news
రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల నియోజకవర్గం ఈ రోజు అయోధ్యలోని రామ మందిరం లో బాల రాముని విగ్రహ ప్రతిష్టించుకోవడం కోసం 500 సంవత్సరాలు వేచి చూశామని ఈరోజు నెరవేరిందని విగ్రహన్ని ప్రతిష్ట చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని రామభక్తులు వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ప్రతి ఊరు వాడ భక్తిశ్రద్ధలతో శ్రీరామ నామంతో మారుమోగింది వీధి వీధి వాడవాడ భక్తిశ్రద్ధలతో చిన్నలు పెద్దలు అన్న తేడా లేకుండా శ్రీరామ నామస్మరణతో మారుమోగించారు. హిందువుల యొక్క చిరకాల కోరిక అయోధ్య రామ మందిరం నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉన్నదని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఈరోజు భారతదేశనికే కాకుండా ప్రపంచ దేశంలో కూడా రాముని యొక్క ప్రతిష్టను పొగుడుతూ రాముని యొక్క గుణగణాలను కీర్తిస్తు దేశంలో మళ్ళీ రామరాజ్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని వ్యక్తం చేసారు.
శంషాబాద్ విమానాశ్రయంలో భారీ మొత్తంలో డ్రగ్ పట్టుబడింది. ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి రూ.41 కోట్ల విలువ చేసే 5.92 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. నిందితురాలు జాంబియాకు చెందిన లుసాకాగా గుర్తించారు. హెరాయిన్ను డాక్యుమెంట్ ఫోల్డర్లో దాచి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఆమె పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణాజిల్లా, పెనమలూరు నియోజకవర్గం అంగన్వాడీలు అనుకుని రైతు కూలీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఎక్కడికక్కడ అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. కంకిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో రైతు కూలీలను అంగన్వాడీ కార్యకర్తలు అనుకుని అత్యుత్సాహం ప్రదర్శించిన పొలిసులు. కూలీలు మేము అంగన్వాడీ కార్యకర్తలు కాదు అని చెప్తున్న వినకుండా వారిని స్థానిక ఒక ఫంక్షన్ హల్ కు తరలింపు. అదే ఫంక్షన్ హల్ లో అప్పటికే అదుపులో తీసుకున్న అంగన్వాడీ కార్యకర్తలు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన రైతు కూలీలు. చివరికి రైతు వచ్చి మా పొలంలో పనికి వచ్చిన కూలీలు అని చెప్పిన తర్వాత వారిని వదిలిన పోలీసులు.
శ్రీకాకుళం జిల్లా, టెక్కలి అయోధ్య లో రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్ల కల నేడు సఫలం అయినందున ఆనందం లో దేశం లో అందరూ ఒక్కసారిగా చాలా సంతోషకరంగా తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టారు. అదే విధంగా టెక్కలిలో భారీగా ఊరేగింపులు జరపడంతో పాటు భక్తులు జై శ్రీరామ్ అంటూ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసారు.
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన సీఐటీయూ నాయకులు, అంగన్వాడీలు. పోలీస్ స్టేషన్ ముందు ఒక్కసారిగా రహదారిపై బైఠాయించిన అంగన్వాడీ ఉద్యోగులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు. స్థంబిస్తున్న ట్రాఫిక్. రోడ్ పై బైఠాయించిన వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న పోలీసులు. అడ్డుకున్న అంగన్వాడీ ఉద్యోగులు. పోలీసులు, అంగన్వాడీ వర్కర్స్ మద్య పెనుగులాట, ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి పోలీసుల పై తిరగబడుతున్న అంగన్వాడీ ఉద్యోగులు. అదుపులోకి తీసుకోబోయే మహిళా పోలీసులను రోడ్డుపై కూర్చోబెట్టిన అంగన్వాడీ వర్కర్. పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న అంగన్వాడీ వర్కర్స్. నిలువరించలేకపోతున్న పోలీసులు సీఐ మోహన్ రెడ్డి రంగప్రవేశం. పోలీసులను కొడతారా అంటూ అంగన్వాడీ ఉద్యోగులు, సీఐటీయూ నాయకుల పై మండిపడ్డ సీఐ. మహిళా పోలీసుల వల్ల కాకపోవడంతో సీఐ, ఎస్సై కలిసి మహిళలను వాహనం ఎక్కించి తరలిస్తున్న వైనం. పోలీస్ స్టేషన్ లోపల అరుపులు వినపడటంతో మీడియా ప్రతినిధులు లోపలికి వెళ్ళటానికి ప్రయత్నం చేసినా. పోలీసులు గేట్లు వేసి మీడియాని లోపలికి అనుమతించని పరిస్థితి.
కాకినాడ జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 42వ రోజుకు చేరుకుంది ఒక పక్క ప్రభుత్వం విధులకు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరవించేది లేదని కాకినాడ కలెక్టరేట్ వద్ద సమ్మె చేస్తున్న అంగన్వాడీలు వెల్లడించారు. తమని చలో విజయవాడ పిలుపులో భాగంగా పోలీసులు నిన్న రాత్రి అరెస్ట్ చేశారని మమ్మల్ని చంపిన మేము సమ్మె విరమించేది లేదంటున్న అంగన్వాడీలు.
అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఏలూరులో ధర్మబేరి ప్రాంగణంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రారంభించారు. ఉదయం నుండి హనుమాన్ చాలీసా పారాయణం, అనంతరం యాగ కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలతో పాటు పలువురు ముస్లిం సోదరులు పాల్గొని అయోధ్య లోని బాలరామ విగ్రహ ప్రతిష్టకు సంఘీభావం తెలిపారు.
కాకినాడ, కళ్ళు చేదిరేలా కాకినాడ శోభాయాత్ర. కాకినాడ నగరం వేలాది మంది మార్వాడీలతో కళకళ లాడింది. గుజరాత్ కి చెందిన వందలాది మంది మార్వాడి మహిళలు, యువత, యువకులు ఆనందంగా శోభాయ మానం గా నృత్యాలు చేస్తూ అయోధ్యరామునికి స్వాగతం పలికారు. నగరంలో ఎన్నో మతాలు, కులాలు ఉన్నాయి. వారెవరు చేయని విధంగా మార్వాడీలు అతిపెద్ద కార్యక్రమాన్ని నిర్వహించి ఆయోద్యకే పేరు తెచ్చేలా అందరి మన్ననలు చూరగొన్నారు.
మంచిర్యాల జిల్లా, మందమర్రి అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా మందమర్రి పంచముఖి ఆంజనేయ దేవాలయం నుండి పురావిధుల్లో 500 బైక్ ర్యాలీ పెద్ద ఎత్తున మార్కెట్లో సెంటర్ వరకు నిర్వహించిన అయోధ్య రాముని శోభయాత్రలో పాల్గొన్న హిందూ ఉత్సహం కమిటీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించరు. మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో ఈరోజు వ్యాపార సంఘం వారు ఆధ్వర్యంలో నిర్వహించిన నగర సంకీర్తనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 500 సంవత్సరాల హిందువుల చిరకాల స్వప్నం ఈరోజు నెరవేరనుందని తెలిపారు. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ఈ క్షణం ఈరోజు వచ్చిందిదని అన్నారు. ప్రతి ఇంటి లొ సాయంత్రం ఐదు దీపాలు పెట్టుకోవాలి రాత్రి దీపావళి టపాసులు పేల్చడం, సంతోషం తో జరుపుకోవాలని అన్నారు.