తిరుపతి కార్పోరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు కస రత్తులు ప్రారంభిం చారు. కనీసం 40 మంది వైసిపి కార్పో రేటర్లను కొనడానికి రంగం సిద్ధం చేసు కుంటున్నారని సమాచారం. ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టగల వారిని మేయర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆశీస్సుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. కూటమి మద్దతుతో తిరుపతి జనసేన అభ్యర్ధిగా ఆరణి శ్రీనివాసులు 61,956 మెజారిటీతో వైసిపిఅభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై విజయం సాధించారు.దీనితో నగరంలో కూటమికి తిరుగులేని ప్రజా మద్దతు ఉందని తేలిపోయింది. కాబట్టి ఎలాగైనా మేయర్ పదవిని దక్కించుకోవాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. 2021లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 50 మంది కార్పొరేటర్ల 48 మంది వైసిపి వారు గెలిచారు. టిడిపి నుంచి కార్పొరేటర్ గా ఒకరు మాత్రమే ఎన్నికయ్యారు. తిరుగులేని మెజారిటీ రావడంతో డాక్టర్ శిరీషకు యాదవ్ మేయర్ పదవి చేపట్టారు. డిప్యూటీ మేయర్లుగా ముద్రనారాయణ, భూమన అభినయ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు వైసిపికి రాజీనామా చేశారు. కొందరు కూటమి నేతలతో రహస్య మంతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేతను మేయర్ గా చేసి పవన్ కళ్యాణ్ కు బఘుమతిగా ఇవ్వాలని చూస్తున్నారు. అయితే టిడిపి నేతలు తమ ప్రాబల్యం కాపాడుకోవడానికి జనసేన ప్రయత్నాలకు మోకాలు అడ్డు తున్నారని అంటున్నారు.మేయర్ శిరీష మెజారిటీ కార్పొరేటర్ లను టిడిపిలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కార్పోరేషన్ చేయి జారకుండా చూసుకోవాలని వైసిపి నేతలు పట్టుగా ఉన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- ‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్లో వీఎన్ ఆదిత్య..శరణ్య-సుధీక్ష సమర్పణలో స్కంద ఫిల్మ్స్ బ్యానర్ మీద ‘మన డాక్టర్ బాబే’ అనే సినిమాని కృతాక్షి నిర్మిస్తున్నారు. ఈ మూవీతో శ్రీ స్కంద హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాకి చలపతి కుమార్ పువ్వల స్కోరీ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం…
- ఐపీఎల్ 2026 ఫైనల్కు రంగం సిద్ధం..ఐపీఎల్ 2026 సీజన్కు నేడు గ్రాండ్ ఫినాలేతో తెరపడనుంది. ఒకవైపు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. మరోవైపు వ్యూహాత్మక ఆటతో ఆకట్టుకున్న గుజరాత్ టైటాన్స్.. టైటిల్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. అహ్మదాబాద్లోని ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ వేదిక నరేంద్ర మోదీ…
- కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..సముద్ర గర్భం కుచించుకుపోతోంది. నానాటికీ మడ అడవులు అంతరించిపోతున్నాయి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, CRZ నిబంధనలు సముద్ర గర్భంలో పాతి పెడుతూ భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఈ దొంగలు సాగిస్తున్న అరాచకాలతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. కృష్ణా జిల్లా బందరు రూరల్…
- హైదరాబాద్లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. ఈ భేటీలో…
- దాసరి నారాయణరావు గారు ఓ ఇన్స్టిట్యూషన్.. ఆయన్ని చూసి చాలా విషయాలు నేర్చుకోవాలి..దిగ్గజ దర్శకుడు, దర్శక రత్న దాసరి నారాయణరావు వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ను హీరో రాకింగ్ మనోజ్ మంచు, తన సతీమణి భూమా మౌనికతో కలిసి సందర్శించారు. ఈ క్రమంలో దాసరి ఘాట్ దుస్థితిపై యాంకర్ గౌతమి షేర్ చేసిన వీడియోపై…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




Total views : 90038