భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న మాఫియా ను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారుల పై దాడి చేసి చంపడానికి చేసిన కుట్రలను మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మంత్రి ఫోన్ లో జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఘటనపై పూర్తిగా విచారణకు ఆదేశించారు.
Tag:
Minister Konda Surekha
రాష్ట్రంలో అవినీతి లేని పారదర్శక పాలనే తమ ప్రభుత్వ లక్ష్యమని దేవాదాయ మరియు పర్యావరణ పరిరక్షణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పర్యా వరణాన్ని పరిరక్షించి ఆధ్యా త్మికతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని మంత్రి కొండా సురేఖ కోరారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా వరంగల్ నగరంలోని బట్టల బజార్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తనను 16 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఆధ్యాత్మికతను పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు సహకరించాలని కొండా సురేఖ కోరారు.





Total views : 80359