రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను భయపెట్టి జగన్ పాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆరోపించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగలకుదురు గ్రామం నుంచి తన రెండో రోజు పాదయాత్ర ప్రారంభించారు. ఓట్ల కోసం నా ఎస్సీ, నా ఎస్టీ, నాబీసీ, నా మైనార్టీ అంటూ ప్రేమ కురిపించి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాలన్నింటినీ జగన్ మోసం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని 33 వేల మందిపై దాడులు జరిగాయని ఆరోపించారు. జగన్ పాలనతో విసిగిపోయిన ప్రజలు ఆయన ను ఇంటికి పంపేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
Tag:
former minister Alapati Raja
మంత్రి అంబటి రాంబాబు కి మాజీ మంత్రి ఆలపాటి రాజా కౌంటర్ ఇచ్చారు. శవాలను గుట్టలుగా వేసుకొని పోస్టు మార్టం మీరు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. సకాలంలో కాల్వ తవ్వలేని, మురుగు కాల్వ బాగుచేయలేని మంత్రి అంబటి రాంబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోనే కాదు ఎక్కడ కూడా రాజకీయ మనుగడ లేని వ్యక్తి అంబటి రాంబాబు అని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అంటూ మండి పడ్డారు. సంక్షేమ ముసుగులో పెద్ద ఎత్తున అవినీతి చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి మద్యపానాన్ని నిషేదిస్తాను అన్న మాట తప్పారు అంటూ ఎద్దేవా చేశారు.