తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ. నేడు శ్రీవారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న తిరుమల శ్రీవారిని 56,049 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.నిన్న హుండీ ఆదాయం3.97 కోట్లు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తులు 26,748 మంది, శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లు నిండి టీబీసీ ఏరియా వరకు క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులు. టోకెన్ లు లేని భక్తులకు 24 గంటల శ్రీవారి సర్వదర్శనం సమయం పడుతుంది.
devotional news
అర్చకులు అజయ్ త్రిపాఠి మాట్లాడుతూ షిరిడి సాయిబాబా 1835 లో లోకంలోకి అడుగుపెట్టినట్లు చరిత్ర చెబుతుందన్నారు. బాబా తన 16 వేట మొదటిసారిగా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ కు వచ్చారని, వేప చెట్టు కింద ఆసనం వేసి లోతైన ధ్యానం లో మునిగిన బాబాను చూసి ప్రజలు ఆశ్చర్యపోయారన్నారు. బాబా అనంతరం ఓ మసీదులో ఉంటూ పూజలు నిర్వహించేవారని , బాబా యొక్క మహిమ విభూది ద్వారా ప్రపంచానికి వ్యాపించిందన్నారు. నీటితో దీపాలను వెలిగించి బాబా తన మహిమను ప్రజలకు చూపించారని, ఎందరో రోగులకు వ్యాధి నయం చేసి, భక్తుల చేత ఆరాధింపబడ్డారన్నారు. శ్రీ షిరిడి సాయినాధునికి కులమతాలకు అతీతంగా నాడు భక్తులు విశ్వసించే వారని, నేట్కి బాబా భక్తులు సర్వమత సమ్మేళనం పాటిస్తున్నారన్నారు. బాబా ఏనాడు తాను భగవంతుడిని అంటూ ప్రకటించుకోలేదని, కేవలం గురువుగా గుర్తించబడెందుకు ప్రయత్నించే వారన్నారు. నిశ్చలమైన భక్తితో బాబాను పూజిస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయని, నేటికీ ఎందరో భక్తులు బాబాను విశ్వసిస్తూ బాబా విభూదిని స్వీకరిస్తున్నారన్నారు. ఒంగోలులోని లాయర్ పేటలో శ్రీ శిరిడి సాయినాధుని ఆలయంలో భక్తులు ప్రతిరోజు బాబాకు హారతులు ఇచ్చే సమయంలో అధిక సంఖ్యలో హాజరవుతారని, బాబాను ప్రతిరోజు ప్రత్యేక పూలతో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అలంకరిస్తారన్నారు. బాబా అనే నామం పలికినా చాలు చీకటి లోన సైతం బాబా దీపం వలే దారిని చూపుతారని, అంధకారమైన జీవితాలను బాబా తన వెలుగులతో అంధకారాన్ని తొలగిస్తారన్నారు.
Read Also..
ఆయ్యప్ప భక్తుల తాకిడితో శబరిమల గిరులు నిండిపోయాయి. 19గంటల పాటు మణికంఠుని దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
నవంబర్ 17నుండి అయ్యప్ప దర్శనానికి ట్రావెన్కోర్ దేవస్థానం అనుమతినివ్వటంతో భక్తుల సందడి ప్రారంభమైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది అయ్యప్ప భక్తులు మణికంఠుని దర్శించుకునేందుకు దీక్షలు చేపట్టారు. శబరిమలలో యాత్రికుల రద్దీ అదుపు తప్పుతున్న నేపథ్యంలో హైకోర్టు కఠిన చర్యలు తీసుకుంది. బుకింగ్ లేకుండా శబరిమలలోకి ఎవరినీ అనుమతించరాదని హైకోర్టు ధర్మాసనం దేవస్థానంను ఆదేశించింది. వర్చువల్ బుకింగ్, స్పాట్ బుకింగ్ లేకుండా ఎవరూ ప్రయాణించకూడదని కోర్టు కోరింది. శబరిమల వద్ద భక్తులకు సహాయం చేసేందుకు సమీపంలోని కళాశాలల ఎన్ఎస్ఎస్, ఎన్సిసి క్యాడెట్ల సహాయాన్ని కోరాలని దేవస్థానం బోర్డును హైకోర్టు ఆదేశించింది. ప్రతిరోజూ వర్చువల్ క్యూ ద్వారా 90 వేల బుకింగ్లు, స్పాట్లో 30 వేల బుకింగ్స్ ఉంటున్నాయని అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను చూసే ఐజీ స్పర్జన్ కుమార్ చెప్పారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో.. దర్శనాలను త్వరగా చూడాలన్న ప్రయత్నాలకు ఆటంకం కలుగుతోందన్నారు. అయ్యప్ప దర్శన సమయాలను ప్రతిరోజూ 19 గంటలకు మించి పొడిగించడం సాధ్యం కాదని టీబీడీ పేర్కొంది. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (టీబీడీ) కీలక నిర్ణయం తీసుకుంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా శబరిమల అయ్యప్ప దర్శన సమయాన్ని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు పొడిగించింది. ప్రస్తుతం రోజుల్లో రెండో భాగంలో సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులు అయ్యప్పను దర్శించుకుంటున్నారు.
పంచారామ క్షేత్రమైన పాలకొల్లులోని శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా వేకువజాము నుంచి వేలాది మంది భక్తులు ఆలయానికి పోటెత్తారు. శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీకమాసంలో శివ పూజలు చేస్తే మోక్ష మార్గమని భక్తులు విశేషంగా విశ్వసిస్తారు. అలాగే శివుని ముందు దీపం వెలిగించడం పాప విముక్తి, ఆత్మ మోక్షానికి మార్గమని చెబుతుంటారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలో పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్తీక స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణంలో భక్తులు దీపాలు వెలిగించి భక్తిశ్రద్దలతో పూజలు చేస్తున్నారు.
తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ దేవాలయ ఆధునీకరణ పనులను వేగవంతం చేయాలని టీటీడీ చైర్మన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ఆదేశించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేనివిధంగా చర్యలు చేపట్టాలన్నారు. తొలుత గంగమ్మ తల్లిని భూమన కరుణాకర రెడ్డి దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ కట్టా గోపి యాదవ్, ఈవో మమత స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేపట్టారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శిరీష, నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, దొడ్డారెడ్డి శంకర్ రెడ్డి, దొడ్డారెడ్డి ముని శేఖర్ రెడ్డి, తొండమనాటి వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
Read Also..
అస్సాం రాష్ట్రంలో ఒక అద్భుతమైన ద్వీపం ఉంది. దీని విశేషాలు తప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచంలోనే అతి చిన్న నదీ ద్వీపంగా గుర్తింపు పొందిన ఈ ద్వీపంలో పర్వమేశ్వరుడు తన మూడవ కన్ను తెరిచినట్లు చెబుతారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడు చూద్దాం. అద్భుతమైన ప్రకృతి అందాలను అన్వేషించేందుకు ఈశాన్య భారతదేశం మీకు గొప్ప అవకాశాలను అందిస్తుంది. పచ్చదనంతో నిండిన పర్వతాలు, రాతి మార్గాలు, రంగులతో మెరిసే వాతావరణం, బ్రహ్మపుత్ర నది, దాని సహజ అందాలు మీకు మరచిపోలేని అనుభవాలను పంచుతాయి. ఈ ప్రాంతంలో ప్రకృతి వికాసం అందమైన ఛాయాచిత్రాల మాదిరిగా వైభవంగా కనిపిస్తుంది. ఈశాన్య భారతదేశం అన్ని కాలాల్లో పర్యటించదగ్గ అద్భుతమైన ప్రదేశం. కాబట్టి వింటర్ లో విరామం కోరుకునే వారు ఎక్కడికి వెళ్లాలో ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది. ఈశాన్య ప్రాంతం సాహసాలకు కూడా స్వర్గధామం వంటిది. ప్రాచుర్యం పెద్దగా లేని కొన్ని అద్భుతమైన రహస్య ప్రదేశాలు ఇక్కడి పర్యాటకంలో ప్రత్యేక ముద్ర వేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది అస్సాంలోని ఉమానంద ద్వీపం. గొప్ప చారిత్రక, పురాణ ప్రాముఖ్యత ఉన్న ఈ ప్రదేశం టూరిస్టుల దృష్టికి దూరంగా ఉంది. వాస్తవానికి ఇది ప్రపంచంలోనే అతి చిన్న నివాస ద్వీపం. ఈ నదీ ద్వీపంలో ఉన్న శివాలయాన్ని సందర్శించేందుకు పెద్ద సంఖ్యలో టూరిస్టులు ఇక్కడికి వస్తుంటారు. అస్సాంలోని కామరూప్ జిల్లాలో ఉన్న 5 ప్రముఖ దేవాలయాల్లో ఇది ఒకటి. కామాఖ్య ఆలయాన్ని సందర్శించడానికి ముందుగా ఈ ఆలయాన్ని సందర్శించాలని భక్తుల నమ్మకం. బ్రిటిషర్లు ఈ ద్వీపాన్ని నెమలి ద్వీపం అని పిలిచేవారు. ఎందుకంటే ఇది నెమలి ఫించాల ఆకారాన్ని పోలి ఉంటుంది. ఎన్నో పురాణ గాధలు కూడా ఈ అరుదైన ప్రదేశం చుట్టూ అల్లుకుని ఉన్నాయి. పురాణ గాధల ప్రకారం ఉమానంద ద్వీపాన్ని ‘భస్మాచల్’ అని కూడా పిలుస్తారు. ఇక్కడే పరమశివుడు కామ దేవుణ్ణి తన మూడవ నేత్రంతో భస్మం చేశాడు. భస్మ అంటే బూడిద, చల్ అంటే స్థలం కామదేవుడు భస్మమైన ప్రదేశం కాబట్టి దీనికి భస్మాచల్ గా పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ ద్వీపానికి మరో పురాణ కధనం కూడా ఉంది. పరమేశ్వరుడు తన సతీమణి పార్వతితో కలిసి ఇక్కడ నివాసం ఉండేవాడు. పార్వతి దేవిని ఉమాదేవి అని కూడా పిలుస్తారు. కాబట్టి ఈ ప్రాంతానికి ఉమానంద అని పేరు వచ్చినట్లు చెబుతారు. ఈ ద్వీపం మునిగితే గౌహతి నీట మునుగుతుంది. ప్రసిద్ధ జానపద కధల ప్రకారం బ్రహ్మపుత్రను శివుని సేవకుడిగా పేర్కొంటారు. అస్సాంలో ఇటీవల కాలంలో బ్రహ్మపుత్ర నది కారణంగా అనేక సార్లు వరదలు సంభవించినా ఈ నదిపై ఉన్న ఉమానంద ఆలయంలోకి మాత్రం నీరు చేరలేదు. ఉమానంద ద్వీపం ఎప్పుడు నీట మునుగుతుందో అప్పుడు గౌహతి నగరం కూడా నీట మునుగుతుందని నమ్ముతారు. ఆలయ నిర్మాణం శివ భక్తుడైన గదాధర్ సింఘా అనే రాజు ఇక్కడ శివాలయాన్ని నిర్మించాడు. 1897లో ఏర్పడిన భూకంపానికి ఈ ఆలయం శిధిలమైంది. ఆ తరువాత ఒక స్థానిక వ్యాపారిచే దీనిని పునఃనిర్మాణం జరిగింది. ఈ ఆలయంలో వినాయకుడు, విష్ణువు, సూర్య భగవానుడు, పార్వతీ దేవి విగ్రహాలు ఉంటాయి. ఒక చిన్న కొండ ఎక్కి ఈ ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది.
Read Also..
Read Also..
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులోని నడకమార్గం చెంత వెలసివున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి ఆదివారం ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. కార్తీక మాసంలో స్వాతి తిరునక్షత్రం సందర్భంగా ప్రతి సంవత్సరం ఆలయంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్బంగా.. శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో మూలమూర్తికి ఉదయం పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపులతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, టీటీడీ అధికారులు ఆలయ అర్చకులు పాల్గొన్నారు.
కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రం తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి వేలాది మంది తరలి వచ్చారు. ఉదయమే పవిత్రమైన ధర్మగుండంలో స్నానమాచరించి ప్రత్యేక క్యూ లైన్ల మీదుగా ఆలయంలోకి వెళ్లి స్వామివారు ను దర్శించుకున్నారు. స్వామివారికి ఎంతో ఇష్టమైన కోడెమొక్కును చెల్లించారు. ఆలయంలో రద్దీతో స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఐదు గంటలకు పైగా సమయం పడుతుంది.
Read Also..
ఇక్కడ కొలువై వున్న బృహదీస్వర స్వామి, పెదనాయికి అమ్మవారి దర్శనం పెద్ద వరంగా భావిస్తారు భక్తులు. ఈ ఆలయంలో శిల్ప కళ అద్బుతం. దీనిని చోళ రాజు రాజ రాజ చోళుడు నిర్మించాడు. బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు. . దీనిని 11వ శతాబ్దంలో చోళులు నిర్మించారు. ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది. భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది ఇది చాల పెద్ద ఆలయం. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతి తో శిఖారాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతి వంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది. రాజ రాజ చోళుడు క్రీ.శ. 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు. రాజ రాజ చోళుని కుమారుడు మొదటి రాజేంద్ర చోళుడు గంగైకొండ చోళ పురంలో మరో బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయం చిన్నదైనా అందులోని శిల్ప కళా రీతులు, వంటి వాటిలో రెండింటి మధ్యలో పెద్ద తేడా లేదు. ఇతడు తండ్రి కంటే ఘనుడు. తన సామ్రాజ్యాన్ని గంగా నది వరకు విస్తరించాడని, అందుకే ఆ ప్రాంతానికి గంగైకొండ చోళ పురం అని పేరు పెట్టినట్లు చారిత్రకాధారం. ఈ ఆలయం తంజావూరులోని బృహదీశ్వరాలయం కంటే విశాలమైనది. కాని తన తండ్రి మీద గౌరవంతో ఆలయ శిఖరాన్ని కొంచెం చిన్నదిగా నిర్మించాడు. ఆలయంలోని శిల్ప కళా రూపాలు చోళుల శిల్ప కళా రీతికి దర్పణాలు. ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ. అంతే గాక ఆలయ గోపురంపై రాజేంద్ర చోళుడు శివ పార్వతుల ఆద్వర్యంలో పట్టాభిషిక్తుడవుతున్నట్లున్న శిల్పం, భూదేవి సహిత విష్ణుమూర్తి శిల్పం, పార్వతీ సమేత శివుని శిల్పం, మార్కండేయుని చరిత్రను తెలిపే శిల్పాలు, ఇలా అనేక శిల్ప కళా రీతులు ఆలయ శోభను ఇనుమడిస్తున్నాయి. రాజేంద్రచోళుని అంతఃపురం ఈ అలయానికి ఒక కిలోమీటరు దూరంలోనె వున్నది. ఒకప్పుడు ఇంతటి సువిశాల సామ్రాజ్యానికి కేంద్ర బిందువైన ఈ ప్రదేశం ఇప్పుడు ఒక కుగ్రామం మాత్రమే. ఈ నగరం ఎలా అంతరించిందో చరిత్రకు కూడ అంతు పట్టదు. ఈ చుట్టు ప్రక్కల ప్రాంతాలలో ఇప్పటికి త్రవ్వకాలలో అనేక శిల్పాలు బయట పడుతూ ఆనాటి వైభవాన్ని ఈ నాటికి చాటు తున్నాయి. ఈ దేవాలయానికి అనుకరణగ మరోచోళరాజు తమిళనాడు లోని జయకొండచోళపురం సమీపంలో ఇంకో దేవాలయం కట్టించాడు. ఆ రెండో గుడి తంజావూరు గుడికన్న పెద్దదైనా ప్రస్తుతం ఆదరణ లేక దీనావస్తలో ఉన్నది.
శివ పార్వతులు ఈ భూమిపై వివాహం చేసుకున్న ప్రదేశం ఎక్కడ ఉందో మీకు తెలుసా? ఇక్కడ చాలా జంటలు వివాహం చేసుకోవాలని కోరుకుంటారు. ఇంతకీ ఈ ప్రదేశం ఎక్కడ ఉంది? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. చాలా మందికి సరైన జీవిత భాగస్వామితో పాటు వివాహానికి సరైన ప్రదేశం వెతకడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయం. కొంతమంది తమ వివాహాన్ని హోటల్ లో, రిసార్ట్స్ లో, బాంకెట్ హాలులో చేసుకుంటే మరికొంత మంది యువ జంటలు డెస్టినేషన్ వెడ్డింగ్ లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ కొన్ని జంటలు మాత్రం తమ వివాహం ఆధ్యాత్మిక వాతావరణంలో, గొప్ప ప్రాశస్త్యం గల ప్రదేశాల్లో జరగాలని కోరుకుంటారు. అలాంటి జంటలకు సరైన ప్రదేశం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉన్న త్రియుగినారాయణ్ గ్రామం. ఈ గ్రామంలో ఉన్న త్రియుగినారాయణ్ ఆలయం విష్ణు మూర్తికి అంకితం చేయబడింది. ఇదే ఆలయంలో కొన్ని యుగాల క్రితం మహా శివుడు, పార్వతి దేవి వివాహం చేసుకున్నట్లు నమ్ముతారు. త్రియుగినారాయణ్ పేరులో “త్రి అంటే మూడు, యుగి అంటే శకము, నారాయణ్ అంటే మహా విష్ణువు మరో నామం” అని అర్ధం. పురాణాలకు సాక్ష్యంగా నిలిచే ఎన్నో చిత్రాలు ఆలయ ప్రాంగణంలో కనిపిస్తాయి. ఉదాహరణకు ఈ ఆలయంలో 24 గంటలు ఒక ధుని వెలుగుతూ కనిపిస్తుంది. ఇది శివ పార్వతుల వివాహం సమయంలో వెలిగించినదిగా చెబుతారు. ఇక్కడ నాలుగు నీటి కొలనులు కూడా కనిపిస్తాయి. వీటిలో రుద్ర కుండ్ ను స్నానాల కొరకు, విష్ణు కుండ్ ను ప్రక్షాళన కొరకు, బ్రహ్మ కుండ్ ను తాగేందుకు, సరస్వతి కుండ్ ను తర్పణాల కోసం వినియోగిస్తారు. త్రియుగినారాయణ్ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు కేదార్ నాథ్ పర్వతారోహణకు బేస్ క్యాంప్ అయిన గౌరీ కుండ్ ఆలయంలో కూడా నమస్కారం చేస్తారు.
ఆలయ ప్రాముఖ్యత ఏమిటి?
స్థానిక సిద్ధాంతం ప్రకారం ఇక్కడ శివ పార్వతుల వివాహంలో బ్రహ్మ అర్చక సేవలను చేయగా, విష్ణు మూర్తి వధువు సోదరుడిగా చేయాల్సిన అన్ని ఆచారాలను నిర్వహించినట్లు చెబుతారు. ఈ వివాహం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడానికి ఆలయంలో బ్రహ్మ శిల అని పిలువబడే రాయి ఉంటుంది. ఇక్కడ పవిత్రమైన అగ్ని నుంచి వచ్చే బూడిదను తీసుకువెళ్లి ఇంట్లో ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచుకుంటే నూతన జంట సంతోషంగా ఉంటారని నమ్ముతారు.
త్రియుగినారాయణ్ & కేదార్ నాథ్ ఆలయం
నిర్మాణశైలిలో త్రియుగినారాయణ్ ఆలయం ప్రసిద్ధ కేదార్ నాథ్ ఆలయాన్ని పోలి ఉండడం విశేషం. ఆలయ పురాణాల ప్రకారం ప్రస్తుతం ఇక్కడ ఉన్న నిర్మాణం ప్రముఖ సిద్ధ సాధువు, తత్వవేత్త అయిన ఆది శంకరాచార్యచే 1200 సంవత్సరాల క్రితం నిర్మించబడినట్లు కధనం.
Read Also..
Read Also..






Total views : 90708