హైదరాబాద్ హయత్ నగర్ పరిధి భాగ్యలత అయాన్ డిజిటల్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం. దిల్ సుఖ్ నగర్ డిపోకి చెందిన RTC బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో ముందున్న 2 ఆటోలు, 6 బైక్లు, 2 కార్లను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ ఆటోలోని మహిళ తల పగిలి గాయాలయ్యాయి. మరికొందరికి తీవ్రగాయాలవగా వారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. కాగా బస్సు బ్రేక్ ఫెయిలైందని డ్రైవర్ అరిచాడని స్థానికులు తెలిపారు.
Fatal road accident
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పట్టణంలోని కృష్ణమానస కాలనీ సమీపంలో గల అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై ఆదివారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడిన కారును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు మిర్యాలగూడ పట్టణ సమీపంలోని నందిపాడు గ్రామానికి చెందిన జ్యోతి (30), మహేష్ (35), మచ్చేందర్ (38), ఇషిక (8), లియాన్స్(2)లు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.ఈ నెల 26న కారులో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలోని మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లిన వారు ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కోటబొమ్మాలి ఇండియన్ బ్యాంక్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భీమిలి నియోజకవర్గంలో జరుగుతున్న వైఎస్ఆర్సిపి సిద్ధం సభకు వెళ్తుండగా ఆపశృతి చోటుచేసుకుంది. కోటబొమ్మాలి మండలం కొసాల పురం గ్రామానికి చెందిన ఉప్పాడ లక్ష్మణరావు(48) ప్రైవేట్ బస్సు కండక్టర్గా పనిచేస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న బస్సు నుండి కాలుజారి అదే బస్సు చక్రాల కింద పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
అల్లూరి జిల్లాలో ఘోర ఘాట్ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు బయలుదేరిన ఇన్నోవా కారు లోయలోకి దూసుకుపోవడంతో ఘోర రోడ్ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో 11 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఒక మహిళా మృతి చెందింది. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. బాధితులను స్థానిక అరుకు ఆస్పత్రికి తరలించారు. ప్రయాణికులు అందరూ ఒకే కుటుంబంకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. విశాఖపట్నం, మాధవధారకు చెందిన వారుగా గుర్తింపు, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రకాశం జిల్లా.. త్రిపురాంతకం మండలం ఎల్లంపల్లి వద్ద.. రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం, కారు ఎదురెదురుగా వస్తూ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం 108లో త్రిపురాంతకం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. దోర్నాల నుండి వినుకొండ వైపు కారు వెళ్తుండగా.. బొలెరో వాహనం కుంట వైపు అతివేగంతో వెళ్లడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన మహిళ పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెందిన షేక్ షమీగా పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణాజిల్లా గన్నవరం కోనయ్య చెరువు వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఆగిరిపల్లి నుంచి గన్నవరం ఓవర్ లోడుతో వచ్చే క్వారీ లారీ, కొనయ్య చెరువు వద్ద మూడు రోడ్లు క్రాసింగ్ వద్ద ఒక్కసారిగా ద్విచక్ర వాహనాన్ని కొట్టింది. టిప్పర్ లారీ ఢీకొన్న దాటికి ద్విచక్ర వాహనదారుడు అక్కడకక్కడ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి గన్నవరం మండలం కేసరపల్లి శివారు వెంకట నరసింహాపురం కాలనీ వాసి తిరువీధి వెంకటేశ్వరరావు (60) గా గుర్తింపు.. సంఘటన స్థలానికి చేరుకున్న గన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ లో ఘోర ప్రమాదం జరిగింది. బాలానగర్ కూడలి వద్ద వేగంగా వస్తున్న డీసీఎం ఆటో, బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మృతులు మోతీ ఘనాపూర్ వాసులుగా గుర్తించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి శుక్రవారం సంత బాలానగర్ సెంటర్ లో నిర్వహిస్తారు. దీని కోసం చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి ప్రజలు వస్తుంటారు. అయితే సంతకు వచ్చిన కొందరు సరుకులు కొనుగోలు చేసి ఆటోలో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి వస్తున్న డీసీఎం ఆటో, బైకును ఢీకొట్టింది. అయితే అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో విషాదం నెలకొంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని జహీర్ అనే వ్యక్తి మృతి చెందాడు. జహీర్ గ్రామంలోని సొసైటీలో క్రాప్ అసిస్టెంట్ గా పని చేస్తున్నాడు. పని నిమిత్తం కందుకూరు వెళ్లి బైక్ పై రాత్రి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి అక్కడికక్కడే చనిపోయాడు. రాత్రి 10 గంటల తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు జహీర్ కు ఫోన్ చేసిన స్పందించలేదు. వేంసూరు మండలం కందుకూరు గ్రామ శివారు రోడ్డు ప్రమాదానికి గురై జహీర్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో జహీర్ కుటుంబంలో, తుంబురు గ్రామంలో విషాదం నెలకొంది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోడ్డుపై వడ్లు ఆరబోసి ఉండటం తో వాటిని తప్పించే క్రమం లో ఎదురుగా వచ్చిన వాహనం జహీర్ ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వేంసూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also..
ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం మిట్టమీదీపల్లె గ్రామ సరిహద్దులోని జాతీయ రహదారిపై బైక్ ను కారు ఢీ కొన్న సంఘటన లో తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు ఫణీంద్ర ఆరోగ్యం బాగాలేక పోతే మార్కాపురం ఆసుపత్రిలో చూపించుకోని తిరిగి కంభం కు పోతున్న క్రమంలో మిట్టమీద పల్లె గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ సంఘటన లో తండ్రి సొరకాయల బుజ్జి (35), కొడుకు ఫణీంద్ర (10) అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు కంభం వాసులు గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణం కారు వేగంగా రావడమని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో నూతన సంవత్సర సమయంలో వృద్ధ దంపతులకు గర్బ శోకం మిగిలింది. గుమ్మల్లదొడ్డి జంక్షన్ రోడ్ ప్రమాదం లో అచ్చుతాపురం గ్రామానికి చెందిన గోక ఏసురాజు (30), అనే యువకుడు దుర్మరణం పాలైనాడు. జాతీయ రహదారిపై ఇటీవల ప్రమాదాల నివారణ కోసం ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ డ్రమ్ములను బలంగా ఢీ కొట్టాడు. నూతన సంవత్సర వేడుకలు పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొత్త సంవత్సరం పూట కొడుకుని పోగొట్టుకున్న వృద్ధ దంపతులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read Also..