తిరుపతి, రేణిగుంట అంగన్వాడీల అరెస్టుకు సిఐటియు ఖండన. కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం అనే పేరిట శాంతియుతంగా విజయవాడకు వెళుతున్న అంగన్వాడీలను రేణిగుంటలో అరెస్టు చేయడాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేయబడ్డ మహిళలను తక్షణం విడిచి పెట్టాలని వారి ప్రజాస్వామ్యతమైన నిరసన కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేతగాక మహిళలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
Anganwadi workers protest
కాకినాడ జిల్లా, అంగన్వాడీల పై రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా ప్రకటించిన మేము భయపడేది లేదు ఆనాడు తమిళనాడు ప్రభుత్వం ఎస్మా ప్రకటించింది ఆ ప్రభుత్వం కనుమరుగయ్యింది. త్వరలో జగన్మోహన్ రెడ్డి అదే పరిస్థితి ఎదుర్కొంటాడు. కాకినాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ లు నైట్ కూడా దిక్షలు నిర్వహించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ నిరాహార దీక్షలకు దిగుతాం అని ప్రభుత్వానికి అంగన్వాడీ లు హెచ్చరిస్తున్నారు.
కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో ధర్నా చౌక్ నందు నిరవధిక ధర్నా నిర్వహిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు టీచర్లు. రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఈరోజు స్థానిక ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి కార్యక్రమానికి అంగన్వాడీలు పిలుపును ఇచ్చారు. అందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే నాని ఇంటికి అంగన్వాడి కార్యకర్తలు వస్తున్నారని సమాచారంతో వివరాలు తెలుసుకొని నేనే ధర్నా చౌక్ కి వస్తున్నాను అని తెలిపిన పేర్ని నాని. వచ్చి అంగన్వాడీ కార్యకర్తలతో ముఖాముఖి భేటీ అయి వారి సమస్యలను సానుకూలంగా విని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది. సమ్మె నిర్వహిస్తున్న అంగన్వాడి టీచర్లతో మాట్లాడి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఉదయం నుండి నిరోధిక నిరసన తెలియజేస్తున్న అంగన్వాడి టీచర్లకు అల్పాహారం ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని.
పల్నాడు జిల్లా, వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి. అంగన్వాడీలకు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మధ్య మాటల యుద్ధం. ఎమ్మెల్యే కార్యాలయం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు. సిఐటియు నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట సమస్య పరిష్కారిచేవరకు నిరసన చేస్తామంటున్న అంగన్వాడీలు. సీఎం డౌన్ డౌన్ అంటూ సిఐటియు నేతలు నినాదాలు. ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు.
కుప్పంలో అంగన్వాడి వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కుప్పం ఐసిడిఏస్ కార్యాలయం వద్ద నుండి పట్టణంలోని ఎమ్మెల్సీ భరత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ పీఏ కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ, అంగన్వాడి వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని గత 15 రోజులుగా సమ్మె చేపడుతున్న ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు. అంగన్వాడిలకు కనీస వేతనం అమలు చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు.అంగన్వాడిల సమస్యలను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఇప్పటికీ 4 సార్లు ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్ యూనియన్లతో చర్చించినా అంగన్వాడిల డిమాండ్లను పరిష్కరించలేదన్నారు.
పలాస లో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని ముట్టడించిన అంగన్వాడీలు. అడ్డుకున్న పోలీసులు, అంగన్వాడీలకు పోలీసులకు మధ్య వాగ్వాదం తోపులాట. మంత్రి అప్పలరాజు ఇంటి వద్ద బైటాయించి నినాదాలు తెలుపుతున్న అంగన్వాడీలు. ఆగదీ పోరాటం ఆకల మంటలు పోరాటం అంటూ పెద్ద ఎత్తున ప్రభుత్వం కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జగన్మోహన్ రెడ్డి మా యొక్క కష్టాలు నీకు తెలియడం లేదా. ఏసీల్లో నీవు ఎండల్లో మేమా అంటూ ఆందోళన. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు మంత్రి సిదిరి అప్పలరాజుకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్వాడీలందరూ ఇలా ఎండలో రోడ్డుపైకి రావడం దురదృష్టకరమన్నారు. అంగన్వాడీలు రకరకాలుగా తమ నిరసనలు తెలియజేయడంలో తప్పు లేదని కానీ జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని కించపరచడం బాధాకరమన్నారు.
కడప జిల్లా, తమ డిమాండ్లను పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామని అంగన్వాడీ కార్యకర్తలు స్పష్టం చేశారు. 16వ రోజు సమ్మెలో భాగంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిడిపిఓ కార్యాలయం నుంచి తాడిపత్రి రోడ్డు మీదుగా ఎమ్మెల్యే కార్యాలయానికి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా వచ్చారు. ఎమ్మెల్యే కార్యాలయానికి ఎదురుగా బయట నుంచి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 16 నెలలైనా తమ సమ్మెను విరమించబోమని చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే పిఏకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ లో అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డిసెంబర్ 12 నుండి తలపెట్టిన నిరవధిక సమ్మెను పోలీసులు భగ్నం చేశారు. విజయవాడలోని ధర్నా చౌక్ లో భారీ సంఖ్యలో పోలీసులు చేరుకుని ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న అంగన్వాడీలను విజయవాడలోని పలు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీలు తీవ్రస్థాయిలో ప్రతిఘటించారు.
తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు ఆందోళనలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులో అంగన్వాడీల నిరసనలు 15 వ రోజూ కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా కైకలూరు మండల పరిషత్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ప్లేట్లపై గరిటెలతో శబ్దాలు చేస్తూ ఆందోళనలు చేశారు. మాట ఇచ్చాడు జగనన్న …మడమ తిప్పాడు జగనన్న, ఇదేమీ రాజ్యం, ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం అంటూ అంగన్ వాడీలు నినాదాలు చేశారు.
కాకినాడ జిల్లాలో అంగన్వాడీల సమ్మె 14వ రోజు కొనసాతుంది. గత 14 రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం లేదని అంగన్వాడీలు వాపోయారు. పండగ మీక, పస్తులు మాకా అంటూ నినాదాలు చేశారు. క్రిస్మస్ పండగ రోజైన సీఎం జగన్ అంగన్వాడీలకు శుభవార్త చెప్తారని ఎదురు చూస్తున్నామని అంగన్వాడీలు ఆశగా ఎదురుచూస్తున్నారు.




Total views : 78488