హంద్రీనీవా నీరు కుప్పం నియోజకవర్గ వైపు ఈరోజు దూసుకువస్తుంది. కుప్పం అభివృద్ధి వైస్సార్సీపీ నె చేస్తుంది. ఎంపీ రెడ్డప్ప గత సంవత్సరం ఇచ్చిన హామీలను ఎన్నికల లోపు నెరవేర్చి ఓటు అడుగుతామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కుప్పం చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో హంద్రీనీవాను విడుదల చేసి మేము ఎన్నికలకు పోతామని ఎంపీ రెడ్డప్ప తెలిపారు. 35 సంవత్సరాల ఎమ్మెల్యే చంద్రబాబు చేయని అభివృద్ధి మేము చేశామని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్సీ భరత్, ఎంపీగా నన్ను గెలిపించాలని ప్రజలకు తెలిపారు. 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకి సాగు మరియు త్రాగునీరు ఇవ్వలేకపోయినా చంద్రబాబునాయుడుకు ఓటు అడిగే అర్హత లేదని ఎద్దేవా చేశారు.
Tag:
mp reddappa
రాష్ట స్థ్రాయి బాల బాలికల కబాడీ పోటీలను చౌడేపల్లి లో 3 రోజుల పాటు నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయి కబ్బడి పోటీల ను చౌడేపల్లి ఉన్నత పాఠశాలలో రాష్ట్ర కబాడీ సంఘం అధ్యక్షుడు రామచంద్ర ఆధ్వర్యంలో జరగనున్నాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు 13 జిల్లాల బాల బాలికలు పాల్గొంటారని నిర్వాహకులు, పాఠశాల పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ కబాడీ పోటీలను చిత్తూరు జిల్లా ఎం.పి.రెడ్డెప్ప ప్రాంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైకాపా కార్యదర్శి పెద్దిరెడ్డి ,ఎం.పి.పి.రామ్మూర్తి, జెడ్పిటిసి దామోదర్ రాజు తదితరులు పాల్గొన్నారు.




Total views : 79433