334
భద్రాద్రి జిల్లాలోని ఇల్లందు ఫారెస్ట్ డివిజన్ రేంజ్ పరిధిలో అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా తరలిస్తున్న మాఫియా ను అడ్డుకున్న ఫారెస్ట్ అధికారుల పై దాడి చేసి చంపడానికి చేసిన కుట్రలను మంత్రి కొండా సురేఖ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో మంత్రి ఫోన్ లో జరిగిన ఘటనను అడిగి తెలుసుకున్నారు. ప్రజా ప్రభుత్వం లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ఘటనపై పూర్తిగా విచారణకు ఆదేశించారు.





Total views : 194743