నల్గొండ జిల్లా చండూర్ లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2018 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు వల్లే ఎమ్మెల్యే గా గెలిచిన. కేసీఆర్ గద్దె దింపడం బీజేపీ పార్టీ మోడీ నాయకత్వంతో సాధ్యం అనే నమ్మకం తో పార్టీ మరీనా. బీజేపీ కేంద్ర దర్యాప్తు సంస్థలు చేతిలో పెట్టుకొని లిక్కర్ కుంభకోణంలో కవితను అరెస్టు చేయకపోవడం దారుణం. రాష్ట్రంలో బిజెపి బీఆర్ఎస్ఒ కటయ్యాయి. నా లక్ష్యం కేసీఆర్ ను గద్దె దింపడమే, అది బీజేపీ తో సాధ్యం కాలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి విస్తుంది,కేసీఆర్ గద్దె దింపడం కాంగ్రెస్ తోనే సాధ్యమని తిరిగి సొంత పార్టీకి వచ్చిన. మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల వల్లే బిఅర్ఏస్ గెలిచింది. పేదల పార్టీ ,ఆత్మగౌరవం తో పని చేసే నాయకులు కమ్యూనిస్టులు. ఉప ఎన్నికల్లో మీ లక్ష్యం బీజేపీ ఓటమి, రాజగోపల్ రెడ్డి మీద శత్రుత్వం కాదని తెలిసిపోయింది.
kcr at mandamarri
ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని, ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు కేసీఆర్. మంచిర్యాల జిల్లా
మందమర్రిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాకముందు భయంకర పరిస్థితులు ఉండేవని,
సింగరేణిలో 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్సే. వారి పాలనలో నష్టాల్లోకి వెళ్లిన సింగరేణి.. ప్రస్తుతం రూ.2.184కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు. బాల్క సుమన్ రాక ముందు.. వచ్చిన తర్వాత చెన్నూరు ఎలా ఉందో ఆలోచించాలి. చెన్నూరులో సుమన్ చాలా అభివృద్ధి పనులు చేశారు. ఎక్కువ సమయం సుమన్ నా దగ్గరే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తుంటడు.సిఎం దగ్గర ఉండే సుమన్ ను గెలిపించుకుంటే వేగంగా పనులు జరుగుతాయి.. కాబట్టి సుమన్ ను 50వేల మెజారిటీతో గెలిపించాలి అని కేసీఆర్ అన్నారు