Friday, June 19, 2026
News Navigation
Friday, June 19, 2026
News Navigation

Breaking

Friday, June 19, 2026
Home Andhra Pradesh సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన..

సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తల నిరసన..

by
Anganwadi workers protest

ఎన్నికల కంటే ముందే అంగన్ వాడి అక్కా చెల్లమ్మల్లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతామన్న ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి హామీ నీటి మిద వ్రాతలుగా మిగిలిపోయ్యిందని ఆరోపించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామంజులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భాగ్య లక్ష్మిలు, రాష్ట్ర కమిటి ఉత్తర్వుల మేరకు ఈ నెల్ 8 నుంచి అంగన్వాడి సమస్యల పరిష్కారానికై డిసెంబెర్ 8 నుండి జరిగే అంగన్ వాడి నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఎపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్ యునియన్ (సిఐటియు) అద్వర్యంలో ర్యాలి నిర్వహించారు .ఈ ర్యాలి స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ మీదగా వైఎస్సార్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ మనవహరంగా నిలబడి అంగన్వాడి సమస్యల పరిష్కరించడమే కాకుండా పెండింగ్ లో నున్న వేతనాలు టి ఎ ,డి ఎ లు కూరగాయల బిల్లుల నిధులను వెంటనే విడుదల చేయాలనీ వారు నినాదాలు తెలియజేశారు .అక్కడ నుంచి ప్రభుత్వ సముదాయాల దగ్గర నున్న రాజ్యాంగ సృష్టి కర్త బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం డా.. బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేసి వారి నిరసనను తెలియజేశారు .అనంతరం వారు మీడియాతో మాట్లాడుతు అక్క చెల్లమ్మల అందరికి తోడుగా ఉంటానన్న జగనన్న మా అంగన్ వాడి అక్క చెల్లమ్మల కు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం చాల దురదృష్టకరం అన్నారు .నెల నెల వేతనాలు రాక అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉందన్నారు.అదే విదంగా గర్బవతులకు ,బాలింతలకు ,అంగన్ వాడి పిల్లలకు పౌష్టికాహారం కు కావాల్సిన గ్యాస్ కూరగాయలు ఇతర సరుకుల కోసం ఖర్చు చేసిన బిల్లులు సకాలంలో రాకపోవడం తో వర్కర్లు అంత రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు .రాష్ట్రంలో సుమారు 70 శాతం సెంటర్లు అద్దె భవనలలోనే కొనసాగుతున్నాయన్నారు .అద్దె బిల్లులు కుడా సక్రమంగా రాకపోవడంతో భవనాల యజమాను దారులు నుండి అద్దెలు చెల్లించాలంటూ ఒత్తిడిలు అధికం అయ్యాయన్నారు.వైఎస్సార్ సంపూర్ణ పౌష్టికాహారం కుడా సక్రమంగా పంపిణి కాకపోవడంతో లబ్ది దారులకు సరైన సమయంలో పంపిణి చేయలేక పోతున్నమన్నారు .ఎంటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న మా సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలో నున్న ఎపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్ యునియన్ (సిఐటియు) ఇతర కార్మిక సంఘాల మద్దతుతో మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మెను చేపట్టడం జరుగుతుందని వారు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఉఉపాధ్యక్ష రాలు ఖాజాబి, కోశాధికారి బంగారు పాప, రాయచోటి అధ్యక్షురాలు సిద్దమ్మ తో పాటు రాయచోటి ప్రాజెక్ట్ పరిదిలోనున్న అంగన్ వాడి లీడర్లు, వర్కర్లు, హేల్పర్లు పాల్గొన్నారు

Advertisements

You may also like

Our Visitor

026056
Total views : 149809

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.