దేవుడు తనకి ఇచ్చినటువంటి శక్తినంత రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి కోసం ఉపయోగిస్తానని శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. 40, 650 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన అనంతరం తొలిసారిగా రాయదుర్గం వచ్చిన శాసనసభ్యులు కాలవ శ్రీనివాసులు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. రాయదుర్గంలోని ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఆయనకు తెదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శాలువా, పూలమాలలు, గజమాలతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.వేలాదిమంది కార్యకర్తలు నడుమ అంగరంగ వైభవంగా పండుగ వాతావరణం లో విజయోత్సవ ర్యాలీ కొనసాగింది. డీజే, నృత్యాలతో సంబరంగా ర్యాలీ కొనసాగింది. తెదేపా శ్రేణులు అడుగడుగునా ఆయనను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ప్రారంభమైన విజయోత్సవ ర్యాలీ బళ్ళారి రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహం వరకు చేరేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాయదుర్గంలో పేదరికాన్ని తరిమికొట్టేంతవరకు నిర్విరామంగా అహర్నిశలు కృషి చేస్తామని పేర్కొన్నారు. భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలు అందించడంతోపాటు ఉంతకల్లు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా హెచ్ ఎల్ సి ఆధునీకరణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాయదుర్గం నియోజకవర్గం లో లక్ష ఎకరాలకు సాగునీరంందించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. ఐదేళ్లు ఇబ్బందులు పడి తనకు అండగా నిలిచిన కార్యకర్తలను తన కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటానని తెలిపారు.కాలవ విజయవత్సవ ర్యాలీలో నియోజకవర్గ ప్రజలే కాకుండా కళ్యాణదుర్గం, బళ్ళారి తదితర ప్రాంతాలనుంచి వేలాదిమంది తేదేపా నాయకులు, కార్యకర్తలుపెద్ద ఎత్తున తరలివచ్చారు.
FOLLOW US ON : FACE BOOK , INSTAGARAM , YOU TUBE , GOOGLE NEWS
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 90053