Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Andhra Pradesh తిరుపతి మేయర్ పదవిపై కూటమి కన్ను…

తిరుపతి మేయర్ పదవిపై కూటమి కన్ను…

by Rama
తిరుపతి మేయర్ పదవిపై కూటమి కన్ను…

తిరుపతి కార్పోరేషన్ మేయర్ పీఠాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి కూటమి నేతలు కస రత్తులు ప్రారంభిం చారు. కనీసం 40 మంది వైసిపి కార్పో రేటర్లను కొనడానికి రంగం సిద్ధం చేసు కుంటున్నారని సమాచారం. ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టగల వారిని మేయర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆశీస్సుల కోసం కొందరు ప్రయత్నిస్తున్నారు. కూటమి మద్దతుతో తిరుపతి జనసేన అభ్యర్ధిగా ఆరణి శ్రీనివాసులు 61,956 మెజారిటీతో వైసిపిఅభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిపై విజయం సాధించారు.దీనితో నగరంలో కూటమికి తిరుగులేని ప్రజా మద్దతు ఉందని తేలిపోయింది. కాబట్టి ఎలాగైనా మేయర్ పదవిని దక్కించుకోవాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. 2021లో జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 50 మంది కార్పొరేటర్ల 48 మంది వైసిపి వారు గెలిచారు. టిడిపి నుంచి కార్పొరేటర్ గా ఒకరు మాత్రమే ఎన్నికయ్యారు. తిరుగులేని మెజారిటీ రావడంతో డాక్టర్ శిరీషకు యాదవ్ మేయర్ పదవి చేపట్టారు. డిప్యూటీ మేయర్లుగా ముద్రనారాయణ, భూమన అభినయ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే ఇద్దరు కార్పొరేటర్లు వైసిపికి రాజీనామా చేశారు. కొందరు కూటమి నేతలతో రహస్య మంతనాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన నేతను మేయర్ గా చేసి పవన్ కళ్యాణ్ కు బఘుమతిగా ఇవ్వాలని చూస్తున్నారు. అయితే టిడిపి నేతలు తమ ప్రాబల్యం కాపాడుకోవడానికి జనసేన ప్రయత్నాలకు మోకాలు అడ్డు తున్నారని అంటున్నారు.మేయర్ శిరీష మెజారిటీ కార్పొరేటర్ లను టిడిపిలో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కార్పోరేషన్ చేయి జారకుండా చూసుకోవాలని వైసిపి నేతలు పట్టుగా ఉన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Advertisements

You may also like

Our Visitor

019160
Total views : 90038

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.