మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తనకు పోలీస్ ఎస్కార్ట్ కేటాయించడంతో అది తనకు అవసరం లేదంటూ పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాలని అన్నారు. తనను గెలిపించిన ప్రజలే తనకు బాడీ గార్డులు అని నిత్యం ప్రజలలో తిరిగే తనకు పోలీసుల అవసరం లేదని ప్రజల అవసరాల కోసం పోలీసులు నిత్యం పని చేస్తే చాలని నిన్న రాష్ట్ర డి ఐ జి చౌహన్, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్, అడిషనల్ ఎస్పీ రాములకు ఎమ్మెల్యే ప్రత్యేకంగా వినతులను సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లలో పోలీస్ సిబ్బంది తక్కువగా ఉండడం మరోవైపు గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే కోసం గంటలు తరబడి పోలీసులు పడిగాపులు కాస్తూ ఉండడంతో సమయం వృధా అయ్యేదని అలా కాకుండా తమ ప్రభుత్వ హయాంలో ఆ సమయాన్ని ప్రజల కోసం వెచ్చిస్తే ప్రజలకు న్యాయం చేసేవారు అవుతారని తాను నిత్యం ప్రజల్లో ఉండేవాడిని కనుక తనకు పోలీసుల సెక్యూరిటీ కూడా అవసరం లేదని ప్రజలకు న్యాయం చేస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఇలా ప్రభుత్వం ఏర్పడ్డ కొన్నాళ్లకే ఎమ్మెల్యే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకోవడం పట్ల జిల్లాలో ఇప్పుడు ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది.
Mahbubnagar District News
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గంలోని ఐదు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదువుతున్న పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కుటుంబ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందుల వల్ల మధ్యాహ్న భోజనం తెచ్చుకోలేక, కళాశాలకు సక్రమంగా హాజరు కావడం లేదు. ఈ విషయాన్ని గుర్తించిన జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి నియోజకవర్గంలోని ఐదు కాలేజీల్లో చదువుతున్న సుమారు 1300 మంది విద్యార్థుల ఆకలి తీర్చడం కొరకు నేడు జడ్చర్ల నియోజకవర్గం లోని ఐదు జూనియర్ కళాశాలలో ఎమ్మెల్యే తన సొంత నిధులతో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భోజనం వడ్డించి వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కళాశాలలో మౌఖిక వసతులకు సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. కళాశాలలో ఉపాధ్యాయులు బోధిస్తున్న విద్యాభ్యాసాన్ని సక్రమంగా అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. జడ్చర్ల నియోజకవర్గం విద్య, వైద్య రంగాలలో ముందంజలో ఉంచాలని అన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకుని ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేవిధంగా మన జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎక్కువ శాతం ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత స్థాయి రంగాల్లో విద్యార్థులు ఉండాలనేదే నా యొక్క ఆకాంక్షాన్ని తెలిపారు. కళాశాల మధ్యాహ్న భోజనం కార్యక్రమం పట్ల కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు జడ్చర్ల ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు ఉండడంతో గత ప్రభుత్వ హయాంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు వారిని బెదిరించి నెల నెల డబ్బులు వసూలు చేసే వారిని అలాగే సి ఎస్ ఆర్ ఫౌండేషన్ ద్వారా డబ్బులు ఇవ్వాలనుకుంటే పరిశ్రమల యాజమాన్యాలు తనకు ఇవ్వకుండా నేరుగా నియోజకవర్గంలోని విద్య, వైద్యం కోసం ఖర్చు చేయాలని ఆయన సూచించారు.




Total views : 80305