అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టాపన సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తి ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో శ్రీ సీత రాముల ఉత్సవ విగ్రహాలను సోమవారం పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ముందుగా వేణుగోపాలస్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామభక్తులు ఆర్యవైశ్య మహిళ మండలి కమిటీ సభ్యులు కోలాటం చేస్తూ రామనామం జపిస్తూ నృత్యాలు చేస్తూ కోటలోని కోదండ రామస్వామి ఆలయం వరకు కాషాయ జెండాలు పట్టుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలతో ఊరేగింపు నిర్వహించారు. పురవీధులు రామనామంతో మారుమోగాయి. అనంతరం కోదండ రామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల స్వామివారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తాదులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసారు. మధ్యాహ్నం వివిధ గ్రామాల నుంచి వచ్చిన భక్తాదులకు ఆలయం వద్ద భోజన వసతి ఏర్పాటు చేశారు.
news
శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ సమీపంలో 44వ జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లీ కొడుకు మృతి చెందగా ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. పోలీసుల వివరాలు ప్రకారం తమిళనాడు రాష్ట్రం కంచి నుండి ధర్మవరం తిరిగి వస్తుండగా పెనుకొండ సమీపంలో కారు బోల్తా పడడంతో ధర్మవరం చెందిన ఒకే కుటుంబం తల్లీ తులసమ్మ, కుమారుడు పార్థసారధి ఘటనలోనే మృతి చెందడం మిగిలిన ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వీరిని అనంతపురం ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. వీరిలో ఇద్దరు పరిస్థితి తీవ్రంగా ఉంది. వీరంతా ధర్మవరం నుంచి కంచి దైవ దర్శనం కి వెళ్లి తిరుగు ప్రయాణంలో పెనుకొండ వద్ద ప్రమాదం చోటు చేసుకోవడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
తిరుపతి జిల్లా, చంద్రగిరి భాకరాపేట ఘాట్ రోడ్డులో బోల్తా పడ్డ ప్రైవేటు బస్సు. నలుగురికి కాళ్ళు చేతులు విరగ్గా పది మందికి పైగా గాయాలు. తిరుపతి-మదనపల్లి ప్రధాన రహదారి లోని చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో గల భాకరాపేట ఘాట్ రోడ్డు లో మలుపు వద్ద ఘటన. బళ్ళారి నుంచి చెన్నైకి 40మంది ప్రయాణికులతో వస్తున్న ప్రవేట్ బస్సు. తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేక్ ఫెయిల్ కారణంగా ప్రమాదం జరిగింది అంటున్న డ్రైవర్. 4 అంబులెన్స్ లలో తిరుపతి రుయా ఆస్పత్రి కు తరలింపు. ప్రమాద ఘటన స్థలానికి చేరుకున్న చంద్రగిరి పోలీసులు సహాయక చర్యలు.
గ్రేటర్ వరంగల్ మునిసిపల్ పరిధిలో చిన్నారులపై విధి కుక్కల దాడి. 21 వ డివిజన్ ఎల్బీనగర్ లో ఘటన. ఇద్దరు చిన్నారుల పై కుక్కల దాడి. సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు. హాస్పటల్ కి తరలించిన స్థానికులు. గాయపడ్డ వారిలో ఒక బాబు పరిస్థితి విషమం. రోజురోజుకు కుక్కల దాడులు పెరుగుతున్న కూడా చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు.
విజయవాడ లో అర్దరాత్రి ధర్నాచౌక్ వద్ద అంగన్వాడీల టెంట్లు పీకేసిన పోలీసులు. అడ్డుపడిన అండగన్వాడీల అరెస్ట్ చేసిన పోలీసులు. నేడు చలో విజయవాడకు పిలుపునిచ్చిన అంగన్వాడీలు. ఇప్పటికే బస్టాండ్ , రైల్వేస్టేషన్ లలో పికెటింగ్ నిర్వహిస్తూ అంగన్వాడీలు ను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. ఎస్మాచట్టం అమలులో ఉంది కాబట్టి చలో విజయవాడ కు అనుమతి లేదన్న సీపీ. అంగన్వాడీలపై చర్యలకు సిద్దమవుతున్న ప్రభుత్వం. విధులకు హాజరు కాని అంగన్వాడీల తొలగింపుకు ఉత్తర్వులు సిద్దం చేసిన కృష్ణాజిల్లా, పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్లు. 42 రోజులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న అంగన్వాడీలు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం కోడి కత్తి శ్రీనును వెంటనే విడుదల చేయాలంటూ అమలాపురంలో దళిత సంఘాల ఆందోళన. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో దళిత సంఘాల ఆందోళన. జైల్లో ఉన్న కోడి కత్తి శ్రీను వెంటనే విడుదల చేయాలంటూ గడియార స్తంభం సెంటర్లో నిరసన ర్యాలీ చేసిన దళిత సంఘాలు. నిందితుడు అనంత బాబును వదిలేసి దళిత యువకుడు కోడి కత్తి శీను జైలా అంటూ ఆందోళన. ఐదు సంవత్సరాలుగా జైల్లో మగుతున్న కోడి కత్తి శ్రీనుకు సాక్ష్యం చెప్పని ముఖ్యమంత్రి జగన్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి డబ్బా కొట్టుకుంటున్న ముఖ్యమంత్రి జగన్. నిందితుడు అయిన అనంత బాబుకు బెయిల్ ఇచ్చి దళిత యువకుడి కి బెయిల్ ఇవ్వకపోవడం దారుణం. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కోర్టుకు హాజరై కోడి కత్తి శ్రీనుకు బైల్ ఇప్పించాలి. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు చేపడుతామటూ హెచ్చరించిన దళిత సంఘాల నేతలు. గడియార స్తంభం సెంటర్లో ఆందోళన నిరసన ర్యాలీ చేపట్టిన దళిత సంఘం నేతలు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం అంగన్వాడీ కార్యకర్తలు విజయవాడలో సోమవారం చేపట్టబోయే కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నేపథ్యంలో పోలీసుల ముందస్తు అరెస్టులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఏడుగురు అంగన్వాడీ సంఘ నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించిన పోలీసులు. విజయవాడ బయలుదేరిన తమను బస్సు నుంచి దించివేసి రాత్రి వేళ స్టేషన్ కు తరలించారని చెబుతున్న అంగన్వాడీ కార్యకర్తలు.
డా.బి.ఆర్.అంభేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం అయోధ్య శ్రీ రామయ్య విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా ముమ్మిడివరం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గ్రామోత్సవం. వేకువజామునే బాజా భజంత్రీలు, భజనలతో ఉమా సూరేశ్వర స్వామి ఆలయం వద్ద నుండి శ్రీ సీతారామ స్వామివారిని పల్లకీ సేవగా ప్రారంభమై ముమ్మిడివరం లో పలు రామాలయాల మీదుగా రామనామా సంకీర్తనలతో ముమ్మిడివరంలో సాగిన గ్రామోత్సవం. పాల్గొన్న భక్తులు..
తిరుపతి, రేణిగుంట అంగన్వాడీల అరెస్టుకు సిఐటియు ఖండన. కోటి సంతకాలతో జగనన్నకు చెబుదాం అనే పేరిట శాంతియుతంగా విజయవాడకు వెళుతున్న అంగన్వాడీలను రేణిగుంటలో అరెస్టు చేయడాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేయబడ్డ మహిళలను తక్షణం విడిచి పెట్టాలని వారి ప్రజాస్వామ్యతమైన నిరసన కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని పోలీసులకు ఆయన విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేతగాక మహిళలపై నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు.
వైద్య సేవల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం. డేగల ప్రభాకర్… ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని తెలుగుదేశం పార్టీ గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్ అన్నారు. నగరం లో ప్రతి ఆదివారం నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంప్ లో భాగంగా ఈ రోజు తూర్పు నియోజకవర్గంలోని శారదకాలని 32 వ లైన్ లో నిర్వహించారు. ఈ క్యాంప్ లో 4 డాక్టర్ల బృందం ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులను పంపిణి చేశారు. ఈ వైద్య శిభిరం లో సుమారు 280 మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నిజానికి టెక్నాలజీ రోజుల్లో అన్ని సమస్యలకు మందులు ఉన్నప్పటికీ పెద్దపెద్ద రోగాలకు ముందుగా మనం భయపడే తీరు మన రోగాన్ని పెంచుతుందన్నారు. ఇందులో నిరుపేదలు, మధ్యతరగతి కుటుంబాలు అయితే మరింత దయనీయంగా ప్రతినిత్యం బాధపడుతూన్నారన్నారు. అలంటి వారి కోసం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ లు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికి నగరంలో 6 మెడికల్ క్యాంప్ లు నిర్వహించామన్నారు. ఓపిక లేక, ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోలేని వృద్ధుల కోసం, ఆర్థిక సంపాదన లేని సామాన్య ప్రజల కోసం, వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. పేద ప్రజలకు మంచి వైద్యం అందించాలన్నది తమ ఆశయం అన్నారు. ముఖ్యంగా పేద ప్రజలు పెద్దఎత్తున తరలి వచ్చి మెడికల్ క్యాంపు సేవలు సద్వినియోగం చేసుకోవడం చాలా సంతోషముగా ఉందన్నారు. పేద ప్రజలకు అవసరసమైన వైద్య సేవలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందనీ ఆరోపించారు. కేవలం వైద్య పరీక్షలు చేయడం మాత్రమే కాకుండా, వారికి అవసరమైన మందులు కూడా పంపిణీ చేస్తున్నాం అన్నారు. ఈ మెగా మెడికల్ క్యాంపుకు ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని, పెద్ద సంఖ్యలో రోగులు నిష్ణాతులైన వైద్యుల వద్ద వైద్య చికిత్సలు అందించుకున్నారు. వైసీపీ కేవలం మాటల ప్రభుత్వమని మండిపడ్డారు. ఏ ఒక్క ప్రభుత్వం వైద్యశాలలో కనీస సౌకర్యాలు లేవని, డాక్టర్లు కూడా అందుబాటులో లేరన్నారు. ప్రజలు ఆరోగ్యం పట్ల జగన్ రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కార్యాక్రమమం లో డాక్టర్ అన్వేష్, డాక్టర్ రాజా, డాక్టర్ గోపి, డాక్టర్ పవన్, చిట్టెం సింధు, మహంకాళి నరసింహారావు, యర్రమల కిరణ్, సౌపాటి రత్నం, మల్లెంపూడి శ్రీను, కొత్తూరి వెంకట్, లింగంగుంట్ల ఆదాం, రాయవరపు బాబురావు, బాజీ మాస్టర్, నిశంకరరావూ అమర్నాధ్, కొండెపు శేఖర్, బండ్లమూడి రాధమ్మ, చౌదరి శ్రీను, కొలగాని సుబ్బారావు, బొక్కిసమ్ శివరామ్, అడపా ప్రసాద్ బాబు, బీరం శ్రీనివాసరావు, షేక్ సుభాని, జనసేన నాయకులూ శ్యాం, కిషోర్, దళవాయి భార్గవ్, వెంకటేశ్వర్లు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.