అనంతపురం జిల్లాకు చంద్రబాబు రానున్నారు. టీడీపీకి కంచుకోటలాంటి ఉరవకొండ నియోజకవర్గంలో రా.. కదిలిరా సభలో పాల్గొనబోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే, అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ప్రత్యేక ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఎల్ఇడి స్క్రీన్లు, భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
Tag:
Payyavula Keshav
ఏపీ టీడీపీ సీనియర్ నేతలు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో ఓటరు జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఫిర్యాదు చేశారు. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నేతృత్వంలో యనమల రామకృష్ణుడు, కనకమేడల రవీంద్ర కుమార్, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఎన్నికల సంఘం కార్యాలయానికి వెళ్లారు. ఏపీలో పెద్ద సంఖ్యలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని, అర్హులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని ఈసీకి వివరించారు. టీడీపీ మద్దతుదారుల ఓట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తి చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతల ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారని, తప్పుడు ఓటర్ల జాబితాలు రూపొందిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.





Total views : 92843