తిరుపతి కార్పోరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు కస రత్తులు ప్రారంభిం చారు. కనీసం 40 మంది వైసిపి కార్పో రేటర్లను కొనడానికి రంగం సిద్ధం చేసు కుంటున్నారని సమాచారం. ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టగల వారిని మేయర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆశీస్సుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. కూటమి మద్దతుతో తిరుపతి జనసేన అభ్యర్ధిగా ఆరణి శ్రీనివాసులు 61,956 మెజారిటీతో వైసిపిఅభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై విజయం సాధించారు.దీనితో నగరంలో కూటమికి తిరుగులేని ప్రజా మద్దతు ఉందని తేలిపోయింది. కాబట్టి ఎలాగైనా మేయర్ పదవిని దక్కించుకోవాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. 2021లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 50 మంది కార్పొరేటర్ల 48 మంది వైసిపి వారు గెలిచారు. టిడిపి నుంచి కార్పొరేటర్ గా ఒకరు మాత్రమే ఎన్నికయ్యారు. తిరుగులేని మెజారిటీ రావడంతో డాక్టర్ శిరీషకు యాదవ్ మేయర్ పదవి చేపట్టారు. డిప్యూటీ మేయర్లుగా ముద్రనారాయణ, భూమన అభినయ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు వైసిపికి రాజీనామా చేశారు. కొందరు కూటమి నేతలతో రహస్య మంతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేతను మేయర్ గా చేసి పవన్ కళ్యాణ్ కు బఘుమతిగా ఇవ్వాలని చూస్తున్నారు. అయితే టిడిపి నేతలు తమ ప్రాబల్యం కాపాడుకోవడానికి జనసేన ప్రయత్నాలకు మోకాలు అడ్డు తున్నారని అంటున్నారు.మేయర్ శిరీష మెజారిటీ కార్పొరేటర్ లను టిడిపిలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కార్పోరేషన్ చేయి జారకుండా చూసుకోవాలని వైసిపి నేతలు పట్టుగా ఉన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ఆరోపణలు.అమెరికా ఎన్నికల వ్యవస్థలో చైనా భారీగా జోక్యం చేసుకుందని, ఏకంగా 22 కోట్ల మంది ఓటర్ల డేటాను దొంగిలించిందని సంచలన ఆరోపణలు చేశారు US ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్నికల డేటా చౌర్యం అని ఆరోపించారు.…
- అన్నమయ్య జిల్లాలో ఘనంగా విరుపాక్షమ్మ తల్లి పుష్కరోత్సవాలు.అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లిలోని శ్రీ విరుపాక్షమ్మ తల్లి ఆలయంలో పుష్కరోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణానికి 12 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవాల్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.మూడు…
- దేశంలో పట్టాలెక్కిన తొలి హైడ్రోజన్ రైలు.భారత రైల్వే చరిత్రలో నూతన శకం ఆరంభమైంది. రైల్వే రంగంలో పర్యావరణహిత విధానాలను ప్రవేశపెట్టే దిశగా కీలక ముందడుగు పడింది. దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్తో నడిచే రైలు పట్టాలెక్కింది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.…
- పశ్చిమ బెంగాల్లో రైలు ప్రమాదం.పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లో విషాదం నెలకొంది. స్కూల్ బస్సును రైలు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం 7 గంటల ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతుండగా…
- ఇరాన్పై మరోసారి అమెరికా దాడులు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉధృతమయ్యాయి. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ వంటి హర్మూజ్ జలసంధి కేంద్రంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్లోని బ్రిడ్జిలు, రవాణా మార్గాలపై అమెరికా వైమానిక దాడులను మరింత తీవ్రతరం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Total views : 212585