కుప్పం మున్సిపల్ పరిధిలోని లక్ష్మిపురంలో వెలసిన శ్రీ ప్రసన్న వరదరాజ స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ భరత్ సతీమణి దుర్గమ్మ జన్మదినం సందర్భంగా కౌన్సిలర్ మణి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్సీ భరత్ మరియు ఆయన సతీమణి దుర్గమ్మ ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జగనన్నతో జనం – భరతన్న తో మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మహిళలకు పసుపు, కుంకుమ మరియు సారెను అందజేశారు. రాబోయే ఎన్నికల్లో భరత్ ను ఎమ్మెల్యేగా గెలిపించి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రేస్కో చైర్మన్ సెంథిల్ కుమార్, కౌన్సిలర్లు మణి, సోము శేఖర్ మరియు వైసీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Tag:
MLC Bharat
పలమనేరు నియోజకవర్గం 2014 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన సీనియర్ నాయకుడు ఆర్.వి సుభాష్ చంద్రబోస్, శుక్రవారం సాయంత్రం తాడేపల్లిగూడెం నందు, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్సీ భరత్, పలమనేరు ఎమ్మెల్యే వెంటే గౌడ్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయనకు సీఎం సూచించారని సమాచారం. గత ఆదివారం ఆత్మీయ సమావేశంలో ఏ పార్టీలో చేరుతారని ప్రశ్నించినప్పుడు, ఆత్మీయులు ప్రజలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని నేడు అధికార వైసీపీ పార్టీలో చేరారు. పలమనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఏనోట విన్నా “బోస్” వైసీపీ పార్టీలో చేరారన్నది హాట్ టాపిక్ గా మారింది.




Total views : 79413