మహిళ మెడలో బంగారు చైను దొంగలిస్తున్న నిందితున్ని బుధవారం మదనపల్లి ఒకటవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి ఒకటో పట్టణ సిఐ మహబూబ్బాషా, ఎస్ఐ హరిహర ప్రసాద్ మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లిలో పలుచోట్ల మహిళల మెడలో బంగారు గోలుసులను చోరీచేసిన నిందితుడుగా కురబలకోట మండలంలోని దాదంవారిపల్లెకు చెందిన సయ్యద్ మహబూబ్విరా కుమారుడు సయ్యద్ బహదూర్ (24). బెట్టింగులకు బానిసై మహిళ మెడలోని బంగారు గొలుసులు దొంగిలించాడు అని అన్నారు. ఈ క్రమంలో నిందితుడు ఐదు కేసుల్లో నేరం చేసినట్లు ఒప్పుకోవడంతో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. అరెస్టు చేసిన నిందితుడి వద్ద సుమారు ఆరు లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసి నట్లు తెలిపారు.
Latest Video News
డా,, బిఆర్ అంబేద్కర్ ఆశయాలు అమలు కావాలని, విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. దేశంలో ఆర్థిక సమానత్వం, సామాజిక సమానత్వం జగన్ పాటిస్తున్నారు అని, అందుకే జగన్ అంటే నాకు అత్యంత గౌరవం అన్నారు. పేదల పక్షపాతి సీయం జగన్ అని కొనియాడారు. విద్యావిధానం రాష్ట్రం లో మంచిగా అమలు అవుతుందని, ప్రతి పేదవాడికి విద్యా వైద్యం అందుబాటులో ఇవాళ ఈ రాష్ట్రం లో ఉందని అన్నారు. తెలంగాణ ఎన్నికల పై నారాయణ స్వామి స్పందిస్తు…తెలంగాణలో ఒక మతం పైనే అక్కడి రాజకీయం ఈ ఎన్నికలలో జరిగిందని, కేవలం కేసీఆర్, కేటీఆర్ టార్గెట్ గానే రాజకీయం జరిగిందని కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. దీనివల్ల పరోక్షంగా చంద్రబాబుకు మేలు, ఆ పార్టీ నాయకులకు ఆనందం జరిగింది అంతే తప్ప వేరే లేది కాదని ఎద్దేవా చేసారు. అభివృద్ధి ని అక్కడ అడ్డకుని కుతంత్రాలతో బీఆర్ ఎస్ ని ఓడించి కాంగ్రెస్ ని గెలిపించారు అని ఆరోపించారు.ఇదంతా ఎల్లో మీడియా, చంద్రబాబు ప్లాన్… రేవంత్ రెడ్డి ఇప్పటి కీ టీడీపీ మనిషే అని ఆరోపించారు. వరద ప్రాంతాలలో సహాయ చర్యలు జరుగుతున్నాయని, తిరుపతి కాళహస్తి, గూడూరు ప్రాంతాలలో నష్టం జరిగిందని వాళ్లకి సహాయ చర్యలు జరుగుతాయని అన్నారు. రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని ఎక్కవుగా పంట నష్టం జరిగిందని వాళ్లకి అంచనా వేసి త్వరలో నష్ట పరిహారం చెల్లిఇస్తాం అన్నారు నారాయణ స్వామి. రైతులను ఆదుకుంటామని 20 రోజుల్లో నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు మంత్రి.
పెను తుఫాన్ భీభత్సం సృష్టించినా ముందస్తు జాగ్రత్త లతో ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చూశాం. ఈ గొప్పదనం జిల్లా యంత్రాంగానికి చెందుతుంది. గ్రామ స్థాయిలో సచివాలయం నుంచి ఉన్నత స్థాయి వరకు పటిష్టమైన టీమ్ వర్క్ ఏపీ లో ఉంది. వ్యవసాయం, ఉద్యాన పంటలు నష్ట పోయిన రైతులకు సత్వర సాయం అందిస్తాం. పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న వారికి ఆర్థిక సహాయం చేసాం. పంట దెబ్బతిన్న రైతులని ఆదుకుంటాం. అంచనాలను సిద్ధం చేయమని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. జిల్లాలో పంట నష్టమైతే దాదాపుగా జరగలేదు.
విజయనగరం జిల్లా కొత్తవలస మండలం జోగయ్యపాలెంలో తుఫాన్ ప్రభావంతో 20 ఎకరాలకు పైగా పంట నష్టం జరిగింది. కొత్తవలస మండల కేంద్రంలో చిన్ని పాలెం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న జోగయ్యపాలెం లో తుఫాన్ కారణంగా వందలాది ఎకరాల పంట నీట మునిగింది. జాతీయ రహదారి పనులలో భాగంగా కాలువలు మూసివేయడం వలన ….వరద నీరు పంట పొలాలపైకి రావటంతో కోత కోసిన వరిపంట మొత్తం కొట్టుకుపోవడంతో రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ఎన్నికల కంటే ముందే అంగన్ వాడి అక్కా చెల్లమ్మల్లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతామన్న ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి హామీ నీటి మిద వ్రాతలుగా మిగిలిపోయ్యిందని ఆరోపించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామంజులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భాగ్య లక్ష్మిలు, రాష్ట్ర కమిటి ఉత్తర్వుల మేరకు ఈ నెల్ 8 నుంచి అంగన్వాడి సమస్యల పరిష్కారానికై డిసెంబెర్ 8 నుండి జరిగే అంగన్ వాడి నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఎపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్ యునియన్ (సిఐటియు) అద్వర్యంలో ర్యాలి నిర్వహించారు .ఈ ర్యాలి స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ మీదగా వైఎస్సార్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ మనవహరంగా నిలబడి అంగన్వాడి సమస్యల పరిష్కరించడమే కాకుండా పెండింగ్ లో నున్న వేతనాలు టి ఎ ,డి ఎ లు కూరగాయల బిల్లుల నిధులను వెంటనే విడుదల చేయాలనీ వారు నినాదాలు తెలియజేశారు .అక్కడ నుంచి ప్రభుత్వ సముదాయాల దగ్గర నున్న రాజ్యాంగ సృష్టి కర్త బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం డా.. బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేసి వారి నిరసనను తెలియజేశారు .అనంతరం వారు మీడియాతో మాట్లాడుతు అక్క చెల్లమ్మల అందరికి తోడుగా ఉంటానన్న జగనన్న మా అంగన్ వాడి అక్క చెల్లమ్మల కు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం చాల దురదృష్టకరం అన్నారు .నెల నెల వేతనాలు రాక అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉందన్నారు.అదే విదంగా గర్బవతులకు ,బాలింతలకు ,అంగన్ వాడి పిల్లలకు పౌష్టికాహారం కు కావాల్సిన గ్యాస్ కూరగాయలు ఇతర సరుకుల కోసం ఖర్చు చేసిన బిల్లులు సకాలంలో రాకపోవడం తో వర్కర్లు అంత రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు .రాష్ట్రంలో సుమారు 70 శాతం సెంటర్లు అద్దె భవనలలోనే కొనసాగుతున్నాయన్నారు .అద్దె బిల్లులు కుడా సక్రమంగా రాకపోవడంతో భవనాల యజమాను దారులు నుండి అద్దెలు చెల్లించాలంటూ ఒత్తిడిలు అధికం అయ్యాయన్నారు.వైఎస్సార్ సంపూర్ణ పౌష్టికాహారం కుడా సక్రమంగా పంపిణి కాకపోవడంతో లబ్ది దారులకు సరైన సమయంలో పంపిణి చేయలేక పోతున్నమన్నారు .ఎంటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న మా సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలో నున్న ఎపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్ యునియన్ (సిఐటియు) ఇతర కార్మిక సంఘాల మద్దతుతో మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మెను చేపట్టడం జరుగుతుందని వారు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఉఉపాధ్యక్ష రాలు ఖాజాబి, కోశాధికారి బంగారు పాప, రాయచోటి అధ్యక్షురాలు సిద్దమ్మ తో పాటు రాయచోటి ప్రాజెక్ట్ పరిదిలోనున్న అంగన్ వాడి లీడర్లు, వర్కర్లు, హేల్పర్లు పాల్గొన్నారు
దేశీయ స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. ఈరోజు కూడా మార్కెట్లు లాభాలను మూటకట్టుకున్నాయి. అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలు, చమురు ధరల్లో స్థిరీకరణ ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 358 పాయింట్లు లాభపడి 69,654కి చేరుకుంది. నిఫ్టీ 83 పాయింట్లు పెరిగి 20,938 వద్ద స్థిరపడింది.
తెలంగాణలో ఏర్పడే కొత్త ప్రభుత్వం ప్రజా సానుకూల పాలన అందించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూచించారు. ఆయన ఖమ్మం జల్లా నేలకొండపల్లిలో మీడియాతో మాట్లాడారు. కెసిఆర్ అనుసరించిన అహంకార వైఖరి కారణంగానే ఓటమి పాలయ్యారన్నారు. కేసిఆర్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేసేందుకు ప్రజలకు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా కనిపించిందని అన్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు ప్రభావంతో ఫలితాలు తారు మారయ్యాయని అన్నారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి, గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.
తుఫాన్ కారణంగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అన్నంపల్లి-పల్లంకుర్రు ఏటిగట్టు కుంగిపోతున్నది. కుండళేశ్వరం ప్రాంతంలో కిలోమీటర్ మేర కుంగి ఏటిగట్టు రహదారి ప్రమాదబరితంగా మారింది. ఇటివలే ఆధునికీకరణ చేసిన ఈ రహదారి ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన మండలాల ప్రజలకు రాకపోకలకు ముఖ్యమైన రహదారని, పూర్తి గా దెబ్బతినకముందే రక్షణ చర్యలు చెపట్టి ఆధునికీకరణ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
హైదరాబాద్ ఎల్పీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్బంగా మిగిలిన మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని భావించారు. అయితే, సీఎం పదవి దక్కని సీనియర్లు తమ శాఖలు..ప్రాధాన్యతల పైన ఇప్పటికీ హైకమండ్ పై ఒత్తిడి తెస్తున్నారు. సామాజిక సమీకరణాలు దెబ్బ తినకుండా మంత్రివర్గ కూర్పు చేయాలని కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. దీంతో..పూర్తి స్థాయి మంత్రివర్గం కాకుండా.. రేవంత్ సీఎంగా.. మరో ఆరుగురు మాత్రమే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో కొత్త మంత్రివర్గం పైన ఢిల్లీలో కసరత్తు జరుగుతోంది. రేవంత్ సీఎం కావటంతో ఇప్పుడు కొత్తగా పీసీసీ చీఫ్ పదవి మరొకరికి ఖరారు చేయాల్సి ఉంటుంది. ఇదే సమయంలో స్పీకర్ ఎంపిక సైతం కీలకంగా ఉంది. ప్రతిపక్షం బలంగా ఉండటంతో స్పీకర్ పదవికి ఎంపిక పైన ఆచి తేచి వ్యవహరిస్తున్నారు.
ఇక..రేవంత్ తో పాటుగా సామాజిక వర్గాల వారీగా సీనియర్లుకు ప్రమాణం చేసే అవకాశం ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఎస్సీ వర్గం నుంచి భట్టి విక్రమార్క, మాదిగ వర్గం నుంచి దామోదర రాజనర్సింహ, ఎస్టీ వర్గం నుంచి మహిళకు ఇచ్చేలా సీతక్క, మైనార్టీ వర్గం నుంచి షబ్బీర్ అలీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ వర్గం నుంచి ఒక సీనియర్ నేతకు అవకాశం ఉందని తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు జరిగితే మినహా ఈ ఆరుగురు ప్రమాణం చేయటం ఖాయంగా కనిపిస్తోంది.
భట్టి విక్రమార్కకు డిప్యూటీ సీఎం ఖరారైనట్లు తెలుస్తోంది. మంత్రి పదవుల కోసం ఢిల్లీ అగ్రనాయకత్వాన్ని పలువురు ప్రముఖులు కలుస్తున్నారు. జీ వినోద్ నేరుగా సోనియాను కలిసి మంత్రి పదవి కోరారు. ఈ రాత్రిలోగా కసరత్తు పూర్తయితే పూర్తి స్థాయి మంత్రివర్గం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే, కసరత్తు పూర్తి కాకుంటే ఈ ఆరుగురితో ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
పశ్చిమగోదావరి మిచౌoగ్ తుఫాన్ కారణంగా 15 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, నష్టపోయిన ప్రతి రైతుని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు తో కలిసి నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇప్పటికే మిల్లర్ల ను ఆదేశించామన్నారు . ఎక్కడైనా మిల్లర్లు ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని , రైతుల నుంచి చివరు గింజ వరకు కొనుగోలు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని దేనిని స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి మాట్లాడుతూ రైతులకు గోనే సంచులను కూడా ప్రభుత్వమే సరఫరా చేస్తుందన్నారు





Total views : 62194