కొడవలూరు మండల కార్యాలయంలో కొత్తగా మంజూరైన 117 పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. కొడవలూరు మండలంలో 8 తరగతి చదువుతున్న విద్యార్థులకు 350 ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైయస్సార్ పెన్షన్ కానుక కింద నెల్లూరు జిల్లాలో కొత్తగా 4 408 పెన్షన్లు మంజూరయ్యాయి. జగన్మోహన్ రెడ్డి జిల్లా మొత్తం మీద 3,19, 952 పెన్షన్లను అందిస్తున్నారు. ప్రతి నెల పెన్షన్ల కొరకు 95 కోట్ల 54 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. కొడవలూరు మండలంలో కొత్తగా 117 పెన్షన్లు మంజూరయ్యాయి. ఇప్పటివరకు మండలంలో 6,854 పెన్షన్లకు గాను నెలకు రెండు కోట్ల నాలుగు లక్షల తొంభై ఆరువేల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. ప్రతి విద్యార్థికి 33,000 విలువ చేసే ట్యాబ్లలను బైజుస్ కంటెంట్తో కలిపి అందిస్తున్నారు. మూడు నెలల్లో ఎలక్షన్ వస్తున్నాయని రకరకాల వేషాలతో జనాల్లో తిరుగుతూ ఇతర పార్టీల వాళ్లు డబ్బులు ఖర్చు పెడుతున్నారని, వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని ఫ్యాన్ గుర్తుకి ఓటెయ్యాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో చెప్పిన విధంగా మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 3000 రూపాయలు పెన్షన్ అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆయన అన్నారు.
Tag:
Kovuru MLA Nallapareddy Prasannakumar Reddy
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జోన్నవాడ గ్రామం నందు కొత్తగా మంజూరైన ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామానికి చెందిన మహిళలతో ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురైంది. స్థానిక మహిళలు ఇంటి స్థలం మంజూరు చేయాలంటూ కోవూరు ఎమ్మెల్యేని ఆశ్రయించిగా ఆయన ఆగ్రహంతో మీరు అంతా టీడీపీ వారు పంపిస్తే వచ్చారా అని మండిపడ్డారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ.. తాము ఏ పార్టీకి చెందిన వారము కాదని ఇళ్ల స్థలం కోసం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే తమపై విరుచుకుపడడం ఏమిటని బాధపడ్డారు.




Total views : 79188