Wednesday, July 22, 2026
News Navigation
Wednesday, July 22, 2026
News Navigation

Breaking

Wednesday, July 22, 2026
Home TelanganaNalgonda ఘోర రోడ్ ప్రమాదం..

ఘోర రోడ్ ప్రమాదం..

by Rama
Fatal Car Accident

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. పట్టణంలోని కృష్ణమానస కాలనీ సమీపంలో గల అద్దంకి-నార్కెట్ పల్లి రహదారిపై ఆదివారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడిన కారును గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు సంఘటనాస్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు మిర్యాలగూడ పట్టణ సమీపంలోని నందిపాడు గ్రామానికి చెందిన జ్యోతి (30), మహేష్ (35), మచ్చేందర్ (38), ఇషిక (8), లియాన్స్(2)లు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.ఈ నెల 26న కారులో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలోని మోపిదేవి దైవ దర్శనానికి వెళ్లిన వారు ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisements

You may also like

Our Visitor

042276
Total views : 223720

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.

error: