కేవలం శివ పంచాక్షరీ మంత్రంతోనే ముక్తిని సాధించవచ్చు అంటారు పురాణ పండితులు, పెద్దలు. అయితే పరమేశ్వరుడు జ్యోతిర్లింగాల రూపంలో వెలిశాడు. ద్వాదశ జ్యోతిర్లింగ శ్లోకంలో సౌరాష్ట్రే సోమనాథంచ అని ఉండటం అందరికీ తెలిసిందే. అయితే ఈ సోమనాథ ఆలయం ఎక్కడుంది?? దాని విశిష్టత ఏంటి?? ఇక్కడ శివుడు వెలసిన కారణం ఏమిటి?? వంటి విషయాలు తెలుసుకుంటే సౌరాష్ట్ర దేశంలో ప్రభాస తీర్ధమున్నది. దక్ష ప్రజాపతికి అశ్వని, భరణి మొదలయిన ఇరవై ఏడుమంది పుత్రికలు ఉన్నారు. వారిని చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు దక్షప్రజాపతి. వీరందరూ నక్షత్రాలు. అయితే చంద్రుడికి తన భార్యలందరిలోకి రోహిణి మీద ఎక్కువ ప్రేమ, అనురాగము కలిగి, ఎక్కువ కాలము ఆమె వద్దనే గడిపేవాడు. ఈ విషయం మిగిలిన భార్యలకు బాధాకరంగా మారింది. వారంతా ఒక రోజు తండ్రియైన దక్షప్రజాపతి వద్దకు వెళ్లి, చంద్రుడు తమను నిర్లక్ష్యం చేస్తున్నాడని మొర పెట్టుకున్నారు. దక్షప్రజాపతి చంద్రుని పిలిపించి “చంద్రా! నా కుమార్తెలు ఇరవై ఏడుమందిని నీకిచ్చి వివాహం చేశాను. నువ్వు అందరినీ సమంగా చూడాలి కదా!! కాని నువ్వు ఒకరిపై ఎక్కువ అనురాగము, వేరొకరిపై తక్కువ అనురాగము చూపకూడదు కదా. ఈ ధర్మాన్ని గ్రహించి నీ భార్యలను జాగ్రత్తగా చూసుకో” అన్నాడు. సరే అన్నాడు చంద్రుడు. ప్రజాపతి మాట కాదనలేక సరే అన్నాడు. అంతేకాని తన బుద్ధిమాత్రం మార్చుకోలేదు. రోహిణితోనే ఎక్కువకాలం గడుపుతున్నాడు. చంద్రుని తీరు మారకపోయేసరికి మిగిలిన భార్యలు దక్ష ప్రజాపతి దగ్గరకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం చెప్పారు. దాంతో కోపగించిన ప్రజాపతి చంద్రుని క్షయవ్యాధి పీడితుడుగా మారిపొమ్మని శాపం పెట్టాడు. ఆయన శాపం పెట్టగానే చంద్రుడికి క్షయ వ్యాధి సోకింది. రోజురోజుకు కృశించిపోతున్నాడు. ఇంక భరించలేక బ్రహ్మదేవుని దగ్గరకు పోయి తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు. విషయం అంతా.. విన్న బ్రహ్మదేవుడు చంద్రునితో “సారాష్ట్ర దేశంలో ప్రభాస తీర్ధమున్నది. అక్కడికి పోయి మృత్యుంజయ మహామంత్రాన్ని జపించు” అని మంత్రోపదేశం కూడా చేశాడు. ప్రభాస తీర్ధములో చాలా కాలము మృత్యుంజయ మంత్ర జపం చేశాడు చంద్రుడు. చివరకు పరమేశ్వరుడు అనుగ్రహించి అతడికి ప్రత్యక్షమై ‘నీకే వరం కావాలో కోరుకో’ అన్నాడు. అప్పుడు చంద్రుడు తన మామగారు తనకిచ్చిన శాపం సంగతి చెప్పి, క్షయ వ్యాధి నుండి తనను రక్షించమని కోరాడు. దానికి శంకరుడు “చంద్రా! దక్ష ప్రజాపతి సామాన్యుడు కాదు. నవబ్రహ్మలలో ఒకడు. కాబట్టి అతడి మాట వ్యర్థం కాదు. అలా అని నీ ప్రార్ధన త్రోసి పుచ్చటం న్యాయం కాదు. అందుచేత కొంతకాలం నువ్వు వ్యాధి గ్రస్తుడవుగా, మరికొంతకాలము సుఖంగా ఉండు. అంటే కృష్ణపక్షములో క్రమక్రమంగా నీ కళలు క్షీణిస్తాయి. మళ్ళీ శుక్లపక్షంలో ప్రతిరోజు వృద్ధి పొందుతాయి. ఈ రకంగా పౌర్ణమి రోజున పదహారు కళలతో విరాజిల్లు. అమావాస్య రోజున కళావిహీనుడివి అవుతావు అన్నాడు. అప్పటి నుంచీ చంద్రుడికి వృద్ధి క్షయాలు ఏర్పడినాయి. ఆ తరువాత చంద్రుని ప్రార్ధన మీద పరమేశ్వరుడు ప్రభాస తీర్ధములో జ్యోతిర్లింగముగా వెలిశాడు. సోముడు అంటే చంద్రుడు. అక్కడ సోమునిచే పూజింపబడ్డాడు కాబట్టి సోమనాధుడు అని పిలవబడుతున్నాడు. సోమనాధుని అర్చించినవారికి భయంకర రోగములు కూడా పటాపంచలవుతాయి. మానసిక బాధలు తొలగిపోతాయి.
మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశిగా పిలువబడే కార్తీక శుక్లపక్ష ద్వాదశి. శివకేశవులిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. మందర పర్వతం కవ్వంగా, వాసుకి తాడుగా క్షీర సముద్రాన్ని దేవదానవులు మథించిన రోజు ఇది. అందుకే దీన్ని ‘క్షీరాబ్ది ద్వాదశి’ అన్నారు. మథించడం అంటే చిలకడం. కాబట్టి ‘చిలుకు ద్వాదశి’గా కూడా వ్యవహరిస్తారు. అమృతం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశి రోజున దీపావళి రోజు వలె లక్ష్మీదేవిని నాణాలతో పూజిస్తే శ్రీమహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఎల్లవేళలా క్షీర సాగరంలో శేషశయ్యపై శయనించి ఉండే విష్ణుమూర్తి ఈ రోజు బ్రహ్మాది దేవతలతో బృందావానికి వస్తాడని, అందువల్ల బృం దావనంలో ఎవరు శ్రద్ధాసక్తులతో విష్ణుపూజ చేస్తారో వారికి ఆయురారోగ్యాలు, సిరిసంపద లు సిద్ధిస్తాయని పురాణ కథనం. పలు విశేషాల సమాహారం అయిన క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు కూడా ఉన్నాయి. అత్యంత పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, అలాగే యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది. స్వాయంభువ మన్వాది సంవత్సరాలను క్షీరాబ్ది ద్వాదశి రోజు నుంచి లెక్కిస్తారు. ఏకా దశి నుంచి పూర్ణిమ వరకూ ‘భీష్మ పంచక వ్రతం’ అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరణశ య్యపై ఉన్న పితామహుడు భీష్ముని దాహార్తి తీర్చడానికి అర్జునుడు తన బాణంతో పాతాళ గంగను పైకి రప్పించినది ఈ రోజునేనని ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహా విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీ సమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని ‘బృందావని ద్వాదశి’గా పిలుస్తారు. క్షీరాబ్ది ద్వాదశి నాడు పాల సముద్రంలో మహాలక్ష్మి ఆవిర్భవించిందనీ, ఆ రోజు నే లక్ష్మీ నారాయణుల కల్యాణం జరిగిందనీ ‘చతుర్వర్గ చింతామణి’ అనే గ్రంథం చెబుతోం ది. అందుకే ఈ రోజు లక్ష్మీ నారాయణ కల్యాణం నిర్వహంచే సంప్రదాయం ఏర్పడింది. విష్ణుమూర్తినీ, మహాలక్ష్మినీ బృందావనానికి బ్రహ్మ తీసుకొని వెళ్ళి, అక్కడ తులసితో విష్ణువుకు వివాహం జరిపించాడని క్షీరాబ్ది వ్రత కథ చెబుతోంది. లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయ మాడిన శుభ తిథి కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయం త్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించి, శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీని శ్రీలక్ష్మిగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నా రాయణునిగాను భావించి వివా హం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం, ఈరోజు దీపారాధన చేయడం వల్ల పరిహార మౌతుంది. పరమ పవిత్రమైన ఈ రోజును పావన ద్వాదశిగా, విభూతి ద్వాదశిగా, గోవత్స ద్వాదశి గా, నీరాజన ద్వాదశిగా వ్యవహరిస్తూ అందుకు సంబంధించిన వ్రతాలు చేస్తుంటారు. తులసి సాక్షాత్తూ లక్ష్మీదేవి అంశే.ముఖ్యంగా, మథురలోని బృందావనంలో, మహారాష్ట్రలో క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసీ కల్యాణం నిర్వహస్తారు. తెలుగు లోగిళ్ళలో క్షీరాబ్ది ద్వాదశి రోజు సాయంత్రం తులసికోట దగ్గర అలికి, ముగ్గు లు పెడతారు. తులసికోటనే బృందావనంగా భావించి, ఉసిరిక కొమ్మను విష్ణుమూర్తికి ప్రతీ కగా భావించి తులసీ కల్యాణం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని గృహణి లేదా దంపతులు నిర్వహస్తారు. రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి ఇలా ఎన్నో రకాల తులసి చెట్లు ఉన్నాయి. నల్లని కాండం ఉన్న మొక్కను ‘కృష్ణ తులసి’ అనీ, తెల్లని కాండం ఉండే మొక్కను ‘లక్ష్మీ తులసి’ అనీ అంటారు. ఈ రెండు వర్ణాల తులసి వృక్షాలను తులసికోటలో నాటి, పరి ణయం జరిపిస్తారు.
దశావతారాల్లో ఎనిమిదవది శ్రీకృష్ణావతారం. తులసి సన్నిధిలో ఉండడం తనకెంతో ఇష్టమని సాక్షాత్తూ కృష్ణుడే తన సహపాఠి ఉద్ధవునితో చెప్పినట్టు పురాణాలు పేర్కొంటున్నా యి. తులసితో కృష్ణునికి ఉన్న అనుబంధమే తులసీ కల్యాణం నిర్వహంచడానికి ముఖ్య కార ణం. ఈ కల్యాణం సందర్భంగా తులసిని షోడశోప చారాలతో పూజించి, వివిధ రకాల పండ్లు, చెరుకు ముక్కలు, చలిమిడి, వడపప్పు నివేదించి, హారతి ఇస్తారు. ముత్తైదువను శ్రీ మహాలక్ష్మిగా సంభావించి, పసుపు కుంకుమలు, ఫల పుష్ప తాంబూలాదులతో సత్కరించి, దీవెనలు పొందుతారు. అలా చేస్తే మాంగల్యాభివృద్ధి కలుగుతుందని నమ్మకం. రోజంతా ఉపవసించిన గృహణులు పూజానంతరం తులసికి నివేదించిన వాటిని ప్రసాదంగా తీసు కొని, ఉపవాసాన్ని విరమిస్తారు. ప్రతిరోజూ ఉభయ సంధ్యలలో దేవుని ముందు దీపాలు వెలిగించడం మన సంస్కృతి లో భాగం. అలా పెట్టలేనివారు కార్తీక మాసంలోనైనా పెట్టాలని శాస్త్రాలు అంటున్నాయి. అది కూడా చేయలేనివారు ద్వాదశినాడు 360 వత్తులతో కూడిన దీపాన్ని వెలిగిస్తే, సంవత్స రమంతా దీపం వెలిగించినట్టవుతుందని శాస్త్ర వచనం. కార్తికమాసం అంతా దీపాలు పెట్టలేని వారు ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ నాడు తప్పకుండా పెట్టాలనీ, అందునా ద్వాదశి నాటి దీపం వైకుంఠ ప్రాప్తి కలిగిస్తుందనీ ‘కార్తిక పురాణం’ చెబుతోంది. హందూ సంస్కృతిలో తులసి అతి పవిత్రం. తులసీ కృష్ణుల అనుబంధం కూడా అటు వంటిదే. తులసికోట లేని ఇల్లంటూ ఉండదు. మహళలు తులసిని ప్రతిరోజూ పూజిస్తారు. తులసికి నీరు పోసి, దీపం పెట్టి, తులసీ స్తోత్రాన్ని పఠిస్తూ ప్రదక్షిణ చేసి, చివరగా తులసికోట లోని తీర్థాన్నీ, తులసీ దళాన్నీ స్వీకరిస్తారు. తులసిని పూజించడం అంటే లక్ష్మిని ఆరాధించడ మే. క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసి పూజ లక్ష్మీ నారాయణులకు చేసే పూజ. ఎంతో ప్రాధా న్యం ఉన్న ఈ ఆరాధన ప్రేమకూ, భక్తికీ, ప్రతీక. తులసి తీర్థం, తులసీ దళం మీదుగా వచ్చే గాలి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తులసిలో రోగనివారక శక్తి ఉందని ఆయుర్వేదం నిరూపించింది. చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణ లిఖితం. ‘గోవత్స ద్వాదశి’గా పిలిచే ఈ రోజున వత్సంతో అంటే దూడతో కూడిన ఆవును దానం ఇస్తే విశేష ఫలం లభిస్తుందని ఆస్తికుల విశ్వాసం.
Read Also..
Read Also..
కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో శుక్రవారం కైశిక ద్వాదశి ఆస్థానం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తిని ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. వేంకటతురైవార్, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఉదయం 5.30 నుండి ఉదయం 7 గంటల వరకు స్వామి, అమ్మవార్లను బంగారువాకిలి చెంత వేంచేపు చేసి అర్చకులు పురాణ పఠనంతో కైశిక ద్వాదశి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
కార్తీక మాసంలోని ఏకాదశి చాలా ఉత్తమమైనది. సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశిలలో కార్తీక శుక్ల ఏకాదశికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. దీనిని దేవప్రబోధని ఏకాదశి లేదా దేవ్ ఉతాని ఏకాదశి అని పిలుస్తారు, ఎందుకంటే ఈ రోజున విష్ణువు నాలుగు నెలల నిద్ర తర్వాత మేల్కొంటాడు. దేవప్రబోధిని ఏకాదశి రోజున చెరుకు మంటపాన్ని అలంకరించి ఆ మంటపం లోపల విష్ణుమూర్తిని విధిగా పూజించాలని శాస్త్రాలలో చెప్పబడింది. ఇలా చేయడం వల్ల శుభకార్యాల్లో ఆటంకాలు తొలగిపోయి ఏడాది మొత్తం ఆనందంగా గడిచిపోతుంది. చెరుకు మంటపం చేసి విష్ణువును పూజించలేని వారు దేవప్రబోధని ఏకాదశి నుంచి ఒక్కరోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజించి విష్ణు సహస్రనామాన్ని పఠించాలని పండిట్ మురళీ ఝా చెప్పారు. అంతే కాకుండా ఈ రోజున వీలైనంత ఎక్కువగా విష్ణు నామాన్ని జపించాలి. దేవప్రబోధని ఏకాదశి రోజున దేవతలు కూడా విష్ణువును నిద్రలేవగానే పూజిస్తారని గ్రంధాలలో చెప్పబడింది. కావున భూలోకవాసులు కూడా ఈ రోజున మేల్కొన్న విష్ణువును పూజించాలి. దేవప్రబోధని ఏకాదశి వ్రతాన్ని ఆచరించే అనేక తరాల వారు విష్ణులోకంలో స్థానం పొందేందుకు అర్హులు అవుతారని పురాణాలలో పేర్కొన్నారు. దేవ్ ప్రబోధని ఏకాదశి రోజున ఉపవాసం పాటించే వ్యక్తి దశమి రోజు నుండి సాత్విక ఆహారం తీసుకోవాలి. ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. విష్ణుమూర్తికి తులసి ఆకులను సమర్పించండి. ఉపవాసం ఉన్నవారు తులసి ఆకులను స్వయంగా తీయకూడదని గుర్తుంచుకోండి. మీ పని చేస్తున్నప్పుడు, భగవంతుడిని కూడా ధ్యానించండి. ఏకాదశి రోజు రాత్రి మెలకువగా ఉండి భగవంతుని స్తోత్రాలను పఠించడం యొక్క గొప్ప ప్రాముఖ్యతను గ్రంధాలలో పేర్కొనబడింది. దీనివల్ల అనేక జన్మల పాపాల నుండి విముక్తి లభిస్తుంది. ద్వాదశి రోజున ఉదయం విష్ణువును పూజించిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. దీని తరువాత, తులసి ఆకును మీరే తీసుకోండి మరియు తరువాత ఆహారం తీసుకోండి.
Read Also..
Read Also..






Total views : 90594