ఈ సారి కూడా బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ కు గతం కంటే ఇంకో రెండు సీట్లు ఎక్కువే వస్తాయన్నారు. ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ కు వచ్చేది 20 సీట్లేనని చెప్పారు.బీఆర్ఎస్ అభ్యర్థి కమల్రాజును గెలిపిస్తే మధిరలో దళితులందరికీ దళితబంధు ఇస్తామని హామీ ఇచ్చారు. ధరణి స్థానంలో భూమాత పెడతారట. వాళ్లు పెట్టేది భూమాత కాదు.. భూమేత అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే.. పదేళ్ల నుంచి కొనసాగుతున్న అభివృద్ధి బ్రహ్మాండంగా ముందుకు పోతుందన్నారు. కాంగ్రెస్ నేతలకు రాష్ట్రం గురించి అవగాహనే లేదని ఆయన విమర్శించారు. ఖమ్మం జిల్లాను ఆనుకొని పారుతున్న గోదావరి నుంచి లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథా అవుతున్నాయని, వాటిని ఒడిసి పట్టి ఖమ్మం జిల్లాకు సాగునీరు అందించాలన్న ఆలోచన కాంగ్రెస్ నాయకులకు ఎందుకు రాలేదని కేసీఆర్ ప్రశ్నించారు. భట్టి విక్రమార్క మధిరను పట్టించుకోలేదని, ఆయనకు ఓటేస్తే నష్టమే జరుగుతుందన్నారు. మంచి ప్రణాళికలతో ముందుకెళ్తున్న బీఆర్ఎస్ కు ఓటు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
kcr live
ఎంత మంది తీస్మార్ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు
కేసీఆర్ ప్రజాభిమానం ముందు ఎంత మంది తీస్మార్ఖాన్లు వచ్చినా ఏమీ చేయలేరని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో కల్వకుర్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జైపాల్యాదవ్కు మద్దతుగా నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో, షాద్నగర్ చౌరస్తాలో అభ్యర్థి అంజయ్యయాదవ్తో కలిసి నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ మాట్లాడారు. ఒక్క చాన్స్ ఇవ్వండి అంటున్న కాంగ్రె్సకు గతంలో ప్రజలు 11సార్లు ఇస్తే ఏం సాధించారని ప్రశ్నించారు. వారి పాలనలో కరెంట్ లేక రైతులు, తాగు నీరు దొరకక మహిళలు అష్టకష్టాలు పడ్డారన్నారు. రాష్ట్రంలో 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. కాంగ్రెస్ నేతలు ఐదు గంటల కరెంటు చాలు అనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఈ ఎన్నికలు ఢిల్లీ దొరలకు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్న యుద్ధం అని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ లేకుండాపోయిందని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి ఎన్నికలకు ముందే అస్త్రసన్యాసం చేశారన్నారు. యుద్ధం చేసే ధైర్యం లేక బరిలో నిలువకుండా పారిపోయాడని విమర్శించారు. తెలంగాణలో గులాబీ జెండా ఉండగా గుజరాత్, ఢిల్లీ రాజుల పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లోనూ కేసీఆర్ ఒంటరి పోరాటమే చేసి, మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు