పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమలో గుర్తింపు సంఘం నాయకులు ఉద్యోగాల పేరుతో కుంభకోణానికి పాల్పడుతున్నారని పాలకుర్తి జడ్పీటీసీ, బిజెపి నాయకురాలు కందుల సంధ్యారాణి ఆరోపించారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ ఆవరణలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కార్మిక నాయకులు పరిశ్రమకు సంబంధించిన కొందరు అధికారులతో కుమ్మక్కై లక్షల కోట్ల రూపాయలు అమాయకులు, రైతుల నుంచి వసూలు చేస్తూ గోల్ మాల్ చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో ఎరువుల కర్మాగారం విషయంలో కూడా కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, అలా కాకుండా ఉన్నతాధికారులు దీనిపై సీరియస్గా తీసుకొని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఎన్టీపీసీ పరిశ్రమ ఏర్పాటు సమయంలో భూములు కోల్పోయిన రైతులు, అర్హత కలిగిన యువకులను మోసం చేస్తూ డబ్బులు ఇచ్చిన వారికే తాత్కాలిక ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. నిర్వాసితులకు ఎన్టీపీసీ యాజమాన్యం తప్పనిసరిగా ఉపాధి కల్పించాల్సి ఉండగా కార్మిక నాయకులు కొందరు అధికారులతో కుమ్మక్కై నిర్వాసితుల నోట్లో మన్ను కొడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయంలో ఇప్పటికైనా పరిశ్రమ ఉన్నతాధికారులు స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Kandula Sandhyarani
ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని సీతానగర్ కూరగాయల మార్కేట్ లో రామగుండం నియోజక వర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి కందుల సంధ్యారాణి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కూరగాయల మార్కెట్లో వ్యాపారస్తులను వినియోగదారులను కలిసి బిజెపికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సంధ్యారాణి కోరారు. అనంతరం బిజెపి అభ్యర్థి సంధ్యారాణి మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యంతో కూరగాయల మార్కెట్ అసాంఘిక కార్యకలాపాలకు నీలయంగా మారిందని విమర్శించారు. వర్షాకాలంలో రైతులు కూరగాయలను నిల్వ చేసుకోవడానికి కనీస సౌకర్యాలను కల్పించడంలో నాయకులు విఫలమయ్యారని విమర్శించారు. రామగుండంలో బిజెపి పార్టీని గెలిపిస్తే…గెలిచిన నెల రోజుల్లో సుందరీకరణ తీర్చిదిద్ది ప్రాంతాల నుంచి వచ్చిన రైతులకు విరామం తీసుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు కూరగాయలు నిల్వ చేసుకోవడానికి ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తామన్నారు. కూరగాయల మార్కెట్ భువన సముదాయం కోసం కోట్ల రూపాయలు వేచించి నాయకులు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సామాన్య మహిళగా రామగుండం నియోజకవర్గంలో బిజెపి పార్టీకి ఓటు వేసి ఒక అవకాశం ఇవ్వాలని, ప్రత్యేక మెజార్టీతో గెలిపించాలని కందుల సంధ్యారాణి వారిని కోరారు.





Total views : 79348