కొత్తపేట మండలం పలివెల గ్రామం చౌదరిపురం సత్తెమ్మ తల్లి గుడి వద్ద రోడ్డు పై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం ఆచంటకు చెందిన ఆటో డ్రైవర్ బండి మోషే రావులపాలెం మండలం ముమ్మిడివరప్పాడు కు చెందిన చీమల మాధవరావు మోటార్ సైకిల్ పై వస్తుండగా ఇరువురు ఎదురెదురుగా ఆటో, బైక్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే ఇరువురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చీమల నరసింహారావు ఇచ్చిన పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Tag:
kothapeta
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడలో సోమవారం చేపట్టబోయే కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నేపథ్యంలో పోలీసుల ముందస్తు అరెస్టులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఏడుగురు అంగన్వాడీ సంఘ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించిన పోలీసులు. విజయవాడ బయలుదేరిన తమను బస్సు నుంచి దించివేసి రాత్రి వేళ స్టేషన్ కు తరలించారని చెబుతున్న అంగన్వాడీ కార్యకర్తలు.






Total views : 78260