రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మజీ సీఎం, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తొలిసారి ప్రజలను కలిశారు. చింతమడక గ్రామానికి చెందిన ప్రజలు ఆయనను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు. బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. మరోవైపు, ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సులు, 10 కార్లలో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే, వీరిని పోలీసులు చెక్ పోస్ట్ వద్దే ఆపేశారు. అనుమతి ఉంటేనే లోపలకు అనుమతిస్తామని వారికి స్పష్టం చేశారు. దాదాపు 2 గంటల సేపు వేచి ఉన్న తర్వాత వారికి ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చింది. అనంతరం కేసీఆర్ తో చింతమడక గ్రామస్తులు మాట్లాడి వెనుదిరిగారు.
kcr meeting
మెదక్లో ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం
మెదక్ జిల్లా నర్సాపూర్లో గురువారం నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్ల కలకలం రేగింది. సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్న సమయంలో అస్లాం అనే వ్యక్తి ప్రెస్ గ్యాలరీలో కూర్చున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు తనిఖీ చేశారు. రెండు బుల్లెట్లు దొరకడంతో స్వాధీనం చేసుకున్నారు.
అస్లాం సంగారెడ్డి జిల్లా రాయికోడ్కు చెందిన వ్యక్తి. ప్రస్తుతం చిలప్చెడ్ మండలం చండ్రులో ఉంటున్నాడు. అతను ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు. డిగ్రీ క్లాస్మేట్ సహాయంతో ఓ యూట్యూబ్ చానల్ ఐడీ కార్డు సంపాదించినట్టు తేలింది.
అస్లాం గతంలో ఎన్సీసీలో పనిచేసినట్టు సమాచారం. అక్కడ పనిచేసినప్పడే తీసుకొచ్చిన బుల్లెట్లు అయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా అస్లాం కర్ణాటకకు చెందిన వ్యక్తిగా కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు.
ఘటనపై పోలీసుల స్పందన
ప్రజాఆశీర్వాద సభలో బుల్లెట్లు దొరకడంపై పోలీసులు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని గుర్తించి, అతడి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నామని చెప్పారు. అతడి నుండి బుల్లెట్లను ఎక్కడ నుండి తెచ్చుకున్నాడో, ఎందుకు తెచ్చుకున్నాడో తెలుసుకుంటామని పేర్కొన్నారు.
ఘటనపై రాజకీయ పార్టీల స్పందన
ఈ ఘటనపై రాజకీయ పార్టీలు విమర్శలు చేశాయి. రాష్ట్రంలో భద్రత ఏమిటని ప్రశ్నించాయి. ఈ ఘటన రాష్ట్రంలోని భద్రతా పరిస్థితిపై తీవ్ర సవాలుగా మారింది అని అభిప్రాయపడ్డాయి.
ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి?
Read Also..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభ సర్వం సిద్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు సుమారు 60000 మంది వస్తారని అంచనా.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తోంది. నేటి నుంచి రెండవ విడత ప్రచార కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మొత్తం 54 ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
నేడు సీఎం కేసీఆర్ భద్రాచలం, పినపాక రెండు నియోజకవర్గాలకు కలిపి బూర్గంపాడు లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు.
ఏజెన్సీ ఏరియాలు కావడం వల్ల కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.




Total views : 79409