నిత్యం వేలాది మంది ప్రయాణికులు ప్రయాణించే చిన్న మామిడిపల్లి బ్రిడ్జి శిథిల వ్యవస్థకు చేరి ప్రమాదకరంగా తయారైన స్థానిక ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రజా ప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడం సిగ్గు చేటని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మండిపడ్డారు. నిత్యం రైల్వే స్టేషన్ కు చిన్నమామిడిపల్లి, నర్సాపురం, సరిపల్లి, కొప్పర్రు, మత్స్యపురి వైపుగా వేల మంది ప్రయాణికులు ఈ బ్రిడ్జిపై ప్రయాణిస్తూ ఉంటారని అటువంటి ఈ బ్రిడ్జ్ పేచ్చులు ఊడి కింద పడిపోవడంతో ఆ రంధ్రంలో ఎవరైనా కాలు పెడితే కాలు విరిగి పోవడం లేదా కాలువలో పడిపోవడం జరుగుతుందని ఇటీవల కాలంలో అనేకమంది ప్రమాదాలకు గురయ్యారని స్థానిక ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలోని అనేక చోట్ల రోడ్ల పరిస్థితి ఏమీ బాగో లేకపోయినా ప్రజలు సర్దుకుపోతున్నారని కనీసం పట్టణంలోని ఈ ప్రధానమైనటువంటి బ్రిడ్జి ఈ పరిస్థితుల్లో ఉంటే ఎమ్మెల్యే ప్రసాద్ రాజు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్యే ప్రసాద్ రాజు, అధికారులు తక్షణమే స్పందించి యుద్ధ ప్రాతిపదికన బ్రిడ్జి మరమ్మత్తు పనులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Tag:
mla prasad raju
పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం రామన్నపాలెం గ్రామంలో రూ.6 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగు రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజుతో కలిసి గ్రామంలో నూతనంగా నిర్మించిన రహదారులు, భవనాలను ప్రారంభించారు. గతంలో చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చారని ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. సీఎం జగన్ అక్క చెల్లెమ్మలకు అండగా నిలుస్తూ కోట్లాది రూపాయలు ఖాతాల్లో వేశారన్నారు.





Total views : 78504