సింగరేణి ఎన్నికలు కొనసాగుతున్నాయి. సింగరేణిలో మొదటిసారిగా 1998 సంవత్సరంలో కార్మిక సంఘం ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరుసార్లు ఎన్నికలు జరగగా అందులో ఏఐటీయూసీ మూడు సార్లు, ఐఎన్టీయూసీ ఒకసారి, టీబీజీకేఎస్ రెండు సార్లు గెలిచి అధికార హోదాను అనుభవించాయి. ఏడో దఫా జరిగే 2023 ఎన్నికల్లో 14 సంఘాలు పోటీ చేయాల్సి ఉన్నా 13 సంఘాలు మాత్రమే నామినేషన్లు దాఖలు చేశాయి. ఏడో దఫా ఎన్నికలు, ఇందు కోసం సింగరేణి అధికార యంత్రాంగం, కార్మిక శాఖ సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ లోని 6 జిల్లాల పరిధిలో ఉన్న 11 డివిజన్ లలో, 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా,12 ఓట్ల లెక్కింపు కేంద్రాలను,440 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహించెందుకు సింగరేణి యాజమాన్యం పూర్తిగా ఏర్పాట్లు చేసింది. సింగరేణి విస్తరించి ఉన్న 11 ఏరియాలలో సింగరేణి సంస్థలో 50,500 కార్మికులు ఉన్నా 39,748 మంది కార్మిక ఓటర్లు తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరు లలోని 16 పోలింగ్ కేంద్రాలలో 5387 మంది సింగరేణి కార్మిక ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో నాలుగు ఏరియాల్లో మొత్తం 16 పోలింగ్ కేంద్రాలను ఏరియా కి ఒకటి చొప్పున నాలుగు లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలోని జేవీఆర్, కిష్టారం ఓసీలలో మొత్తం మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుండగా భద్రాద్రి కొత్తగూడెం ఏరియాలో 13 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగూడెం ఏరియాలో 6,ఇల్లెందు ఏరియాలో 3, మణుగూరు ఏరియాలో 7 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాత్రి ఏడు గంటల నుంచి లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపుకు 200 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. సింగరేణి ఎన్నికలను బ్యాలెట్ పద్దతిన నిర్వహించేందుకు కార్మిక శాఖ సంసిద్దమవుతోంది. అయితే ఎన్నికల నిర్వహణ, ఫలితాల వెల్లడి ఒకే రోజు కావడంతో ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది.
kothagudem
రేపు జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39 వేల 748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలను, 7 వందల మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం లలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలో జరగనున్న ఎన్నికలలో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. 1998 నుండి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తుండగా, తొలిసారి AITUC విజయం సాధించింది. ఇప్పటివరకు ఆరుసార్లు ఎన్నికలు నిర్వహించగా మూడుసార్లు AITUC, రెండుసార్లు TBGKS, ఒకసారి INTUC విజయం సాధించాయి.
Read Also..
Read Also..
తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే జనసేన మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. బీజేపీ పోటీ చేస్తున్న స్థానాల్లో జన సైనికులు మద్దతివ్వాలని కోరారు. కొత్తగూడెంలో జనసేన అభ్యర్థి సురేంద్రరావుకు మద్దతుగా పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం 1200 మంది ఉద్యమకారుల బలిదానంతో తెలంగాణ ఏర్పడిందన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పలికిన దాశరథి కృష్ణమాచార్యులను తాను స్ఫూర్తిగా తీసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఇదే నా ఇజం హ్యూమనిజం అని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యువతకు జనసేన అండగా ఉంటుందని వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. జనసేనాని పర్యటన నేపథ్యంలో ప్రగతి మైదానంలో లో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. ప్రగతి మైదానం నుండి భారీ కాన్వాయి తో ప్రకాశం మైదానానికి చేరుకోనున్నారు. బీజేపీ బలపరిచిన జనసేన కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి లక్కినేని సురేందర్ కు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. రాష్ట్రంల నలుమూలల నుంచి పవన్ కళ్యాణ్అ భిమానులు సభకు హాజరుకానున్నారు. బీజేపీ, జనసేన కార్యకర్తలు సుమారు 80 వేల మంది వరకు పవన్ సభకు హాజరు కానున్నట్లు అంచనా వేస్తున్నారు పార్టీ నేతలు.
Read Also..
Read Also..
బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఘాటైన ప్రేమ బంధం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి కే.నారాయణ ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్లు కేంద్రంలో బీజేపీ, తెలంగాణ బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నాయన్నారు. ఇన్నాళ్లు ఏం చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలు విడుదల చేస్తూ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ బీజేపీ కొత్తగా బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అసలు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీ వ్యక్తి బండి సంజయ్ను ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. లిక్కర్ కేసులో ఇరుక్కున్న కవితపై బండి సంజయ్ తీవ్రంగా విమర్శలు చేసినందుకే జీర్ణించుకోలేకనే తొలగించారని అన్నారు. దేశంలో అబద్దాలు చెప్పే వ్యక్తుల్లో ప్రధాని మోడీ నెంబర్ వన్, కేసీఆర్ నెంబర్ టూ అని ఎద్దేవా చేశారు. గతంలో సీఎం కేసీఆర్ తన కొడుకును సీఎం చేస్తానని ఎక్కడా చెప్పలేదని మరి ఇప్పుడు పలు ఇంటర్వ్యూలలో ఆ విషయం చెప్పానని ప్రకటనలు చేస్తూ సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ యువతను దగా చేశారని నారాయణ మండిపడ్డారు. కాంపిటీటివ్ ఎగ్జామ్ పెట్టడంలో, టీఎస్పీఎస్సీ పరీక్ష నిర్వహించడంలో, పేపర్ లీకేజీలు, కోర్టు కేసుల పేరిట ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బండారు సురేందర్ రెడ్డి.. బజార్లో ఉల్లిగడ్డలు అమ్మినట్టు ఆ పార్టీ టికెట్లు నమ్ముతున్నారని విమర్శించారు. కొత్తగూడెం టికెట్ను జలగం వెంకట్రావుకు 10 లక్షల రూపాయలకు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
కొత్తగూడెంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం అన్న కేసీఆర్.. ఎన్నికలు రాగానే ఆగమాగం కావద్దన్నారు. ఓటు ప్రజల చేతిలో వజ్రాయుధం..అన్నీ ఆలోచించి ఓటెయ్యాలన్నారు. ప్రతీ పార్టీ అభ్యర్థుల గురించి తెలసుకోవాలని.. అభ్యర్థి కంటే పార్టీ చరిత్ర చూసి ఓటెయ్యాలన్నారు. సింగరేణికి 134 ఏళ్ల చరిత్ర ఉందన్నారు.
సింగరేణి తెలంగాణ ఆస్తి అని చేత కాని దద్దమ్మల పార్టీ కాంగ్రెస్ పాలనలో సింగరేణి నష్టాల్లో కూరుకుపోయిందన్నారు. అందుకే కేంద్రానికి 49 శాతం వాటా ఇవ్వాల్సి వచ్చిందని తెలిపారు. తెలంగాణ వచ్చాక..బీఆర్ఎస్ పాలనలో సింగరేణి లాభాలను రూ.419 కోట్ల నుంచి…రూ.2,184 కోట్లకు తీసుకెళ్లామని కేసీఆర్ తెలిపారు.





Total views : 78020