మందమర్రి మండల ప్రజాపరిషత్లో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో గుర్రం మంగ, మండల ప్రెసిడెంట్ అధ్యక్షతన ఎంపీడీఓ శశికళ, వ్యవసాయ చైర్మన్ ప్రభాకర్ రావు, తహసీల్దార్ కే. చంద్ర శేఖర్ జడ్పిటిసి, వేల్పుల రవి, ఎంపిటిసిలు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ లోని పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో పామెయిల్ ప్యాకెటరీ గురించి అగ్రికల్చర్, విద్య, వైద్య, విద్యుత్, వాడి వేడి ఫై అధికారులు తో చర్చ జరిగింది ఫై సమస్య లు తలెత్తకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని పలు సమస్యలుఫై సర్పంచ్ లు నిలదీశారు. అధికారులు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యహరిస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
Plenary meeting
పార్టీలకతీతంగా జిల్లాను అభివృద్ధిలోకి తీసుకెళ్లేందుకు కలిసికట్టుగా కృషి చేయాలని బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు మాణిక్యరావు, సునీత లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్ లు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా నిర్వహించిన సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది. సంగారెడ్డిలోని జడ్పి సమావేశ మందిరంలో జిల్లా ప్రజా పరిషత్ సర్వే నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు ప్రజా సంక్షేమానికి, సమస్యలను పరిష్కరించేనందుకు ముందు ఉండాలన్నారు. టిఆర్ఎస్ ప్రజా సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని వారు కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ క్రాంతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు రోడ్లు, మంచినీటి సౌకర్యాలతోపాటు అర్హులకు అందేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమాన్ని చేపట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేసేందుకు చర్యలు చేపడుతుందని అన్నారు. ప్రజలకు మేలు చేసే గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పలువురు జెడ్పిటిసిలు, ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.




Total views : 80339