దేవుడు తనకి ఇచ్చినటువంటి శక్తినంత రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. 40, 650 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన అనంతరం తొలిసారిగా రాయదుర్గం వచ్చిన శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాయదుర్గంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఆయనకు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శాలువా, పూలమాలలు, గజమాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.వేలాదిమంది కార్యకర్తలు నడుమ అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం లో విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. డీజే, నృత్యాలతో సంబరంగా ర్యాలీ కొనసాగింది. తెదేపా శ్రేణులు అడుగడుగునా ఆయనను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ బళ్ళారి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వరకు చేరేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయదుర్గంలో పేదరికాన్ని తరిమికొట్టేంతవరకు నిర్విరామంగా అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించడంతోపాటు ఉంతకల్లు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా హెచ్ ఎల్ సి ఆధునీకరణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాయదుర్గం నియోజకవర్గం లో లక్ష ఎకరాలకు సాగునీరంందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఐదేళ్లు ఇబ్బందులు పడి తనకు అండగా నిలిచిన కార్యకర్తలను తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటానని తెలిపారు.కాలవ విజయవత్సవ ర్యాలీలో నియోజకవర్గ ప్రజలే కాకుండా కళ్యాణదుర్గం, బళ్ళారి తదితర ప్రాంతాలనుంచి వేలాదిమంది తేదేపా నాయకులు, కార్యకర్తలుపెద్ద ఎత్తున తరలివచ్చారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది.నీట్ నిరసన సెగ హైదరాబాద్ కు తగిలింది. నాంపల్లి పరిసర ప్రాంతాలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు నిరసనలతో హొరెత్తాయి. లోక్సభ ప్రతి పక్ష నాయకుడు రాహుల్గాంధీ అరెస్ట్ తో పాటు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా…
- జనరిక్ మెడిసిన్ దిగుమతులపై ట్రంప్ కీలక ప్రకటన.జనరిక్ ఔషధాల దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 1 నుంచి జనరిక్ ఔషధాలపై సుంకాలు ఉండబోవని ప్రకటించారు. అమెరికాలోకి దిగుమతి అయ్యే అన్ని జనరిక్ ఔషధాలకు సున్నా శాతం సుంకం వర్తిస్తుందని..రెండేళ్ల పాటు ఇది…
- సి.వి.రావును కలిసిన సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్.ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు బండ్ల గణేష్ ఈరోజు ఇమేజ్ హాస్పిటళ్లు, సీవీఆర్ ఛానళ్ల ఛైర్మన్ సి.వి.రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సీవీఆర్ న్యూస్ కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేష్… తన కుమార్తె వివాహానికి హాజరుకావాలని కోరారు. చైర్మన్…
- రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న NSUI నాయకులు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మరియు వారికి మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. NSUI జాతీయ…
- మెయిన్ వాపస్ ఆవుంగా’ విజయోత్సవం – ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన ఇమ్తియాజ్ అలీ.హిందీ చిత్రం ‘మెయిన్ వాపస్ ఆవుంగా’ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. విడుదలై ఆరు వారాలు పూర్తయినా ఈ సినిమా ఇంకా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. ప్రస్తుతం భారతదేశంలో 450కు పైగా షోలతో పాటు విదేశాల్లోని 10 దేశాల్లో కూడా…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 223765