రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత మజీ సీఎం, ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ తొలిసారి ప్రజలను కలిశారు. చింతమడక గ్రామానికి చెందిన ప్రజలు ఆయనను కలిసేందుకు ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఇంట్లో నుంచి బయటకు వచ్చి వారికి అభివాదం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైన తర్వాత ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఆయన అక్కడి నుంచి బయటకు రాలేదు. బయట కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆయన ఫామ్ హౌస్ లోనే సమావేశమయ్యారు. మరోవైపు, ఆయన స్వగ్రామమైన చింతమడక గ్రామస్తులు కేసీఆర్ ను కలిసేందుకు ఫామ్ హౌస్ కు వెళ్లారు. దాదాపు 540 మంది గ్రామస్తులు 9 బస్సులు, 10 కార్లలో ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. అయితే, వీరిని పోలీసులు చెక్ పోస్ట్ వద్దే ఆపేశారు. అనుమతి ఉంటేనే లోపలకు అనుమతిస్తామని వారికి స్పష్టం చేశారు. దాదాపు 2 గంటల సేపు వేచి ఉన్న తర్వాత వారికి ఫామ్ హౌస్ లోకి వెళ్లేందుకు అనుమతి వచ్చింది. అనంతరం కేసీఆర్ తో చింతమడక గ్రామస్తులు మాట్లాడి వెనుదిరిగారు.
kcr public meeting
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభ సర్వం సిద్ధం చేసిన బిఆర్ఎస్ నాయకులు సుమారు 60000 మంది వస్తారని అంచనా.
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తోంది. నేటి నుంచి రెండవ విడత ప్రచార కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు. మొత్తం 54 ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
నేడు సీఎం కేసీఆర్ భద్రాచలం, పినపాక రెండు నియోజకవర్గాలకు కలిపి బూర్గంపాడు లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు.
ఏజెన్సీ ఏరియాలు కావడం వల్ల కేసీఆర్ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలని, ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధమని, డబ్బుకు ఓటు అమ్ముకోవద్దు మనం వేసే ఓటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు కేసీఆర్. మంచిర్యాల జిల్లా
మందమర్రిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
తెలంగాణను ఆంధ్రాలో కలిపింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాకముందు భయంకర పరిస్థితులు ఉండేవని,
సింగరేణిలో 49శాతం వాటాను కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్సే. వారి పాలనలో నష్టాల్లోకి వెళ్లిన సింగరేణి.. ప్రస్తుతం రూ.2.184కోట్ల లాభాల్లోకి తీసుకొచ్చామన్నారు. బాల్క సుమన్ రాక ముందు.. వచ్చిన తర్వాత చెన్నూరు ఎలా ఉందో ఆలోచించాలి. చెన్నూరులో సుమన్ చాలా అభివృద్ధి పనులు చేశారు. ఎక్కువ సమయం సుమన్ నా దగ్గరే ఉంటూ పార్టీ కోసం పనిచేస్తుంటడు.సిఎం దగ్గర ఉండే సుమన్ ను గెలిపించుకుంటే వేగంగా పనులు జరుగుతాయి.. కాబట్టి సుమన్ ను 50వేల మెజారిటీతో గెలిపించాలి అని కేసీఆర్ అన్నారు
కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం..అన్నీ ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలసుకోవాలని.. అభ్యర్థి కంటే పార్టీ చరిత్ర చూసి ఓటెయ్యాలన్నారు. సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందన్నారు.
సింగరేణి తెలంగాణ ఆస్తి అని చేత కాని దద్దమ్మల పార్టీ కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. అందుకే కేంద్రానికి 49 శాతం వాటా ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చాక..బీఆర్ఎస్ పాలనలో సింగరేణి లాభాలను రూ.419 కోట్ల నుంచి…రూ.2,184 కోట్లకు తీసుకెళ్లామని కేసీఆర్ తెలిపారు.




Total views : 79558