రేపు 20 వ తేదీన మధ్యాహ్నము 2గంటల నుండి పోలిపల్లి గ్రామంలో యువ గళం – నవ శకం, టీడిపి ఎన్నికల శంఖారావం సభకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అభిమానుల తో పాటు భీమవరం, చింతల పూడి నియోజక వర్గాల టీడీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని టీడిపి రాష్ట్ర కార్యదర్శి, భీమవరం AMC మాజీ చైర్మన్,చింతల పూడి నియోజక వర్గ పరిశీలకులు, భీమిలి తాత్కాలిక పరిశీలకులు కోళ్ళ నాగేశ్వర రావు కోరారు.
nara lokesh speech
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గొప్పతనం ఈ ప్రపంచానికి మెుత్తం తెలుసునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. గ్రామ స్థాయి నుండి మొదలు పెట్టి ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో కూడా చంద్రబాబుకి మద్దతుగా ఉద్యమాలు జరిగాయంటే అది ఆయన గొప్పతనం అని అన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, దేశంలో ఉన్న అనేక నేతలు చంద్రబాబుకి మద్దతు ఇచ్చారు అని లోకేశ్ చెప్పుకొచ్చారు. ‘చంద్రబాబు కుటుంబం, కుటుంబ సభ్యుల కంటే ఎక్కువుగా ప్రజల్ని ప్రేమించారు. ఆయనకి అండగా నిలబడటమే కాకుండా ఆయన చేసిన గొప్ప పనులు ఇప్పటి యువతకు తెలిసేలా చేసారు. ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యి నిజాన్ని గెలిపించిన అందరికీ ధన్యవాదాలు. ఏ తప్పూ చేయని మమ్మల్నే కేసులు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి వస్తే 38 కేసులు, 43 వేల కోట్ల ప్రజాధనం దోచేసిన వాళ్లను ఎం చెయ్యాలి. ల్యాండ్, స్యాండ్, వైన్, మైన్ మాఫియా డాన్గా జగన్ మారారన్నారు. మూడు నెలల్లో జగన్ పర్మినెంట్గా జైలుకి పోవడం ఖాయం. ఈ వైసీపీ నేతలు ఎక్కడికి పోతారు, మంత్రులు ఎక్కడికి పోతారు రేపు అవినీతి కి పాల్పడిన టోటల్ వైసీపీ ఇన్ జైల్. జైలర్ ఎవరో తెలుసా… చంద్రబాబు. మీ తాట తీస్తారు. ఇది ఖాయం రాసిపెట్టుకోండి. చలి కాలంలో ఫ్యాన్ కి ఉక్కపోత మొదలైంది. మూడు నెలల్లో ఫ్యాన్ మాడిపోవడం ఖాయం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హెచ్చరించారు.
యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర వివరాలు
ఈరోజు నడిచిన దూరం 15.4 కి.మీ. ఇప్పటివరకు నడిచిన మొత్తం దూరం 2867.8 కి.మీ. 211వరోజు (28-11-2023) యువగళం వివరాలు అమలాపురం/ముమ్మడివరం అసెంబ్లీ నియోజకవర్గాలు…
ఉదయం
8.00 – పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.
9.00 – పేరూరు క్షత్రియ కళ్యాణ మండపం వద్ద ఆక్వా రైతులతో భేటీ.
10.00 – అమలాపురం హైస్కూలు సెంటర్ లో బిసిలతో సమావేశం.
10.15 – అమలాపురం క్లాక్ టవర్ సెంటర్ లో చేనేతలతో సమావేశం.
10.30 – అమలాపురం ముమ్మడివరం గేటు వద్ద దివ్యాంగులతో సమావేశం.
10.45 – అమలాపురం పుల్లయ్య రామాలయం వద్ద గంగిరెడ్డి సామాజికవర్గీయులతో భేటీ.
11.00 – అమలాపురం వెంకటేశ్వరస్వామి గుడివద్ద కాపులతో సమావేశం.
12.30 – భట్నవిల్లిలో ఎస్సీ సామాజికవర్గీయులతో సమావేశం.
12.40 – భట్నవిల్లిలో యువతతో ముఖాముఖి.
1.40 – భట్నవిల్లిలో భోజన విరామం.
సాయంత్రం
4.00 – భట్నవిల్లి నుంచి పాదయాత్ర కొనసాగింపు.
4.30 – పాదయాత్ర ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గంలోకి ప్రవేశం.
5.00 – అనంతవరం సెంటర్ లో స్థానికులతో సమావేశం.
6.00 – గున్నేపల్లిలో స్థానికులతో సమావేశం.
7.45 – ముమ్మడివరంలో స్థానికులతో సమావేశం.
8.30 – ముమ్మడివరం ఉమెన్స్ కాలేజి వద్ద విడిది కేంద్రంలో బస.






Total views : 78784