పల్నాడు జిల్లా.. సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇక్కడి నుండే పోటీ చేస్తా.. అసెంబ్లీలో అడుగుపెడతా.. ఇంటింటికి మీ కోడెల కార్యక్రమంలో యువనేత డాక్టర్ కోడెల శివరాం స్పష్టం. ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన సత్తెనపల్లి గడ్డ… కోడెల అడ్డా… అనేది తద్యమని సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం స్పష్టం చేశారు. ఇంటింటికి మీ కోడెల కార్యక్రమంలో భాగంగా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలో సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ నాయకులు యువనేత డాక్టర్ కోడెల శివరాం విస్తృతంగా పర్యటించారు. తమ అభిమాన నాయకుని కుమారుడు యువనేత డాక్టర్ కోడెల శివరాం తమ గ్రామంలోకి వస్తున్నారని తెలుసుకున్న ముస్లిం యువత అధిక సంఖ్యలో ఎదురెళ్లి మరి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యువనేత డాక్టర్ కోడెల శివరామ్ మాట్లాడుతూ రాబోయే 2024 ఎన్నికల్లో సత్తెనపల్లి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాను పోటీలో ఉండడం ఖాయమని కోడెల అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాక ప్రజాభిమానంతో గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టడం కూడా అంతే తద్యం అన్నారు. ఊసరవెల్లి రాజకీయాలు, స్వార్థ రాజకీయాలు, కుల రాజకీయాలు చేసే నాయకుల్ల రోజుకో జెండా మోయడం కోడెల రక్తంలో లేదన్నారు. చంద్రబాబు నాయకత్వంలో, తెలుగుదేశం పార్టీ ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నానని యువ నేత డాక్టర్ కోడెల శివరాం తెలిపారు. అనంతరం గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ తెలుగుదేశం నాయకత్వాన్ని బలపరచాలని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను వివరిస్తూ ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో కోడెల వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, కోడెల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Election Campaign
జనగాం నియోజకవర్గంలో సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ముఖ్యఅతిథిగా కేంద్ర హోమ్ మంత్రి హమిత్ షా హాజరు అవుతున్నారు. ఈ సందర్భంగా సభా ప్రాంగణ ఏర్పాట్లను జనగామ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు, బిజెపి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆరుట్ల దశమంతరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రాంతీయత్రుడే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఈ ప్రాంతం వాడికి పట్టం కట్టాలని ప్రజల నిర్ణయం తీసుకున్నారు అని చెప్పారు. ఎన్నికల కమిషనర్ అక్టోబర్ 31కి చివరి తేదీ ప్రకటించిన తరువాత బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ కాలేజీలో ఉన్న విద్యార్థులను మరియు స్టాప్ ను ఉపయోగించి 8620 ఓట్లను నమోదు చేయించుకుని అక్రమాగ్రంలో గెలవాలని చూస్తున్నారని చెప్పారు దీనిపైన ఎలక్షన్ కమిషనర్ కు ఫిర్యాదు చేస్తుమని చెప్పారు రేపు జరగబోయే సకల జనుల విజయ సంకల్ప సభకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు.
Read Also..
జనగామ జిల్లా జనగామ నియోజకవర్గం సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా నేడు brs పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ మున్సిపాలిటీ లోనీ పలు వార్డు లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ… జనగామ నియోజకవర్గ ప్రజలు 10 సం. రాల బీఆర్ఎస్ పరి పాలనలో సంతోషంగా ఉన్నారు అని అన్నారు. కెసిఆర్ చేపట్టిన పతకాలు అందరికీ అందుతున్నాయి అని అన్నారు. తిరిగి కెసిఆర్ గారిని ముఖ్యమంత్రి నీ చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు అని అన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ వాళ్లకు జనగామ ప్రజలు సంతోషంగా ఉండటం వారికి ఇష్టం లేదు అందుకే ప్రచారం లో కూడా గూండాలను ఈసుకొని తిరుగుతున్నారు అని అన్నారు. అలాగే నిన్న జరిగిన కెసిఆర్ ప్రజా ఆశీర్వాద సభలోని జన సమూహాన్ని చూసి కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ఓటమి బాయం పట్టుకుంది అన్నారు. ఇకపోతే నేను లోకల్ కాదు అని ప్రచారం చేస్తున్నారు నాది ఎక్కడో కాదు తరిగొప్పుల పక్కనే మావురు అని అన్నారు. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా వచ్చేది కెసీఆర్ ప్రభుత్వం మే తెలంగాణ ప్రజలు డిసైడ్ ఐ ఉన్నారు అని అన్నారు. జనగామ లో గెలిచేది మేమే జనగామకు కావలసిన పల్టెక్నిక్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీ లు జనగామకి అవసరం ఉన్నవి అన్నీ కెసిఆర్ గారిని ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత నాది అని అన్నారు.
ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ లో కూకట్ పల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ ముద్ధం నరసింహ యాదవ్ తో కలిసి డివిజన్ లోని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు. ఈరోజు డివిజన్ పరిధిలోని ప్రియదర్శిని హోటల్ నుండి ప్రారంభమై ఎస్సీ బస్తి, మాల బస్తీ, అంజయ్య నగర్, హాస్మత్ పెట్టు, మల్లికార్జున నగర్ కాలనీ, వివిధ బస్తిలలో వేలాదిమంది కార్యకర్తల నడుమ ఎన్నికల ప్రచారం చేపట్టారు.
పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి మాధవరం కృష్ణారావును భారీ మెజార్టీతో గెలిపించాలని పాదయాత్ర చేపట్టారు. మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ… ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని, మరి అదే విధంగా కూకట్పల్లి నియోజకవర్గం లో తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లు నీ కోరారు. నియోజకవర్గంలో పాటు ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ ను కూడా ఇంకా అభివృద్ధి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్న చలమల్ల కృష్ణారెడ్డికి గ్రామ యువకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. అనంతరం కృష్ణారెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన స్థానికుడినైనా తనను గెలిపించాలని ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చానని కాంగ్రెస్ అహంకార అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండి మునుగోడు నియోజకవర్గాన్ని ఉద్ధరించింది ఏమీ లేదని రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసినా ప్రభాకర్ రెడ్డి తన సొంతంగా నిధులు తెచ్చిన దాకాలు లేవని అసెంబ్లీకి నిద్రపోవడానికి తప్ప నియోజకవర్గ సమస్యలపై పోరాడింది ఏమీ లేదని ఒక్కసారి తనకు అవకాశం ఇస్తే కేంద్ర ప్రభుత్వంతో సహకారంతో విద్యా, వైద్యం, రోడ్లు, త్రాగునీరు ప్రాజెక్టులు తీసుకొస్తానని కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తనని గెలిపించాలని బిజెపి అభ్యర్థి చలమల్ల కృష్ణారెడ్డి ఓట్లను అభ్యర్థించారు.
Read Also..
ఎన్నికల ప్రచారంలో భాగంగా రామగుండం నియోజకవర్గం ఈ నెల 19వ తేదీన హుజురాబాద్ ఎమ్మెల్యే, బిజెపి స్టార్ క్యాంపైనర్ ఈటెల. రాజేందర్ గోదావరిఖనికి రానున్నారని బిజెపి పార్టీ అభ్యర్థి కందుల సంధ్యారాణి తెలిపారు. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా మంచిర్యాలకు చేరుకుంటారని అక్కడ సభ ముగిసిన అనంతరం రోడ్డు మార్గాన గోదావరిఖనికి రానున్నారని మొదటగా గోదావరి నది బ్రిడ్జి వద్ద ఘన స్వాగతం పలికి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గోదావరిఖని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగే సభకు హాజరవుతారని సంధ్యారాణి తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సంధ్యారాణి ఒక ప్రకటనలో కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చిందని ఏ ఒక్క హామీకి కూడా నిబద్ధత లేదని సత్తుపల్లి శాసనసభ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. మాజీ మంత్రి స్తంభాన్ని చంద్రశేఖర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏనాడు దళితుల గురించి ప్రస్తావించిన కాంగ్రెస్ దళిత బంధు పథకం పై విమర్శలు చేస్తుందని ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొట్టమొదటిగా సత్తుపల్లి నియోజకవర్గంలోని దళితులందరికీ దళిత బంధు అమలు చేపిస్తానని అందరికీ దళిత బంధు అందిన తర్వాతే పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడుగుతామని సండ్ర తెలిపారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం లోని షాబాద్ మండలంలోని అంతారం, కాక్కులుర్, కేసారం, సర్దార్ నగర్ మరియు కుర్వగుడా గ్రామలలో బిఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజలతో మమేకమై తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా ఆయన కోరారు.
ఈ ఎన్నికల్లో అయనకు ఉన్నా ప్రత్యర్థులను విమర్శిస్తూ వారి పై ఉన్న కేసుల గురుంచి చెప్తు వారికీ ఓటు వేస్తే అభివృధి అనేది కుంటు పడుతుందని ఈ సంద్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి పట్నం అవినాశ్ రెడ్డి, మండల అధ్యక్షుడు గూడూరు నర్సింగరావు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..
Read Also..
సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని ఓసిపి 5 బొగ్గుగని పై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా గెలిపించాలని కార్మికులను కోరారు. తన వంతుగా కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్ , తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. రాత్రి పట్టణంలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలో ప్రచారంలో భాగంగా నినాదాలు చేస్తూ ఎదురెదురైన బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారే నినాదాలు చేస్తుండడంతో సమయానికి పోలీసులు వచ్చి ఇరు వర్గాలను చెదరగొట్టడంతో వివాదం సద్దుమణిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే, తమను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని అడ్డుకొని తమపై తిడుతూ, అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.





Total views : 90719