nadendla manohar
నెల్లూరు జిల్లాలో అతిపెద్ద భూ యజమానిగా ఇండోసోల్ కంపెనీ నిలిచిందని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైసీపీ నాయకులు 8,348 ఎకరాల భూమిని ఇండోసోల్ కంపెనీకి అన్న సంతర్పణగా చేశారని చేసిన ఆరోపణలను ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఖండించారు. పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్వి అసత్య ఆరోపణలు అని అభివర్ణించారు. పరిశ్రమలశాఖలో అభివృద్ధిని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ ముందు పరిశ్రమల శాఖపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు నాదెండ్ల మనోహర్కు వెన్నుపోటు వారసత్వంగా వచ్చింది. అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నాదెండ్ల భాస్కర్ రావు అన్న నందమూరి తారక రామారావుకు వెన్నుపోటు పొడిస్తే పవన్ కల్యాణ్కు నాదెండ్ల మనోహర్ వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్కు అవగాహన లేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం అలవాటుగా మారిందని అన్ని అంశాలపై అవగాహన తెచ్చుకుని మాట్లాడితే బాగుంటుందని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని మంత్రి గుడివాడ అమర్నాథ్ హెచ్చరించారు.
Read Also..
Read Also..
వైసీపీ ప్రభుత్వంలో రోజుకో స్కామ్ అనే నినాదంతో రెండో రోజు ప్రెస్ మీట్లో ఇండస్ట్రీస్ శాఖలో కుంభకోణంపై నాదెండ్ల మనోహర్ వివరాలు వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వ కేబినెట్ న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ అనే విధానాన్ని ఆమోదించింది.. ఇది కేవలం సీఎం కి అత్యంత సన్నిహితమైన రెండు మూడు కంపెనీల కోసమే ఈ పాలసీ తీసుకువచ్చారు. ఈ పాలసీ పేరుతో వైసీపీ వాళ్ళు స్కాండల్స్ చేస్తున్నారు.. రామాయపట్నం పోర్టు దగ్గర ఇండోసోల్ అనే కంపెనీకి 5,148 ఎకరాలు కేటాయించింది. తొలుత 10 సం. లీజు అని చెప్పారు. కొత్త పాలసీ పేరుతో ఆ కంపెనీ కాస్తా ఆ భూమికి లెస్సీ స్థాయి నుంచి ఓనర్ కి మారింది.. లీజు పేరుతో కేటాయించిన భూమి తాలూకు సర్వహక్కులను ఇండోసోల్ కి ధారదత్తం చేసి యజమానిని చేశారు.. అక్కడితో వీరి దోపిడీ ఆపలేదు. మరో 3200 ఎకరాలు పొందే విధంగా ప్రభుత్వమే ఫెసిలిటేటర్ గా వ్యవహరించబోతుంది. మొత్తంగా 8348 ఎకరాలను ఇండోసోల్ కి కట్టబెట్టారు.. ఇంతకీ ఈ ఇండోసోల్ సంస్థ వెనక ఉన్నది ఎవరంటే… షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్.. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ ఎవరిదో కాదు ముఖ్యమంత్రి సన్నిహితులదే.. అసలు ఇండోసోల్ అనే సంస్థ పుట్టి ఈ రోజుకి 1 సంవత్సరం 9 నెలల 12 రోజులు అయింది.. అంటే ఏడాది కిందట సృష్టించిన డమ్మీ కంపెనీ పేరుతో భూ దోపిడీ కోసం న్యూ ఇండస్ట్రియల్ లాండ్ పాలసీ తెచ్చారు..
ఏపీలో విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారన్నారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్నారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి 2400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వెల్లడించారు. టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్గా ఏర్పడ్డాయని తెలిపారు. నిధులు దారి మళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిందని వెల్లడించారు. గతేడాది ఫ్లాట్ ప్యానెల్స్ కు సంబంధించి నేటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. నాలుగు వందల కోట్ల రూపాయలతో ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగిందన్నారు.
ఏపీలో విద్యార్థుల సామగ్రి కొనుగోలులో భారీ కుంభకోణం జరిగిందని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే వస్తువుల నాణ్యత సరిగా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది రూ.1,050 కోట్లతో విద్యార్థులకు బ్యాగులు, షూస్ కొనుగోలు చేశారన్నారు. 42 లక్షల మంది పేద విద్యార్థుల కోసం కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్నారు. ఈ పథకం కింద మూడేళ్లలో సామగ్రికి 2400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని వెల్లడించారు. టెండర్ ప్రక్రియలో ఐదు కంపెనీలు సిండికేట్గా ఏర్పడ్డాయని తెలిపారు. నిధులు దారి మళ్లినట్లు ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలిందని వెల్లడించారు. గతేడాది ఫ్లాట్ ప్యానెల్స్ కు సంబంధించి నేటికీ డబ్బులు ఇవ్వలేదన్నారు. నాలుగు వందల కోట్ల రూపాయలతో ఫ్లాట్ ప్యానెల్స్ కొనుగోలు పేరిట మరో కుంభకోణం జరిగిందన్నారు.
జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కామెంట్స్గత సంవత్సరం నవంబర్ 2 వ తరికున పత్రిక సమావేశం ఏర్పాటు చేసి చెప్పాము మహిళ సాధికారత కోసం ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంది అని చెప్పింది అది మోసం అని ఆనాడే చెప్పడం జరిగింది. జగనన్న పాల వెల్లువ కార్యక్రమంలో పెద్ద మోసం జరిగింది ఆనాడే చెప్పాము అది జగనన్న పాల వెల్లువ కాదు పాపాల వెల్లువ అని 2,955 కోట్లు కోట్లు ఈ కార్యక్రమానికి ఖర్చు చేశామని చెప్తున్నారు ఎన్ని పశువులు ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. 8 వేలు మాత్రమే మీరు కొనుగోలు చేసింది ఈ స్కీం అంత సెర్ఫ్ ద్వారానే అమలు అవుతుంది ఇప్పటి వరకు ఏ బ్యాంక్ ఎంత అప్పు ఇచ్చింది అంటే లెక్కలు చూపించరు 15 లక్ష ల 76 వేలు లీటర్ల పాలు రావాలి మీరు కొనుగోలు చేసిన పాడి పశువులు ప్రకారం ఐతే 2 లక్షల లీటర్ లు వచ్చినవి అని ప్రభుత్వం చెబుత్వం సరైన లబ్దిదారులు లేకుండా బ్యాంకులు ఏ విధం గా రుణాలు ఇచ్చాయి దీనిపై బ్యాంక్ కూడా ఋణాలు ఇచ్చారు. కాబట్టి సీబీఐ ఏంక్విరీ వెయ్యాలి జనసేన పార్టీ ఛాలెంజ్ చేస్తుంది ఏ జిల్లా ఐనా మంత్రి గారినే ఎంపిక చెయ్యమనండి వారి తో మేము వస్తాం ఎన్ని పశువులు ఉన్నాయో చూపించండి నవంబర్ 14 తరువాత ఏ శాఖ లో ఎంత అవినీతి జరిగింది ప్రతి ఒక్కరికి వివరించే విధంగా రోజుకు ఒక స్కామ్ గురించి చెపుతాము. 2216 కోట్లు బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు లబ్ధిదారులను ఏ ప్రతిపాదికన ఎంపిక చేసారు. 737 కోట్లు సబ్సిడీ అన్నారు ఎంత మందికి సబ్సిడీ ఇచ్చారు. ప్రభుత్వమే ఒప్పుకుంది పశువుల రీసైక్లింగ్ చేసాము అని స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ మీటింగ్ లో ఇంత పెద్ద స్కామ్ జరిగింది ఈ ప్రోగ్రాం లో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ప్రజా సమస్యల పై మాట్లాడతారు





Total views : 78905