ట్రాక్టర్ లీజు (Tractor Lease) :
అమాయక రైతులను మోసం చేసి 57 ట్రాక్టర్లను లీజు (Tractor Lease) పేరుతో తీసుకెళ్లి అమ్మేసుకున్న మోసగాళ్లు. రైతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని తాడిమర్రి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులు రవికుమార్ భయ్యా రెడ్డి, హాజీపేరా అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి, ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు ఈ రోజు తాడిమర్రి పోలీస్ స్టేషన్ వద్ద విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
ఇది చదవండి : వైసిపి పై బురద జల్లాలని చూస్తున్నారు – కావటి
దేవర రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ…
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం తాడిమర్రి గ్రామానికి చెందిన దేవర రామ్మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేయగా నిందితులు రైతుల వద్ద నెలకు 25 వేల రూపాయలు బాడుగ ఇస్తామని చెప్పి ట్రాక్టర్లను తీసుకొని వేరే వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది అన్నారు.
పులివెందులతో పాటు రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ట్రాక్టర్లను విక్రయించిన విషయం తెలుసుకొని తాడిమర్రి పోలీసులు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని తాడిమర్రి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ట్రాక్టర్ల విలువ నాలుగు కోట్ల 56 లక్షల రూపాయలని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులను సైతం త్వరలో పట్టుకుంటామని ఎస్పీ తెలిపాడు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశం..
కార్యకర్తే పార్టీ అధినేత అనేది.. మహానాడులో ప్రతిబింబించాలని సీఎం చంద్రబాబు ఖరాఖండిగా చెప్పారు. మహిళలకు టీడీపీ ఇస్తున్న ప్రాధాన్యం అందరికీ అర్థమయ్యేలా మహానాడు వేదికగా చాటిచెప్పాలని అన్నారు. సంప్రదాయ ఓటును జాగ్రత్తగా కాపాడుకోవాలని చంద్రబాబు పిలుపు నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. టీడీపీ… - గోదావరి ఒడ్డునే దాహార్తి… పినపాకలో తాగునీటి సంక్షోభం..
మండు వేసవి మొదలైతే చాలు… గోదావరి ఒడ్డున ఉన్న పల్లెల్లో ప్రజలకు తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని కరకగూడెం, పినపాక, మణుగూరు, అశ్వాపురం మండలాల్లో మంచినీటి సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది. ఇంటింటికీ సురక్షితమైన తాగునీరు… - తోడపెద్దుకి దినకార్యం చేసిన గ్రామస్తులు ..
విశాఖ జిల్లాలో వింత ఆచారాన్ని ఓ సామాజిక వర్గంవారు ఇప్పటికీ ఆచరిస్తున్నారు. తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని తూచా తప్పక పాటిస్తారు. దీనినే తోడపెద్దు దినకార్యం అంటారు. పెదగంట్యాడ మండలం మొల్లివానిపాలెంలో ఉన్న యాదవుల కుటుంబీకులు తోడపెద్దును ఇంట్లో…








Total views : 81818