సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త ఇన్చార్జిలను నియమించింది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణికం ఠాగూర్ ను నియమించింది. మాణికం ఠాగూర్ కు అండమాన్ అండ్ నికోబార్ దీవుల కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షణ బాధ్యతలు కూడా అప్పగించింది. ఇక దీపాదాస్ మున్షీని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా నియమించారు. ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మాణిక్ రావ్ ఠాక్రే వ్యవహరించారు. అటు, కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జిగా రణదీప్ సింగ్, తమిళనాడు-పుదుచ్చేరి-ఒడిశా ఇన్చార్జిగా డాక్టర్ అజయ్ కుమార్ లను నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
Tag:
Karnataka Congress
ములుగు జిల్లా
ప్రముఖ పర్యటక కేంద్రమైన రామప్ప గెస్ట్ హౌస్ లో కర్ణాటక కు చెందిన మాజీ కాంగ్రెస్ మంత్రి విడిది. కర్ణాటక నుండి భారీగా డబ్బు సంచులు తీసుకొనివచ్చి కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క కోసం పంచడానికి నిలువ ఉంచారని తప్పుడు సమాచారం. రామప్ప గెస్ట్ హౌస్ లో వద్ద భారీగా చేరుకొన్న బిఆర్ఎస్ నాయకులు మీడియా ప్రతినిధులు, ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ అధికారులు, పోలీసులు. గెస్ట్ హౌస్ లో తెల్లవారుజామున మూడు గంటల నుండి సోదాలు. ఎన్నికలకు సంబంధించిన డబ్బులు ఇతర వస్తువులు దొరకకపోవడంతో ఫేక్ న్యూస్ అంటూ వెనకకు తిరిగిన అధికారులు.