Thursday, June 4, 2026
News Navigation
Thursday, June 4, 2026
News Navigation

Breaking

Thursday, June 4, 2026
Home Political సింగరేణి కంచెను తొలిగించిన ఎమ్మెల్యే..

సింగరేణి కంచెను తొలిగించిన ఎమ్మెల్యే..

by Rama
Singareni fence

సింగరేణి యాజమాన్యం స్పందించి రామగుండం మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని కోసం రైతుల నుండి తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. గత 30 సంవత్సరాల క్రితం పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని పాముల పేట, లింగాపూర్, మేడిపల్లి గ్రామాలకు చెందిన రైతుల నుండి సింగరేణి సంస్థ ఓసిపి 4 ఏర్పాటు కొరకై భూములను సేకరించిన యాజమాన్యం బొగ్గు నిల్వలు పూర్తి అయి గనిని మూసివేసినప్పటికి భూములు తిరిగి ఇవ్వడం లేదని, పైగా కంచెను ఏర్పాటు చేసి రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని రాజ్ ఠాకూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో కలిసి సింగరేణి సంస్థ ఏర్పాటు చేసిన కంచెను ట్రాక్టర్ సహాయంతో స్వయంగా ఎమ్మెల్యే తొలిగించారు. విలేజి రామగుండం, పాములపేట, లింగాపూర్, మేడిపల్లి భూనిర్వాసిత రైతులకు ఎలాంటి ఇబ్బంది తలపెట్టవద్దని, వెంటనే ఫెన్సింగ్ వేసే పనిని ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో స్వయంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.

Advertisements

You may also like

Our Visitor

020215
Total views : 92504

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.