గత తొమ్మిది రోజులుగా తమ సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలను ప్రభుత్వం పట్టించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, సమ్మె పైన దుష్ప్రచారం చేయడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పై ఏపీ అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ) ఆధ్వర్యంలో ఉలవపాడు ఐసిడిఎస్ ఆఫీస్ వద్ద లింగసముద్రం, ఉలవపాడు, గుడ్లూరు మండలాలకు చెందిన అంగనవాడి వర్కర్లు, హెల్పర్లు సుమారు 250 మంది ఈరోజు నిరసన తెలుపుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని నిరసించారు. అంగన్వాడీలు నిరవధిక సమ్మె తొమ్మిది రోజుల నుండి చేస్తున్న పట్టించుకోకపోవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలను ఉద్దేశించి సిఐటియు జిల్లా నాయకులు జీవిబి కుమార్, వాకా. లతా రెడ్డి, ప్రభావతి తదితరులు మాట్లాడారు. సమ్మెపై ప్రభుత్వం దుష్ప్రచారం చేయటాన్ని ఖండించారు. ప్రభుత్వం అనాగరికంగా అంగన్వాడి సెంటర్ల తాళాలు పగల గొట్టటం సిగ్గుచేటు అన్నారు. మహిళలకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వానికైనా తగిన శాస్తి జరుగుతుందన్నారు. ఇప్పటికైనా పట్టుదలకు పోకుండా, ప్రభుత్వం దిగివచ్చి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయాలని కోరారు. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో అంగన్వాడి సమ్మెకు మద్దతు ఇవ్వమని అంగన్వాడీల భిక్షాటన,ధర్నా. అనంతరం ఉలవపాడు మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ బొమ్మ సెంటర్ లో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఉలవపాడు మండల అధ్యక్షురాలు వాకాలాతారెడ్డి. ఉలవపాడు ప్రాజెక్టు లీడర్ సిహెచ్ ఇందిరావతి, అన్ని మండలాల నాయకులు ఎస్ కే పద్మజ, బీ మార్తమ్మ,కత్తి. బుజ్జమ్మ,మంచాలి సిహెచ్ పద్మజ, ఎం పద్మ, సిహెచ్ రమాదేవి, కాకర్లపూడి శైలజ, డి వరలక్ష్మి, డి రమాదేవి, సురేఖ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
Anganwadi workers protest
విజయనగరం జిల్లా, సమస్యల పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీల ధర్నా. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ర్యాలీ చేపట్టారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు వి.లక్ష్మి హెచ్చరించారు. మంగళవారం గజపతినగరం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు ఆందోళన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె బాట పట్టారు. అంగన్ వాడీ కేంద్రాలను మూసివేసి నిరసన తెలియజేయాలని నిర్ణయించడంతో తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన..ఆందోళన చేపట్టనున్నారు. అన్ని మండల కేంద్రాల్లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రధానంగా వేతనాల పెంపు, గ్రాట్యూటీ కోసం డిమాండ్ చేస్తున్న వర్కర్లు.. అంగన్ వాడీలలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తున్నారు. హెల్త్ కార్డులు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు.
అంగన్వాడి వర్కర్లకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు అంగన్వాడి కార్యకర్తలు.ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు.పక్క రాష్ట్రం తెలంగాణ కంటే అంగన్వాడీలకు ఎక్కువ జీతాలు ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీలకు 26 వేల జీతము , ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని లేనిపక్షంలో తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల ఆందోళన సమ్మెలో పాల్గొన్నారు.
ఎన్నికల కంటే ముందే అంగన్ వాడి అక్కా చెల్లమ్మల్లకు తెలంగాణ కన్నా అదనంగా వేతనం పెంచుతామన్న ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి హామీ నీటి మిద వ్రాతలుగా మిగిలిపోయ్యిందని ఆరోపించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్బవరం రామంజులు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భాగ్య లక్ష్మిలు, రాష్ట్ర కమిటి ఉత్తర్వుల మేరకు ఈ నెల్ 8 నుంచి అంగన్వాడి సమస్యల పరిష్కారానికై డిసెంబెర్ 8 నుండి జరిగే అంగన్ వాడి నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలంటూ అన్నమయ్య జిల్లా రాయచోటి లో ఎపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్ యునియన్ (సిఐటియు) అద్వర్యంలో ర్యాలి నిర్వహించారు .ఈ ర్యాలి స్థానిక తహసిల్దార్ కార్యాలయం నుండి బస్టాండ్ మీదగా వైఎస్సార్ సర్కిల్ వరకు కొనసాగింది. అనంతరం అక్కడ మనవహరంగా నిలబడి అంగన్వాడి సమస్యల పరిష్కరించడమే కాకుండా పెండింగ్ లో నున్న వేతనాలు టి ఎ ,డి ఎ లు కూరగాయల బిల్లుల నిధులను వెంటనే విడుదల చేయాలనీ వారు నినాదాలు తెలియజేశారు .అక్కడ నుంచి ప్రభుత్వ సముదాయాల దగ్గర నున్న రాజ్యాంగ సృష్టి కర్త బడుగు బలహీన వర్గాల ఆశా కిరణం డా.. బి ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వినతి పత్రం అందజేసి వారి నిరసనను తెలియజేశారు .అనంతరం వారు మీడియాతో మాట్లాడుతు అక్క చెల్లమ్మల అందరికి తోడుగా ఉంటానన్న జగనన్న మా అంగన్ వాడి అక్క చెల్లమ్మల కు ఇచ్చిన హామీలను అమలు చేయక పోవడం చాల దురదృష్టకరం అన్నారు .నెల నెల వేతనాలు రాక అనేక ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఉందన్నారు.అదే విదంగా గర్బవతులకు ,బాలింతలకు ,అంగన్ వాడి పిల్లలకు పౌష్టికాహారం కు కావాల్సిన గ్యాస్ కూరగాయలు ఇతర సరుకుల కోసం ఖర్చు చేసిన బిల్లులు సకాలంలో రాకపోవడం తో వర్కర్లు అంత రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు .రాష్ట్రంలో సుమారు 70 శాతం సెంటర్లు అద్దె భవనలలోనే కొనసాగుతున్నాయన్నారు .అద్దె బిల్లులు కుడా సక్రమంగా రాకపోవడంతో భవనాల యజమాను దారులు నుండి అద్దెలు చెల్లించాలంటూ ఒత్తిడిలు అధికం అయ్యాయన్నారు.వైఎస్సార్ సంపూర్ణ పౌష్టికాహారం కుడా సక్రమంగా పంపిణి కాకపోవడంతో లబ్ది దారులకు సరైన సమయంలో పంపిణి చేయలేక పోతున్నమన్నారు .ఎంటువంటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న మా సమస్యల పరిష్కారానికై రాష్ట్రంలో నున్న ఎపి అంగన్వాడి వర్కర్స్ & హెల్పర్ యునియన్ (సిఐటియు) ఇతర కార్మిక సంఘాల మద్దతుతో మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు నిరవధిక సమ్మెను చేపట్టడం జరుగుతుందని వారు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా ఉఉపాధ్యక్ష రాలు ఖాజాబి, కోశాధికారి బంగారు పాప, రాయచోటి అధ్యక్షురాలు సిద్దమ్మ తో పాటు రాయచోటి ప్రాజెక్ట్ పరిదిలోనున్న అంగన్ వాడి లీడర్లు, వర్కర్లు, హేల్పర్లు పాల్గొన్నారు





Total views : 78524